Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

పాలకులకు రాజధానిపై స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అప్పటివరకు అమలులో ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి నమూనాను పూర్తిగా మారుస్తూ, “మూడు రాజధానుల” సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ నిర్ణయం అధికార, పరిపాలన వికేంద్రీకరణను ప్రస్థావించినప్పటికీ, అమలు విధానం, ఆర్థిక వెసులుబాటు, చట్టపరమైన సవాళ్లపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయి.

అమరావతి రైతుల సమస్యలు సవాల్ గా మారాయి. 29వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో, వారి ఆశలు, ఆకాంక్షలు, పరిహారాలు, అంచనాలు అమలు కాలేదనే భావన బలపడింది. ఆ ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి గణనీయమైన పురోగతి కనిపించకపోవడం, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోవడం వంటివి ప్రభుత్వంపై విమర్శలకు దారితీశాయి. రైతులు నిరసనలకు దిగడం, దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగడం ఈ అసంతృప్తిని మరింత బలపరిచాయి.

విధానాలలో స్థిరత్వం లేకపోవడం కూడా ఒక ప్రధాన విమర్శగా మారింది. మొదట మూడు రాజధానులు అన్న ప్రభుత్వం, తర్వాత వివిధ సందర్భాల్లో విభిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ముందుకు తేవడం ద్వారా రాజకీయ సందిగ్ధత మరింత పెరిగింది. ఒక రాష్ట్రానికి రాజధాని అనే అంశం దీర్ఘకాలిక ప్రణాళిక, భారీ పెట్టుబడులు, చట్టబద్ధత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో తరచూ మారే ప్రకటనలు పాలనలో అనిశ్చితిని ప్రతిబింబిస్తాయి.

ఆర్థిక నిర్వహణపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర అప్పులు ఐదేళ్లలో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా ఖర్చు చేయడం ఒకవైపు ఉంటే, మూలధన వ్యయాలు తగ్గడం, మరోవైపు ఆర్థిక సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. దీని ప్రభావం మౌలిక వసతుల అభివృద్ధిపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిపాలన కేంద్రీకరణ, నిర్ణయాలలో పారదర్శకత లోపం కూడా చర్చకు వచ్చింది. కీలక నిర్ణయాలు కనీస, విస్తృత చర్చ లేకుండా తీసుకోవడం, పైగా ఈ విమర్శలను సహించకపోవడం వంటి ఆరోపణలు ప్రతిపక్షం తరఫున తరచూ వినిపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉండాలి అనే సూత్రం నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

అయితే, గత ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, విశాఖపట్నంలాంటి నగరాలను పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక అవకాశాలను పెంచవచ్చని వాదించింది. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చామని కూడా పేర్కొంది. ఈ వాదనలపై కొన్ని వర్గాల్లో మద్దతు లభించినప్పటికీ, మిగతా వర్గాలు వ్యతిరేకించాయి.

రాజధాని కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక కేంద్రంగా చూడాలి. దీని కోసం దీర్ఘకాలిక దృష్టి, విధానాలలో స్థిరత్వం, చట్టబద్ధత, ప్రజల నమ్మకం అవసరం. తరచూ మారే నిర్ణయాలు, అస్పష్ట ప్రకటనలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయి.

అందువల్ల, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమగ్ర అభివృద్ధి దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, పారదర్శకంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా సాధ్యమైన మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే స్థిరమైన పరిష్కారానికి దారితీస్తుంది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News