Friday, July 17, 2026
26.4 C
Hyderabad

జెండాలకతీతంగా అభివృద్ధి ఎజెండా!|EDITORIAL

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ప్రజలు ఎదురుచూస్తోన్న అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాలు, పట్టణాలు బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుంది. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాను రూపొందించి, అమలు చేయాలి.
గ్రామాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పంచాయతీల్లో పారదర్శకత లేదు. నిధుల దుర్వినియోగం, స్థానిక స్థాయిలో పెరుగుతున్న అవినీతి గ్రామాభివృద్ధికి అడ్డంకులుగా మారాయి. అవినీతి రహిత పాలన గ్రామాల నుంచే ప్రారంభం కావాలి. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల పురోగతి, ఖర్చుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలి. సామాజిక ఆడిట్లను కఠినంగా అమలు చేస్తే బాధ్యతాయుత పరిపాలనకు మార్గం సుగమమవుతుంది.

గ్రామ సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పరిపాలన, ఆర్థిక నిర్వహణ, పంచాయతీరాజ్ చట్టం, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేలా వారిని సిద్ధం చేయాలి. రాజకీయ ప్రేరణలతో కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేలా దృఢమైన మార్గదర్శకాలు అవసరం.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రోడ్లు దెబ్బతిన్నాయి, డ్రెయినేజీలు మూసుకుపోయాయి, చెత్త సేకరణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ పద్ధతి అమలులో ఉన్నా, నిర్వహణ లోపంతో ఫలితం కనిపించడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత, సరిపడా వాహనాల లేమి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పెద్ద రోడ్లను శుభ్రపరిచే యంత్రాలను వినియోగంలోకి తేవాలి. ఓపెన్ డ్రెయినేజీలను మూసివేసి ఆధునిక మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.

తాగునీటి సమస్య పట్టణాల్లోనే కాదు, శివారు కాలనీల్లోనూ తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ ప్రచారం పెద్దఎత్తున జరిగినా, అనేక ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ సక్రమంగా లేదు. పైప్‌లైన్ల లీకేజీలు, తరచూ జరిగే మరమ్మతులు, కొత్త కాలనీలకు కనెక్షన్ల లోపం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ దశలో అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను వేగవంతం చేయడం అత్యవసరం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటేనే పనులు గడువులో పూర్తి అవుతాయి.

మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించాలి. పన్నుల భారం పెరిగినా, మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు వంటి ప్రాథమిక అవసరాలు ఇప్పటికీ నెరవేరలేదు. విలీన ప్రక్రియ అభివృద్ధికి దోహదపడాలి గానీ, అదనపు భారంగా మారకూడదు.

అక్రమ నిర్మాణాలు పట్టణ ప్రణాళికను సవాల్ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, నియంత్రణలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రణాళిక శాఖను బలోపేతం చేసి కఠినంగా అమలు చేస్తేనే శాస్త్రీయ పట్టణాభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్తులో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ప్రజారోగ్యం పడకేసింది. దోమల విస్తృతి, వీధి కుక్కల సమస్య, కోతుల బెడద, పందుల సంచారం వంటి సమస్యలు గ్రామాల నుంచి పట్టణాల వరకు వ్యాపించాయి. ఫాగింగ్, శానిటేషన్ చర్యలు, పశుసంవర్ధక శాఖల సమన్వయం ద్వారా వీటిని నియంత్రించాలి. అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

నిధుల విడుదల, వినియోగంలో రాజకీయ ప్రాధాన్యత కంటే అవసరాల ప్రాముఖ్యత ఉండాలి. అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ-గవర్నెన్స్, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తే పారదర్శకత పెరుగుతుంది.

ఈ సమస్యలన్నీ ఏళ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్య ఫలితమే. అయితే కొత్తగా ఎన్నికైన స్థానిక పాలకవర్గాలకు ఇది ఒక అవకాశం, ఒక సవాల్ కూడా. సమన్వయం, పారదర్శకత, కఠిన అమలు, ప్రజల భాగస్వామ్యం నాలుగు స్తంభాలు. రాజకీయ వాగ్దానాల నుంచి కార్యాచరణ దిశగా అడుగులు పడితేనే గ్రామాలు, పట్టణాలు నిజమైన అభివృద్ధి దిశగా సాగుతాయి. ఇదే ప్రజల ఆకాంక్ష.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News