Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

మోదీ జీ..! వినబడుతోందా!?|EDITORIAL

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్న ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏ దేశం ఎవరితో స్నేహ హస్తం చాచాలో కూడా ట్రంపే చెబుతాడట! ఏ దేశం మరేదేశంతో వాణిజ్యం చేయాలో కూడా ట్రంపే నిర్దేశిస్తాడట. అదే అమెరికా దేశాన్ని ట్రంప్ లా ఎవరైనా ప్రశ్నిస్తే సహిస్తాడా? మరి పర దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచే హక్కు ట్రంప్ కు ఎక్కడిది. ఎవరిచ్చారు? ట్రంప్‌ ఆంక్షలను ఎవరైనా ఎందుకు అంగీకరించాలి? చర్చలు జరిపేది లేదంటున్న ట్రంప్‌తో మనం కూడా ఎందుకు చర్చలు జరపాలి? చర్చలు జరిపినా, జరపకపోయినా,140 కోట్ల జనాభా ఉన్న భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో ట్రంపకు అర్థం చేయాలి. మనపై వాణిజ్య ఆంక్షలు విధిస్తూ, పాక్‌ను దువ్వుతున్న తీరు అమెరికా ద్వంద్వ నీతిని తెలియ చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాలు ఒక్క భారత్‌కే కాదు యావత్ ప్రపంచ దేశాలకు పరీక్షగా మారాయి. ముందుగా చైనా అదే స్థాయిలో తిరిగి అమెరికాపై సుంకాలు విధించి అమెరికా దిమ్మ తిరిగేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్‌ కూడా చైనా తరహాలోనే దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. గురువారం నుంచే అమలులోకి వచ్చిన 25 శాతం సుంకాలతోపాటు, ఆగస్టు 27 నుంచి 50శాతానికి చేరే సుంకాలకు తోడుగా భారత్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలోనూ కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. పెంచిన సుంకాల వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్‌ నమ్మబలుకుతున్నారు.

అమెరికా అదనపు సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని, త్వరలోనే సమసిపోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్‌-అమెరికన్ల నేత, బైడెన్‌ మాజీ సలహాదారు అజయ్‌ భుటోరియా ఖండించారు. ’అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్‌ మందులను భారత్‌ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను కూడా పెంచుతాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారు. మసాలా దినుసులు, పప్పులు, దుస్తుల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షల ధరలు 37శాతం దాకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఇదే విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోదీ గట్టిగానే సమాధానమిచ్చారు. ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని సొంతగా భరించడానికీ సిద్ధం అని ప్రధాని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, శ్వేత సౌధంలోని ఓవల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలోని చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నార’ని పేర్కొన్నారు. ట్రంప్‌ తీరు తన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుకుంటున్నట్లుగా ఉంది. ఎలాన్‌ మస్క్‌ లాంటి మిత్రుడినే దూరం పెట్టిన ట్రంప్‌కు భారత్‌ ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు. లెక్కలోకీ రావు.

ఆపరేషన్‌ సింధూర్‌ భారత్ సైనిక పాఠవాన్ని ప్రపంచానికి చాటింది. అలాగే అమెరికా ప్రపంచ దేశాలను బెదిరించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న పాక్ ఆయుధాలు తుస్ మనడమూ అన్ని దేశాలూ చూశాయి. అందుకే పాక్ ను బెదిరించి మరీ, భారత్ కాళ్ళ బేరానికి పంపాడు. భారత్‌ భద్రతా వలయాన్ని చూసి ట్రంప్‌ తట్టుకోలేక పోతున్నాడు. సైనిక పరంగా మనల్ని ఎదుర్కోలేక సుంకాలతో కొడుతున్నాడు.

అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషాయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోదీ, ఆపరేషన్‌ సిందూర్‌ తో పాక్ పీచమణిచారు. గట్టిగా బుద్ది చెప్పాం. ప్రపంచం ముంగిట పాక్ ని దోషిగా నిలబెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ చర్యలకు గట్టి మద్దతు లభించింది. మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మోదీజీ వినబడుతోందా!?

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News