Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

TELANGANA|తెలంగాణ ఉద్యమదశ దిశను మార్చిన దీక్షా దివస్|DHIKSHA DIWAS

ఉద్యమ జ్వాలల్ని రగిల్చిన శ్రీకాంతాచారి ఆత్మాహుతి

1948లో హైదరాబాద్ దేశంలో విలీనమయింది. 1956తో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విలీనాన్ని ఆనాటి నుండే వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమాల్లో ప్రధానమైనవి 1958 ఉద్యమం, 1969లో సాగిన ఉద్యమం, 2001లో మొదలైన మలి ఉద్యమం అయితే, తెలంగాణ ఏర్పాటుకు అంకురార్పణ గావించినది నవంబర్ 29న మొదలైన దీక్షా దివస్. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా స్పందించడానికి కారణమైంది.

తెలంగాణ మలిదశఉద్యమం అనేక అనూహ్య మలుపులు తిరుగూ దీక్ష దశకు చేరుకుంది. ఉద్యమంలో భాగంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబరు 29న నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అనేకానే పరిణామాలు, వాదవివాదాలు, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం తర్వాత డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించారు.

హైదరాబాద్, నవంబర్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసాయి. కేంద్రం ఉపశమన చర్యలతో ఉద్యమం చల్లారకపోగా, తీవ్రతరం అవుతూ వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ పూనుకున్నారు. ‘తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ దీక్షకు దిగారు.
కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి బయలు దేరిన కేసీఆర్ ను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు అడ్డుకున్నాయి. కేసీఆర్ ను తన వాహనం నుంచి బలవంతంగా దించివేయడంతో, రోడ్డుమీదే ధర్నా ప్రారంభించారు. దీంతో కేసీఆర్ ను వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. వాదవివాదాల మధ్య ఆ జైలులోనే తన దీక్షను కొనసాగించారు.

శ్రీకాంతాచారి ఆత్మాహుతి
2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో కాసోజు శ్రీకాంతాచారి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ! అంటూ నినదించాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియా, చివరకు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న తుదిశ్వాస విడిచాడు. మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణే చేశాడు. ‘బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమ’న్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలవిసి, రగిలిపోయాయి. ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు. శ్రీకాంతాచారి స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి. గొల్లపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆ గ్రామస్థులు ప్రతిష్టించారు.

దీక్ష పర్యవస పరిణామాలు
డిసెంబర్ 1న ‘నేను లేకున్నా ఉద్యమం నడవాలి’ అని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్‌లో అద్వానీ కేసీఆర్ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర’ అని నిమ్స్‌ నుంచే కేసీఆర్ ప్రకటించారు. రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్‌ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని చెప్పారు. దాంతో రాష్ట్ర రాజధాని ఫ్రీ జోన్‌ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అయినా, నిరసనలు ఆగలేదు. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే మారుమోగింది. బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా సబ్బండ వర్గాలు, కులాలు ఒక్కటయ్యారు.

డిసెంబర్ 9 ప్రకటన
డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న కేసీఆర్‌ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదని, తమ చేతుల్లో ఏమీలేదని వైద్యులు ప్రకటించారు. తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్‌ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. చిదంబరం ఫోన్‌లో కేసీఆర్‌, జయశంకర్‌ తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయని చెప్పారు. రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటన వెలువరిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు.

2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ
ప్రకటన అనంతరం నిమ్స్‌ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’గా కేసీఆర్‌ తన 11 రోజుల సుధీర్ఘ దీక్షను విరమించారు. అయితే, ఆతర్వాత ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం లేపారు. ఈ ఉద్యమం తెలంగాణ ఏర్పాటును మరికొంత కాలం ఆలస్యం చేసింది. చివరకు 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అదే రోజున లోక్ సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందింది. మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం పొందింది. జూన్ 2, 2014న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News