Sunday, July 26, 2026
28.1 C
Hyderabad

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ

“నా భూమిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదు”

తెలంగాణలో మొయినాబాద్ మండలం, తోల్కట్ట గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భూమిలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నాయనే వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

2018లో తోల్కట్ట గ్రామంలో సర్వే నంబర్ 165 పార్ట్‌లో 10 ఎకరాల 1 గుంట భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమి నిర్వహణ బాధ్యతలను తన మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డికి అప్పగించినట్లు చెప్పారు. సదరు భూమిలో ఎటువంటి ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్ లేవని, కేవలం మామిడి, కొబ్బరి తోట మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

తన అనుమతి లేకుండా జ్ఞాన్దేవ్ రెడ్డి, వర్రా రమేష్ కుమార్ రెడ్డికి ఆ తోటను కౌలుకు ఇచ్చిన విషయం నిన్నటి ఘటన అనంతరం మాత్రమే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తరువాత వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం. వెంకటపతి రాజుకు తోటను కౌలుకు ఇచ్చినట్లు కూడా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం తనకు తెలియకుండానే జరిగిందని, దీనికి తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

నిన్న వార్తలు చూసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చింది. తన భూమిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనికి తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. సంఘటన జరిగిన రోజున తాను హైదరాబాద్‌లో లేరని, వరంగల్‌లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 20 ఏళ్లుగా మచ్చలేని రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పారు. నిరాధార ఆరోపణలతో మీడియా కథనాలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News