Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

సమ్మె ఆలోచనను విరమించండి

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ కార్మికుల సంక్షేమమే మా లక్ష్యం

రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్మిక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి దారి చూపుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఎంత మార్పులు వచ్చినా కార్మికుల ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్రను కొనియాడిన ఆయన, ఈ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలవగలిగిందంటే, కార్మికుల సహకారమే ప్రధాన కారణమని తెలిపారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇవ్వడంలో ప్రజా ప్రభుత్వం ముందుండిందని గుర్తు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్య పాలన వల్ల విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరిందని, ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం నష్టాలను తగ్గిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అసంఘటిత కార్మికుల కోసం త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఈ పాలసీ దేశానికి రోల్ మోడల్‌గా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, వారి పాలనలో 50 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌గా ఉండగా, మొత్తం 8 లక్షల 29 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలోనే కూలిపోయే పనులు చేశారన్న ఆయన, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చివరికి ఆ హామీని విస్మరించిన కపట నాయకత్వాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు.

ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబోధిస్తూ సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోంది అని ఆయన తెలిపారు. ఈ సంస్థను ఆదుకునే బాధ్యత కార్మికులదేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఆర్టీసీ విధ్వంసానికి గురైందని, ఆర్ధిక దోపిడీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.

సమ్మె ద్వారా రాష్ట్రానికి నష్టం కలుగుతుందని హెచ్చరిస్తూ, ఎలాంటి సమస్యలైనా సంబంధిత మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. “వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేయాలో మీరే సూచించండి. నేను అణా పైసా ఇంటికి తీసుకెళ్లేది లేదు. అన్నీ మీ కోసమే ఖర్చు చేస్తాం,” అని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, నిజం ఏమిటో చెబడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సమ్మె పోటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. “ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. మరో ఏడాదిలో కాస్త కుదురుకుంటుంది,” అని సీఎం చెప్పారు.

గతంలో ఏమీ చేయని వారు ఇప్పుడు మళ్లీ వచ్చి మాటలు చెప్పినా వారి వలలో పడకూడదని ఆర్టీసీ కార్మికులను కోరారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. మీరు నన్ను నమ్మండి. నన్ను నమ్మిన మీకు నేను అండగా ఉంటాను,” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సద్దుబాటులోకి వస్తుందని, మరో ఏడాదిలో కొంత స్థిరపడుతుందని తెలిపారు. గతంలో పాలించిన వారు ఇప్పుడు తిరిగి వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. నన్ను నమ్మండి. మీకు నేను అండగా ఉంటా,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.

 

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News