Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం. అలాగే చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

భారత ప్రజాస్వామ్యానికి చట్టసభలే పట్టుగొమ్మలు. ప్రజల ఆశలు, సమస్యలు, హక్కులు వంటి వాటిపై పార్లమెంటులో గళమెత్తాలి. కానీ, ఇటీవలి పరిణామాలు చట్టసభలు నిజంగా ప్రజలందరి కోసమే పనిచేస్తున్నాయా, లేక కొందరి ప్రభావంలోనే నడుస్తున్నాయా? అన్న అనుమానాలు కలగక మానవు.

అంబేద్కర్ జయంతి జరుపుకున్న మరుసటి రోజే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలు చర్చకు రావడం ఒక ప్రతీకాత్మక సంఘటన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దూరదృష్టి గురించి మాట్లాడుకునే సందర్భంలోనే మహిళల ప్రాతినిధ్యం పెంపు అనే కీలక అంశం మళ్లీ పార్లమెంట్ లో చర్చకు రావడం యాదృచ్ఛికం కాదు. కానీ, ఈ చర్చలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి?
లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా, కీలకమైన బిల్లులపై చర్చ జరిగిన సమయంలో కేవలం 333 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 210 మంది గైర్హాజరు కావడం సభ్యుల బాధ్యతపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన వారు, అత్యంత ముఖ్యమైన చర్చల సమయంలో సభకు హాజరు కాకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించాలి.

మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త ఆలోచనేమీ కాదు. దశాబ్దాలుగా ఈ అంశం చర్చల్లోనే ఉంది. అయినప్పటికీ, ఇప్పటికీ అమలుకు రాకపోవడం వెనుక ప్రధాన కారణం రాజకీయ సంకల్పం లోపించడమే! ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచి, అందులో 33 శాతం అంటే 273 సీట్లను మహిళలకు కేటాయించాలని యోచిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న పురుష సభ్యుల స్థానాలను తగ్గించకుండా మహిళలకు అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం.

అయితే ఈ ప్రతిపాదనను డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం మరో వివాదానికి దారితీసింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రాల మధ్య సంఖ్యా బలాలు మారే అవకాశముంది. ముఖ్యంగా జనాభా ఆధారంగా సీట్లు పెరగడం వల్ల కొన్ని రాష్ట్రాలకు లాభం, మరికొన్నింటికి నష్టం కలగవచ్చు. అందుకే అనేక పార్టీలు ఈ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఇక రాజకీయ వ్యవస్థలో కుటుంబ ఆధిపత్యం మరో కీలక అంశం. అనేక పార్టీల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో గాంధీల కుటుంబం, బీజేపీలో పరివారం, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నింట్లోనూ కుటుంబ పాలన సర్వసాధారణమైంది. ఇది ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధం. ఓటర్లు ఎన్నుకుంటున్నారనే వితండవాదం ఉన్నప్పటికీ, పార్టీ టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల కొత్త నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయి.

ఇదే నేపథ్యంలో “రెండు పదవీకాలాల పరిమితి” అనే ప్రతిపాదన ప్రస్తావనకు వస్తోంది. ఒక వ్యక్తి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండేలా చట్టం తీసుకురావాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విధానం అమలైతే కొత్తతరం నాయకత్వానికి మార్గం సుగమమవుతుంది. అయితే అనుభవజ్ఞుల సేవలు కోల్పోయే ప్రమాదం, ప్రజల ఎంపిక స్వేచ్ఛపై ప్రభావం వంటి అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు మాటలలో మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. సీట్ల కోత భయం, సామాజిక సమీకరణల ఒత్తిడి ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఈ బిల్లు అమలుకు డీలిమిటేషన్ అనే మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.

సమస్యలు వ్యక్తుల్లో మాత్రమే కాదు, పార్టీలు, రాజకీయ, చట్టసభలు, పరిపాలనా వ్యవస్థల్లోనూ ఉన్నాయి. చట్టసభల పనితీరు మెరుగుపడాలంటే ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావాలి. సభలకు హాజరు, చర్చల నాణ్యత, చట్టాల ప్రభావాలను ప్రజలు పరిశీలించి నాయకులను ప్రశ్నించాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి.

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం.

చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News