Monday, July 13, 2026
29.3 C
Hyderabad

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

పాలకులకు రాజధానిపై స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అప్పటివరకు అమలులో ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి నమూనాను పూర్తిగా మారుస్తూ, “మూడు రాజధానుల” సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ నిర్ణయం అధికార, పరిపాలన వికేంద్రీకరణను ప్రస్థావించినప్పటికీ, అమలు విధానం, ఆర్థిక వెసులుబాటు, చట్టపరమైన సవాళ్లపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయి.

అమరావతి రైతుల సమస్యలు సవాల్ గా మారాయి. 29వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో, వారి ఆశలు, ఆకాంక్షలు, పరిహారాలు, అంచనాలు అమలు కాలేదనే భావన బలపడింది. ఆ ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి గణనీయమైన పురోగతి కనిపించకపోవడం, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోవడం వంటివి ప్రభుత్వంపై విమర్శలకు దారితీశాయి. రైతులు నిరసనలకు దిగడం, దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగడం ఈ అసంతృప్తిని మరింత బలపరిచాయి.

విధానాలలో స్థిరత్వం లేకపోవడం కూడా ఒక ప్రధాన విమర్శగా మారింది. మొదట మూడు రాజధానులు అన్న ప్రభుత్వం, తర్వాత వివిధ సందర్భాల్లో విభిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ముందుకు తేవడం ద్వారా రాజకీయ సందిగ్ధత మరింత పెరిగింది. ఒక రాష్ట్రానికి రాజధాని అనే అంశం దీర్ఘకాలిక ప్రణాళిక, భారీ పెట్టుబడులు, చట్టబద్ధత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో తరచూ మారే ప్రకటనలు పాలనలో అనిశ్చితిని ప్రతిబింబిస్తాయి.

ఆర్థిక నిర్వహణపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర అప్పులు ఐదేళ్లలో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా ఖర్చు చేయడం ఒకవైపు ఉంటే, మూలధన వ్యయాలు తగ్గడం, మరోవైపు ఆర్థిక సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. దీని ప్రభావం మౌలిక వసతుల అభివృద్ధిపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిపాలన కేంద్రీకరణ, నిర్ణయాలలో పారదర్శకత లోపం కూడా చర్చకు వచ్చింది. కీలక నిర్ణయాలు కనీస, విస్తృత చర్చ లేకుండా తీసుకోవడం, పైగా ఈ విమర్శలను సహించకపోవడం వంటి ఆరోపణలు ప్రతిపక్షం తరఫున తరచూ వినిపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉండాలి అనే సూత్రం నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

అయితే, గత ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, విశాఖపట్నంలాంటి నగరాలను పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక అవకాశాలను పెంచవచ్చని వాదించింది. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చామని కూడా పేర్కొంది. ఈ వాదనలపై కొన్ని వర్గాల్లో మద్దతు లభించినప్పటికీ, మిగతా వర్గాలు వ్యతిరేకించాయి.

రాజధాని కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక కేంద్రంగా చూడాలి. దీని కోసం దీర్ఘకాలిక దృష్టి, విధానాలలో స్థిరత్వం, చట్టబద్ధత, ప్రజల నమ్మకం అవసరం. తరచూ మారే నిర్ణయాలు, అస్పష్ట ప్రకటనలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయి.

అందువల్ల, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమగ్ర అభివృద్ధి దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, పారదర్శకంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా సాధ్యమైన మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే స్థిరమైన పరిష్కారానికి దారితీస్తుంది.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News