Friday, July 17, 2026
26.4 C
Hyderabad

మహిళలకు అండగా ఐద్వా!|EDITORIAL

మహిళలు అన్ని రంగాల్లో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్న ఈ కాలంలోనూ, భారత మహిళల స్థితి పూర్తిగా మారి, ఆ స్థితికి చేరిందని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరిక్షం నుంచి రాజకీయాల వరకూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సాధారణ మహిళలు భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. నేటికీ మహిళలు ఒంటరిగా ప్రయాణించలేని పరిస్థితులు, స్వేచ్ఛగా జీవించలేని దుస్థితి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సమాజం సాధించిన అభివృద్ధికి పెద్ద ప్రశ్న మాత్రమే కాదు. పెను సవాల్ కూడా.

సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. పనిప్రదేశాలు, అన్ని రంగాల్లో పురుషుల పెత్తనమే కనిపిస్తోంది. మహిళలకు అధికారం దక్కినట్టు కనిపిస్తున్నా, అది వాస్తవంలో ఉండటం లేదు. పాలనలో మహిళలు ఉన్నా, మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకునే స్థాయికి ఆ అధికారం ఉపయోగపడడం లేదు. మమతా బెనర్జీ లాంటి మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ కూడా ఉంది. ఇది మహిళలకు అధికారం ఇచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవ్వవని, ఆ అధికారాన్ని ప్రజల తరఫున వినియోగించే దృక్పథం కీలకమని స్పష్టం చేస్తోంది. మహిళలు, చిన్నపిల్లలను గౌరవించే సమాజం ఏర్పడే వరకు, వారికి సంపూర్ణ రక్షణ కల్పించే వరకు ఈ పోరాటం ఆగకూడదు.

ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత 14వ మహాసభలు జనవరి 24-28 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 1981లో మార్చిలో చెన్నై వేదికగా ఐద్వా స్థాపించబడింది. దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పోరాడే ఈ సంస్థకు 23 రాష్ట్రాలలో 1.1 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఇది సీపీఐఎం కి అనుబంధంగా పనిచేస్తున్నప్పటికీ స్వతంత్ర మహిళా ఉద్యమ వేదికగా గుర్తింపు పొందింది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహ హింస, వరకట్నం, అత్యాచారాలు, రాజకీయ అణచివేత వంటి సమస్యలపై ఐద్వా నిరంతరం పోరాడుతుంది. అణగారిన వర్గాల మహిళల కోసం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పనిచేస్తున్న అతిపెద్ద మహిళా సంస్థలలో ఐద్వా ఒకటి.

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ముందుకు సాగిన రైతు మహిళల నేలలో జరగనున్న మహాసభలు మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలి. ఈ సందర్భంగా ఐద్వా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘మనువాద’ నినాదాన్ని నిర్మూలించే భావనను సగటు మహిళకు అర్థమయ్యేలా వివరించాలి. ఇది కేవలం లెఫ్ట్ పార్టీల మహిళా సంఘం అన్న ముద్రను చెరిపేసి, అన్ని వర్గాల మహిళలకు అండగా నిలవాలి.

‘మహిళలంతా ఒక్కటే’ అన్న సమభావన ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే మహిళల గొంతు మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కాదు, సమాజంలోనూ కలసికట్టుగా నినదించే స్థాయికి రావాలి. అసంఘటిత రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా చేసిన పోరాటాలు ప్రేరణగా నిలవాలి.

సోషల్ మీడియా విస్తరణతో మహిళల వ్యక్తిత్వ హననం మరింతగా పెరిగింది. అశ్లీలత, ట్రోలింగ్, వేధింపులు సాధారణమయ్యాయి. సినిమాల్లో మహిళలను అవమానకరంగా చూపించే సన్నివేశాలపై, సోషల్ మీడియాలో మహిళల హక్కుల దుర్వినియోగంపై ఐద్వా స్పష్టమైన పోరాటం చేయాలి. సమస్య ఏదైనా, మహిళల తరఫున ఐద్వా నిలబడుతుందన్న నమ్మకం కలగాలి.

33 శాతం మహిళా రాజకీయ రిజర్వేషన్లు హక్కుగా తక్షణం అమల్లోకి రావడానికి ఐద్వా నాయకత్వం వహించాలి. పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. కానీ అది కేవలం కార్పొరేట్, ఉన్నత వర్గ మహిళలకే పరిమితం కాకుండా, నిమ్న, బడుగు, బలహీన వర్గాల మహిళల చేతికి అధికారం చేరేలా పోరాటం సాగాలి.

స్త్రీ విముక్తి సమాజ విముక్తితో ముడిపడి ఉందన్న అవగాహన పెరగాలి. మహిళను వంటగదికి, సంతాన ఉత్పత్తికే పరిమితం చేసే ఈ వ్యవస్థపై తిరుగుబాటు రావాలి. అభ్యుదయ ఆలోచనలతో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ, ఐద్వా తన పరిధిని విస్తరించి ప్రతి మహిళకు ఒక బలమైన గొడుగుగా మారాల్సిన అవసరం ఉంది. అదే మహిళా శక్తికి నిజమైన చిరునామా అవుతుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News