Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం. అలాగే చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

భారత ప్రజాస్వామ్యానికి చట్టసభలే పట్టుగొమ్మలు. ప్రజల ఆశలు, సమస్యలు, హక్కులు వంటి వాటిపై పార్లమెంటులో గళమెత్తాలి. కానీ, ఇటీవలి పరిణామాలు చట్టసభలు నిజంగా ప్రజలందరి కోసమే పనిచేస్తున్నాయా, లేక కొందరి ప్రభావంలోనే నడుస్తున్నాయా? అన్న అనుమానాలు కలగక మానవు.

అంబేద్కర్ జయంతి జరుపుకున్న మరుసటి రోజే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలు చర్చకు రావడం ఒక ప్రతీకాత్మక సంఘటన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దూరదృష్టి గురించి మాట్లాడుకునే సందర్భంలోనే మహిళల ప్రాతినిధ్యం పెంపు అనే కీలక అంశం మళ్లీ పార్లమెంట్ లో చర్చకు రావడం యాదృచ్ఛికం కాదు. కానీ, ఈ చర్చలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి?
లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా, కీలకమైన బిల్లులపై చర్చ జరిగిన సమయంలో కేవలం 333 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 210 మంది గైర్హాజరు కావడం సభ్యుల బాధ్యతపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన వారు, అత్యంత ముఖ్యమైన చర్చల సమయంలో సభకు హాజరు కాకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించాలి.

మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త ఆలోచనేమీ కాదు. దశాబ్దాలుగా ఈ అంశం చర్చల్లోనే ఉంది. అయినప్పటికీ, ఇప్పటికీ అమలుకు రాకపోవడం వెనుక ప్రధాన కారణం రాజకీయ సంకల్పం లోపించడమే! ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచి, అందులో 33 శాతం అంటే 273 సీట్లను మహిళలకు కేటాయించాలని యోచిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న పురుష సభ్యుల స్థానాలను తగ్గించకుండా మహిళలకు అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం.

అయితే ఈ ప్రతిపాదనను డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం మరో వివాదానికి దారితీసింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రాల మధ్య సంఖ్యా బలాలు మారే అవకాశముంది. ముఖ్యంగా జనాభా ఆధారంగా సీట్లు పెరగడం వల్ల కొన్ని రాష్ట్రాలకు లాభం, మరికొన్నింటికి నష్టం కలగవచ్చు. అందుకే అనేక పార్టీలు ఈ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఇక రాజకీయ వ్యవస్థలో కుటుంబ ఆధిపత్యం మరో కీలక అంశం. అనేక పార్టీల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో గాంధీల కుటుంబం, బీజేపీలో పరివారం, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నింట్లోనూ కుటుంబ పాలన సర్వసాధారణమైంది. ఇది ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధం. ఓటర్లు ఎన్నుకుంటున్నారనే వితండవాదం ఉన్నప్పటికీ, పార్టీ టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల కొత్త నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయి.

ఇదే నేపథ్యంలో “రెండు పదవీకాలాల పరిమితి” అనే ప్రతిపాదన ప్రస్తావనకు వస్తోంది. ఒక వ్యక్తి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండేలా చట్టం తీసుకురావాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విధానం అమలైతే కొత్తతరం నాయకత్వానికి మార్గం సుగమమవుతుంది. అయితే అనుభవజ్ఞుల సేవలు కోల్పోయే ప్రమాదం, ప్రజల ఎంపిక స్వేచ్ఛపై ప్రభావం వంటి అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు మాటలలో మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. సీట్ల కోత భయం, సామాజిక సమీకరణల ఒత్తిడి ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఈ బిల్లు అమలుకు డీలిమిటేషన్ అనే మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.

సమస్యలు వ్యక్తుల్లో మాత్రమే కాదు, పార్టీలు, రాజకీయ, చట్టసభలు, పరిపాలనా వ్యవస్థల్లోనూ ఉన్నాయి. చట్టసభల పనితీరు మెరుగుపడాలంటే ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావాలి. సభలకు హాజరు, చర్చల నాణ్యత, చట్టాల ప్రభావాలను ప్రజలు పరిశీలించి నాయకులను ప్రశ్నించాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి.

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం.

చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News