Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని గణాంకాలు విడుదల చేస్తుంటే, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ విరుద్ధ విచిత్ర పరిస్థితి ప్రభుత్వ ప్రకటనలకూ, భూమి మీద క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతనలేని భారీ అంతరాన్ని బయటపెడుతోంది.

ప్రస్తుతం వరి కోతలు పూర్తయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు సమయానికి కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతుల కష్టాన్ని పూర్తిగా నీళ్లలో కలిపేశాయి. తెలంగాణలో మంథని, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాల దెబ్బకు వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా నాణ్యత కోల్పోయింది.

రైతుల ఆవేదనలో నిజం ఉంది. కోతలు పూర్తయ్యాక 10 నుంచి 15 రోజుల పాటు కొనుగోళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అధికారులు తగిన సంఖ్యలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకపోవడంతో కొనుగోళ్లు నెమ్మదిస్తున్నాయి. ఫలితంగా ధాన్యం యార్డుల్లో పేరుకుపోతోంది. సమయానికి కొనుగోలు జరిగి ఉంటే అకాల వర్షాల కారణంగా ఈ స్థాయిలో నష్టం వాటిల్లేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం వేరేలా ఉన్నాయి. కొన్నిచోట్ల రైతులు ధాన్యం కుప్పల వద్దే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర నిరాశతో రైతులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ సమస్య కేవలం వరి వరకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా పంటల మార్కెట్ వ్యవస్థలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే సమయంలో వినియోగదారుడు కూడా తక్కువ ధరలకు సరుకులు పొందడం లేదు. మధ్యలో లాభపడేది మాత్రం దళారులు, నిల్వదారులు, పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలే.

గోధుమల పరిస్థితి కూడా ఇందుకు భిన్నమైందేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఏడాదికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.2,585గా నిర్ణయించింది. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లలో గోధుమ ధర కిలోకు రూ.23 నుంచి రూ.25 మధ్య మాత్రమే పలుకుతోంది. అంటే రైతులు కనీస మద్దతు దర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. మరోవైపు రిటైల్ మార్కెట్‌లో గోధుమపిండి ధర మాత్రం కిలోకు రూ.36 నుంచి రూ.40 వరకు ఉంది. బ్రాండెడ్ పిండి అయితే రూ.50 దాటుతోంది. రైతుకు ధర తగ్గినా వినియోగదారుడికి ప్రయోజనం ఎందుకు చేరడం లేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.

సాధారణంగా ముడి సరుకు ధర తగ్గితే తుది ఉత్పత్తి ధర కూడా తగ్గాలి. కానీ భారత మార్కెట్ వ్యవస్థలో అది కనిపించడం లేదు. గోధుమల ధర పెరిగినప్పుడు పిండి కంపెనీలు వెంటనే ధరలు పెంచుతాయి. కానీ ధరలు తగ్గినప్పుడు అదే వేగంతో తగ్గించవు. ఈ తేడా మొత్తం లాభాల రూపంలో మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఇదే పరిస్థితి వరి, మక్క, పప్పుధాన్యాలు సహా అనేక పంటల్లో కనిపిస్తోంది.

పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు బలంగా ఉండటంతో రైతులకు కనసీ మద్దతు ధర సమీప ధరలు లభిస్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు వ్యవస్థ బలహీనంగా ఉండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ అసమానత దేశవ్యాప్తంగా రైతుల ఆదాయంలో భారీ వ్యత్యాసాలకు దారితీస్తోంది.

వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ధరల పర్యవేక్షణ విభాగం ఉన్నప్పటికీ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమ ధరల నియంత్రణలో అది ప్రభావవంతంగా వ్యవహరించడం లేదు. రైతు నుంచి వినియోగదారుడి వరకు సరఫరా వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే కేవలం మద్దతు ధరలు ప్రకటించడం సరిపోదు. సమయానికి కొనుగోళ్లు, శాస్త్రీయ నిల్వ వ్యవస్థలు, వేగవంతమైన రవాణా, మార్కెట్ సంస్కరణలు, మధ్యవర్తుల నియంత్రణ వంటి చర్యలు సమగ్రంగా అమలు కావాలి. అకాల వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు, రైతులకు తక్షణ పరిహారం అందించే వ్యవస్థ కూడా బలోపేతం కావాలి.

అన్నదాత దేశానికి వెన్నెముక అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. కానీ రైతు పండించిన పంటను సమయానికి కొనలేని వ్యవస్థ ఉంటే ఆ మాటలకు అర్థం ఉన్నట్లేనా? రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర. ఈ రెండింటి మధ్య సమానత, సమన్వయం తీసుకురావడమే నిజమైన వ్యవసాయ విధానం. లేకపోతే ప్రతి పంట సీజన్ రైతుకు ఆశ కంటే ఆందోళననే మిగులుస్తుంది.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News