Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

కేంద్రమా? ‘స్థానిక’ ఆమోదమా!?|EDITORIAL

స్థానిక ఎన్నికల నిర్వహణకు HIGH COURT| హైకోర్టు లైన్‌ క్లీయర్‌ చేయడంతో పాటు, డెడ్‌లైన్‌ కూడా విధించింది. మరోవైపు 42శాతం BC| బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని BRS| బీఆర్‌ఎస్‌, BJP| బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన చేసి చరిత్ర సృష్టించామని, మోడీకి సవాల్‌ విసిరామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాదు. ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు, రెండోవైపు పార్లమెంటు ఆమోదం తప్పనిసరైన పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎన్నికలను THREE MONTHS| 3 నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్డు గడువు విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై STATE GOVERNMENT| రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అంతటా ఉత్కంఠ పెరిగింది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు CONGRESS| కాంగ్రెస్‌ ప్రభుత్వం, EDUCATION| విద్య, JOBS| ఉద్యోగాల్లో, LOCAL BODY| స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదింప చేయాలని ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కిషన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అయితే బీసీ కుల గణన అంతా తప్పుల తడకగా ఉందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ ప్రభత్వం కూడా దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణనకు పూనుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేదా పదేపదే ప్రకటస్తున్న మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు గతంలో 7.5శాతమే ఉండగా, ప్రస్తుతం 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మిగతా రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, కేంద్రాన్ని కాదని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసినా, అవి అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్‌ చేస్తే మొత్తం ఎన్నికల పక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్రం ఆమోదం లేకుండా 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. అది కాకుంటే స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదు. అందువల్ల పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన చేయడం మినహా కాంగ్రెస్ కు మరో మార్గం కనిపించడంలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ కారణాలు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమోదించింది. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర పరిధిలో అమలు చేయగలిగింది కాకపోవడంతో గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపైనా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాతే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కూడా న్యాయ సలహాకు పంపవచ్చు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్థానికంగానే అమలు సాధ్యమా? అన్న విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గం. పైగా ప్రతిపక్షాలపై కూడా ఆవిధంగా ఒత్తిడి పెంచవచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీఎస్‌ రామ కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే, తమిళనాడు తరహాలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. తెలంగాణలో కులగణన, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. ఈదశలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News