Monday, August 3, 2026
31.5 C
Hyderabad

కాలానుగుణ ప్రగతి పరుగులు సాధ్యమేనా!?|EDITORIAL

కాలం గిర్రున తిరుగుతోంది. క్యాలెండర్లు గిరగిరా మారుతున్నాయి. కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఆ కాలానుగుణ మార్పు కనిపించడం లేదు. ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా పరిపాలన స్వరూపం, ప్రజల జీవన ప్రమాణాలు, దేశ అభివృద్ధిపై ప్రశ్నలే మిగులుతున్నాయి. 2026లోకి అడుగిడిన ఈ సమయంలో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పాలన ప్రజల జీవన ప్రమాణాల ఉన్నతికి ఏమేరకు దోహదపడిందనేది నిజాయితీగా నిర్ధారించుకోవాల్సిన సందర్భమిది.

రానురాను జీవనం మరింత కఠినమవుతోంది. ధరలు, నిరుద్యోగం పెరుగుదల, ఉపాధిలేమి, ఆర్థిక అస్థిరత సామాన్యుడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సరైన విధాన నిర్ణయాల లోపం, ప్రజా ప్రయోజనాలపై రాజకీయ లాభాలే ఆధిక్యతను ప్రదర్శించడం, వల్ల దేశం నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి అధికారిక ప్రకటనల్లో మాత్రమే వినిపిస్తోంది.

విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు దాదాపు లేనట్లే. ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు నిర్వీర్యమవుతుండగా, ప్రైవేట్ వ్యాపారం మూడు సంస్థలు, ఆరు బ్రాంచీలుగా విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు వసతుల కొరతతో అల్లాడుతుంటే, కార్పొరేట్ సంస్థలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇందుకు పాలకుల లోపభూయిష్ట విధానాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయాలను స్వల్ప, దీర్ఘకాలిక అభివృద్ధికి బదులు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ పథకాల పేరిట దుబారా చేస్తున్నాయి. ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతోంది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని అభివృద్ధికి మించిన సంక్షేమం ఎప్పటికీ అనర్థదాయకమే.

దేశం సహా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరగడం లేదు. యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూముల అప్పగింత నిరంతరంగా సాగుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు లభించక, వ్యవసాయం లాభసాటిగా మారకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై‘వేటు’ అత్యంత దారుణంగా మారింది. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో ప్రైవేటీకరణ ఆయా రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయి. రక్షణ రంగంలోనూ ఈ తంతు దేశ, ప్రజల భవిష్యత్తు భద్రతపై అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేశ సంపదలో అధిక భాగం కేవలం కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, అధిక సంఖ్యాకులైన కోట్లాది మంది కూడు, గూడు, గుడ్డ విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలకే నిత్యం పోరాడుతున్నారు. ఈ అసమానతలను తగ్గించాల్సిన పాలకులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించడం ప్రజల్లో అసంతృప్తిని, అసహనాన్ని పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పాలకులు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

దళితులు, ఆదివాసులు, మహిళలపై జరుగుతున్న దాడులకు ముగింపు పలికి, సమానత్వం కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. జల్, జంగల్, జమీన్‌పై కార్పొరేట్ ఆక్రమణలు ఆగాలి. పర్యావరణ విధ్వంసం కేవలం ప్రకృతి సమస్య కాదు. అది జీవన, సామాజిక న్యాయ సమస్య. అయితే, న్యాయవ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికైనా ఉచిత పథకాల దుబారాను తగ్గించి, నిజమైన అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. కేవలం అవసరమైన పేదలకు మాత్రమే సంక్షేమం అందిస్తూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరి, దేశం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయగలదు.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News