Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన శక్తి కలిగిన దేశం. 145 కోట్ల జనాభాలో 65 శాతానికి పైగా ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సామర్థ్యం, రాజకీయాలను మార్చే శక్తి, వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం ఉండాల్సిన వాళ్ళు. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి కీలక చారిత్రక దశలో యువతే మార్పునకు చోదకశక్తిగా నిలిచింది. అయితే, డిజిటల్ యుగంలో యువత రాజకీయ చైతన్యం కొత్త రూపం దాల్చింది. వీధి పోరాటాలు, విద్యార్థి ఉద్యమాల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్లు, మీమ్స్, ట్రోల్స్, వ్యంగ్య రాజకీయాలే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ఇది అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినా, యువతలో పెరుగుతున్న రాజకీయ అసంతృప్తిని ప్రతిబింబించే డిజిటల్ ఉద్యమంగా ప్రచారం పొందుతోంది. రాజకీయ అవకాశవాదం, కుటుంబ పాలన, ఫిరాయింపు సంస్కృతి, అవినీతిపై వ్యంగ్యాస్త్రంగా ఇది ముందుకొచ్చింది. కానీ దీని ప్రచార విధానం, ఎంచుకున్న అంశాలు, లక్ష్యాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా తటస్థ వేదిక కాదన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్ రాజకీయ వాదనలను ముందుకు తీసుకెళ్లే విధంగానే దీని ప్రచారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత ఒక సందర్భంలో ఫేక్ సర్టిఫికెట్లు, తప్పుడు పిటిషన్లతో న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కొందరిని ఉద్దేశించి “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అనే పదాలను ఉపయోగించారు. అయితే ఆ వ్యాఖ్యల అసలు సందర్భాన్ని పక్కనబెట్టి, యువతను అవమానించారన్న రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దానినే ఆధారంగా తీసుకుని “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య రాజకీయ వేదికను నిర్మించడం జరిగింది. అసలు వ్యాఖ్యల ఉద్దేశం, సందర్భం తెలుసుకోకుండా వైరల్ ప్రచారం చేయడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్బల్యం.

యువత నిజంగా ప్రశ్నించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనాల ప్రకారం యువ నిరుద్యోగం అనేక రాష్ట్రాల్లో 20 శాతానికి మించి నమోదవుతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది డిగ్రీలు పూర్తిచేసినా, వారికి తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు ఆలస్యం అవుతుండగా, ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. నీట్, యూజీసీ నెట్ వంటి పరీక్షల లీకేజీలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి.

అలాగే విద్యా, వైద్య రంగాల ప్రైవేటీకరణ కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు బలహీనపడుతుండగా, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. గ్రామీణ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం సామాజిక అసమానతలను పెంచుతోంది. ఇలాంటి అనేకానేక వ్యవ్థలపై సమీక్ష, చర్చ, పరిష్కారాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియా వ్యంగ్య రాజకీయాలే ప్రధాన చర్చగా మారడం విస్మరించలేనిది. పైగా ఆలోచించాల్సిన విషయం.

భారత రాజకీయాల్లో కుటుంబ పాలన కూడా యువత ప్రశ్నించాల్సిన ముఖ్య అంశమే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో నెహ్రూ–గాంధీ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతుండగా, బీజేపీ సహా ఇతర పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కుటుంబం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పదవులు కొన్ని కుటుంబాలకే పరిమితం కావడం ఆరోగ్యకర రాజకీయ సంస్కృతి కాదు.

తెలంగాణ ఉద్యమం, అస్సాం విద్యార్థి ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటాలు యువ శక్తి ఎంత ప్రభావవంతమో నిరూపించాయి. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. కానీ ఉద్యమ ఫలితాలను కొన్ని కుటుంబాలు, కొందరు రాజకీయ నాయకులే అనుభవిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో కనిపించింది.

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, సమస్యలపై బంద్ లు, ధర్నాలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అత్యంత అవసరం. ప్రశ్నించని సమాజం క్రమంగా బలహీనపడుతుంది. యువత నిజంగా దేశ భవిష్యత్తు కోసం నిలబడాలంటే నిరుద్యోగం, అవినీతి, విద్యా సంక్షోభం, కుటుంబ పాలన, నేర రాజకీయాలు, ఫిరాయింపులు వంటి సామాజిక సమస్యలపై పాలకులను నిలదీయాలి. రాజకీయ పార్టీలకు డిజిటల్ సైన్యాలుగా కాకుండా ప్రజల తరఫున మాట్లాడే శక్తిగా ఎదిగినప్పుడే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News