Sunday, March 15, 2026
35.3 C
Hyderabad

పార్లమెంటుకు ప్రజాసమస్యలు పట్టవా!?|EDITORIAL

పట్టు విడుపులు లేని అధికార, ప్రతిపక్ష పార్టీల పంతాల మధ్య ప్రజా సమస్యలు గాలికిపోతున్నాయి. అసలు ఆయా సమస్యలు చర్చకు రాకుండా పోవడమే కాకుండా, విలువైన సభా సమయం, ప్రజాధనం వృథా అవుతున్నాయి. దీంతో మన సమస్యలను చర్చించండి, పరిష్కారాలు కనుక్కోండని దేశ అత్యుతన్నత సభలకు పంపిస్తే, ఆ సభల్లో మన ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు జుగప్సాకరంగా మారుతున్నది. ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక పార్లమెంటు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు విపక్షం పట్టుపడుతుంటే, ఆ చర్చకు తావులేకుండా అధికార పార్టీ పావులు కదుపుతోంది. అయితే, ఆ సమస్యలపై ఎలా చర్చించాలన్న వ్యూహం ప్రతిపక్షం దగ్గర కనబడడం లేదు. వాయిదా తీర్మానాలు ఇస్తే చర్చ జరగాల్సిందే అన్న ధోరణిలో విపక్షాలు ఉన్నాయి. వాటిని తిరస్కరిస్తూ, చర్చ జరగకుండా అధికార పక్షం జాగ్రత్త పడుతోంది.

గత ఐదురోజులుగా పార్లమెంట్‌ ఎలాంటి కార్యలాపాలు లేకుండా సాగుతోంది. అనేక అంశాలు చర్చించాల్సి ఉంది. ప్రతిపక్షాలు చర్చకు పట్టుపడుతున్న బీహార్‌ ఓటర్ల జాబితాయే గాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని ఎలా చర్చించాలన్న ప్రణాళిక ప్రతిపక్షం దగ్గర కనిపించడం లేదు. అలా చేయడంలో విపక్ష పార్టీలు విఫలం అవుతున్నాయి. కేవలం వాయిదా తీర్మానాలు ఇవ్వడం, సభను అడ్డుకోవడం, బయటకు వచ్చి మీడియాతో మాట్లాటం వరకే పరిమితం అవుతున్నారు.

నిజానికి బీసీలకు రిజర్వేషన్లు, జాతీయ జలవిధానం, నదుల అనుసంధానం, రైతుల సమస్యలు, దేశ భద్రత, ఆపరేషన్ సింధూర్, పదేపదే భారత – పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటున్న ట్రంపు మాటలు, అధిక ధరలు, వేధిస్తున్న పన్నులు, పేరుకుపోతున్న నిరుద్యోగిత, ఉపాధి…ఇలా లెక్కకు మించిన సమస్యలు చర్చించడానికి సమయం కావాలి. ఈ ప్రజా సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా రుణ మాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్ధిగా ఎదిగేలా చేయాలి. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వంటివన్నీ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. రైతుల సమస్యలు రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోయాయి. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో సిద్ధంగా లేవు. దిగుబడులు అడుగంటి, గిట్టుబాటు ధరలు లేక రైతులు భిక్కచస్తున్నా, మొసలి కన్నీరు కార్చడమే తప్ప రాజకీయ పార్టీలు చేస్తున్నదేమీ లేదు. పైగా సమస్యలు అలా ఉంటేనే తమకు మనుగడ అన్నట్లుగా పార్టీల వ్యవహారం ఉంటున్నది.

కాలం కాక, అధిక కాలంతో దిక్కుతోచని పరిస్థితి రైతులది. ప్రస్తుతం భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నేటికీ వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబించలేని దుస్థితిలో దేశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు అనేక జలాశయాల్లో పూడిక పేరుకుని పోతోంది. ఏటేటా వర్షాలతో ఒండ్రు చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాదిలో అనేక నదులు ఉప్పొంగాయి. చివరకు మళ్లీ నీరు సముద్రానికి చేరింది. ఇప్పటికైనా పాలకులు జాతీయ జలవిధానం రూపొందించాల్సి ఉంది. అయితే, పార్లమెంటులో ఇలాంటి సమస్యలు చర్చకు రావడం లేదు. ఎంతసేపు ఓటు బ్యాంక్‌ రాజకీయాలే పార్టీలకు ముఖ్యమైపోయాయి. అలాగే వ్యవసాయం పై కూడా జాతీయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, మన రైతులను ప్రోత్సహిచేలా చూసుకోవాలి. వివిధ రాష్టాల్ల్రో చెరువులను మింగిన పాపానికి ఇటీవల కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. ఇదంతా పాలకుల పాపమే!

ఈ క్రమంలో తెలంగాణలాంటి రాష్ట్రాల్లో గొలుసుకట్టు చెరువులను రక్షించు కోవాలి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటి నుంచైనా నీటి అవసరాలను గుర్తించి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. నిరుద్యోగం పెరిగడంతో ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు చేపట్టాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. అందుకు తగ్గట్లుగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలి. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగ గలవు. ఇవేవీ లేక కరువులు వచ్చినా, అధికంగా వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారుతున్నారు.

గత కొంత కాలంగా పార్లమెంటులో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగడం లేదు. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థకే కాదు, దేశానికి, దేశ ప్రజలకు కూడా మంచిది కాదు. చర్చ ఎవరు చేసినా, ఆ చర్చల్లో ఎవరు గెలిచినా, ఓడినా, ఇక్కడ గెలుపోటములు ముఖ్యం కాదు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులంతా ప్రజల్ని గెలిపించాలి. అంటే చట్టసభల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలు అన్ని అంశాల మీద జరగాలి. దేశ, ప్రజల సౌభాగ్యానికి అవసరమైన చట్టాలు, పథకాలు, విధానాలను రూపొందించి అమలు చేయాలి. ఇందుకు ప్రజాస్వామ్యంలో ప్రజాసమస్యలు చర్చించడానికి సరైన వేదిక పార్లమెంటు. పార్లమెంటులో చర్చించే అంశాలు ఆయా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సాగాలి. ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రజల ప్రయోజనాలు, దేశంలో ప్రజలందరి ప్రగతి దిశగా అవసరమైన చర్చలు జరపడానికి సిద్ధపడాలి.

Latest News

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News