Friday, July 17, 2026
26.4 C
Hyderabad

TELANGANA|తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఈ నేల

INTERNATIONAL|అంతర్జాతీయ స్థాయి EDUCATIONAL CENTRE|విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం

OSMANIA UNIVERSITY|ఉస్మానియా యూనివర్సిటీలో CM|సీఎం రేవంత్ రెడ్డి|REVANTH REDDY

స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకు వచ్చినందుకు గర్వంగా ఉందని, ఇక్కడికి రావడానికి ధైర్యం కాదు… అభిమానం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండెల నిండా ప్రేమతో, విశ్వవిద్యాలయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వచ్చానని, ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ నేల ఎప్పటికీ పౌరుషం, తిరుగుబాటు స్వభావానికి ప్రతీకగా నిలిచిందని, ఆధిపత్యం చెలాయించాలనుకునే ప్రతి ప్రయత్నానికి ఈ నేలలోనే ప్రతిఘటన పుట్టిందని చెప్పారు. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తాజా తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రజా ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ముందున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమ సమయంలో ఓయూ, కేయూ వేదికలపై విద్యార్థులు పోరాడి చరిత్ర నిర్మించారని అన్నారు.

పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయులను దేశానికి అందించిన ఘనత ఓయూదే అని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యూనివర్సిటీనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా, ఓయూను బలహీనపరిచే ప్రయత్నాలే జరిగాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు సాధ్యమని రేవంత్ రెడ్డి అన్నారు.

తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడినని, విదేశీ భాషలు రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవగలనని, పేదల కోసం పరిపాలన చేయగలనని తెలిపారు. ప్రజల సొమ్ముతో ఫామ్ హౌసులు కట్టుకోలేదని, పేద బలహీన వర్గాల ఆశీర్వాదాలతోనే ముఖ్యమంత్రి అయ్యానని స్పష్టం చేశారు. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

రెండేళ్లలో చేసిన పనులను గుర్తుచేసిన సీఎం జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించడం, బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన పూర్తి చేయడం వంటి నిర్ణయాలను వివరించారు. కేంద్ర జనగణనలో కులగణనకు మార్గం సుగమం చేసిన ఘనత తెలంగాణకే దక్కిందని చెప్పారు. భూములు లేవని నిస్సందేహంగా చెప్పినందుకు విమర్శిస్తున్నారని, అదే సమయంలో వందల ఎకరాల్లో ఫామ్‌ హౌసులు కట్టుకున్న వాళ్లు పదేళ్లలో దళితులకు మూడు ఎకరాలు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు.

భూమి లేకపోవడం పేదరికానికి సూచిక కావొచ్చని, కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనానికి సంకేతమని తెలిపారు. నాణ్యమైన విద్య అందరికీ అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, విద్య మాత్రమే తలరాత మార్చే శక్తి ఉందని గుర్తుచేశారు. కులవివక్షను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడా ప్రతిభను వెలికితీయడానికి 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేశామని తెలిపారు. అనంద్ మహీంద్రా వంటి గొప్ప వ్యక్తులను బోర్డుల్లో నియమించడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

పేదలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే తన తపన అని, అందుకే రూ.1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. ఇంగ్లీష్ భాష నాలెడ్జ్ కాదు, కమ్యూనికేషన్‌ మాత్రమేనని, నాలెడ్జ్, నిబద్ధత ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు, ఇందులో రాజకీయ జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

ఉస్మానియా తెలంగాణ గుండెకాయ అని, ఇక్కడి విద్యార్థులు రాజకీయ పార్టీల వలలో పడకూడదని సీఎం సూచించారు. కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఉన్నతాధికారులుగా మాత్రమే కాక, ఈ యూనివర్సిటీ నుంచే భవిష్యత్ నాయకులు ఎదిగి రాష్ట్రాన్ని పరిపాలించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News