Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

ఆట విడుపుగా సీఈసీ అభిశంసన!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థల పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రధాన ఆధారం. ఇటీవలి పరిణామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల పరిశీలన (సర్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాల నుండి భారీగా పేర్లు తొలగింపు జరిగింది. దీంతో సర్ పై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై అభిశంసన నోటీసులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు మార్చి 13న పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేక ఓటర్ల సవరణలో సీఈసీ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలపై పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపించాయి. 193 మంది ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే సీఈసీని అభిశంసించవచ్చు. అయితే, ఈ నోటీసులను లోకసభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ పరిశీలించి, అనుమతించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ చరిత్రలో సీఈసీపై అభిశంసన తీర్మానం రావడం ఇదే మొదటిసారి.

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1 కోటి 40 లక్షల ఓటర్ల పేర్లు జాబితాల నుండి తొలగించబడినట్టు అంచనా. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు, 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇలా విస్తృత స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలు సహజంగానే అనుమానాలకు తావిస్తాయి.

ఆశ్చర్యకరంగా ఓటు తొలగింపులపై ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు రాకపోవడం విచిత్రం. సాధారణంగా ఒకరి ఓటు తొలగిస్తే, దానికి తగిన ప్రతిస్పందన వెంటనే వెలువడుతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించకపోవడం ఈ ప్రక్రియపై అధికార వర్గాల వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ సర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుకూల ఓటర్ల తొలగింపే లక్ష్యంగా తొలగింపులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు సమర్పించడంలో వారు ఇప్పటి విఫలమవుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిశంసన అసాధారణ రాజ్యాంగ ప్రక్రియ. రాజ్యాంగ ఉన్నత హోదాలో ఉన్న సీఈసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని నిరూపితమైతేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. పైగా, పార్లమెంట్‌లో తగిన మెజారిటీ అవసరం కావడం వల్ల ఈ తీర్మాణం వీగిపోయే అవకాశాలే ఎక్కువ.

భారత ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. అది అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అలాంటి సంస్థపై అభిశంసన నోటీసులు ఇవ్వడం అంటే, ఆ సంస్థ నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తడమన్నమాట. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అన్నది ఆలోచించాల్సిన అంశం.

అయితే, ఎన్నికల సంఘం మాత్రం తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. “ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా తన ఓటు హక్కు కోల్పోకుండా చూసుకున్నాం. అలాగే ఒక్క అనర్హుడూ ఓటు వేయకుండా నిరోధించాం.” అని స్పష్టం చేసింది. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లు రోజుకు లక్ష ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాయని సీఈసీ వివరిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో చీఫ్ సెక్రెటరీని తొలగించడం, డీజీపిని బదిలీ చేయడం వంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతాన్ని నిరూపించే చర్యగా చెప్పుకుంటున్నా, ఇది రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది.

ఎన్నికల సమయంలో కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు ప్రబలడం కొత్తేమీ కాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ వంటి చర్యలు ఎన్నికల ఫలితాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయన్నది ఆసక్తిగా మారింది.

అభిశంసన ప్రయత్నం విజయవంతమవుతుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, పార్లమెంట్ లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే, అది కష్టమేనని చెప్పాలి. అధికార పక్షానికి ఆధిక్యమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల ఇది రాజకీయ ఒత్తిడికి గురిచేసే ప్రక్రియగానే మిగిలే అవకాశం ఉంది.

భారత రాజ్యాంగం ప్రకారం అభిశంసన శక్తివంతమైన తొలగింపు సాధనం. ఆయుధం. అయితే, అది బాధ్యతాయుతంగా, విజయవంతంగానే ఉపయోగించాలి. లేకపోతే అది రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎన్నికలు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా జరగడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యం. అందువల్ల ఈ అభిశంసన వ్యవహారంలో అన్ని పార్టీలు బాధ్యతతో వ్యవహరించడం అత్యవసరం.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News