Thursday, July 30, 2026
24.4 C
Hyderabad

భవిష్యత్ అవసరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలి|Review|CM|

రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే ఇది 9.8 శాతం అధికమని తెలిపారు. అలాగే వచ్చే 2025-26 లో డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరగనుండగా, 2034-35 నాటికి ఇది 31,808 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వేలు, మెట్రో, మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడల విద్యుత్ అవసరాలను అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

హైదరాబాద్ డేటా హబ్‌గా మారబోతుందన్న సీఎం, డేటా సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు అవసరమైన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్ కనిపించకుండా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు చేపట్టాలని, హై టెన్షన్ లైన్లను అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్‌ను అమలు చేయాలని, సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో 160 కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలలోనూ సోలార్ విద్యుత్ సాధ్యసాధ్యతలు పరిశీలించాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News