Friday, July 17, 2026
26.4 C
Hyderabad

కేంద్రమా? ‘స్థానిక’ ఆమోదమా!?|EDITORIAL

స్థానిక ఎన్నికల నిర్వహణకు HIGH COURT| హైకోర్టు లైన్‌ క్లీయర్‌ చేయడంతో పాటు, డెడ్‌లైన్‌ కూడా విధించింది. మరోవైపు 42శాతం BC| బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని BRS| బీఆర్‌ఎస్‌, BJP| బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన చేసి చరిత్ర సృష్టించామని, మోడీకి సవాల్‌ విసిరామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాదు. ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు, రెండోవైపు పార్లమెంటు ఆమోదం తప్పనిసరైన పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎన్నికలను THREE MONTHS| 3 నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్డు గడువు విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై STATE GOVERNMENT| రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అంతటా ఉత్కంఠ పెరిగింది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు CONGRESS| కాంగ్రెస్‌ ప్రభుత్వం, EDUCATION| విద్య, JOBS| ఉద్యోగాల్లో, LOCAL BODY| స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదింప చేయాలని ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కిషన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అయితే బీసీ కుల గణన అంతా తప్పుల తడకగా ఉందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ ప్రభత్వం కూడా దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణనకు పూనుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేదా పదేపదే ప్రకటస్తున్న మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు గతంలో 7.5శాతమే ఉండగా, ప్రస్తుతం 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మిగతా రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, కేంద్రాన్ని కాదని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసినా, అవి అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్‌ చేస్తే మొత్తం ఎన్నికల పక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్రం ఆమోదం లేకుండా 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. అది కాకుంటే స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదు. అందువల్ల పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన చేయడం మినహా కాంగ్రెస్ కు మరో మార్గం కనిపించడంలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ కారణాలు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమోదించింది. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర పరిధిలో అమలు చేయగలిగింది కాకపోవడంతో గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపైనా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాతే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కూడా న్యాయ సలహాకు పంపవచ్చు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్థానికంగానే అమలు సాధ్యమా? అన్న విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గం. పైగా ప్రతిపక్షాలపై కూడా ఆవిధంగా ఒత్తిడి పెంచవచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీఎస్‌ రామ కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే, తమిళనాడు తరహాలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. తెలంగాణలో కులగణన, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. ఈదశలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News