Thursday, July 30, 2026
24.4 C
Hyderabad

కొండా దంపతుల ఖామోష్!

కార్మిక భవన కథన రంగంలోకి కాంగ్రెస్?!
-ఆ క్రెడిట్ తామే కొట్టేయాలని తహతహ
-ఇక ప్రముఖ నేతలదే ముఖ్య భూమిక
-ఈ పండుగ తర్వాత…ప్రత్యేక సమావేశం
-తెర ముందుకు ప్రత్యక్ష కార్యాచరణ
-కొనసాగుతున్న లక్ష సంతకాల సేకరణ

కొండా దంపతులు మౌనముద్ర దాల్చిన నేపథ్యంలో..ఇక కార్మిక భవన… కథన రంగంలోకి కాంగ్రెస్ దూకుతోందా? ఆ పార్టీ ప్రముఖ నేతలే ముఖ్య భూమిక పోషించడానికి సిద్ధమయ్యారా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. ఈ సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు కొందరు ప్రత్యక్షంగా అజంజాహీ మిల్లు కార్మిక భవన పరిరక్షణకు నడుం బిగించనున్నారు. అంతేకాదు లక్ష సంతకాల సేకరణ జరుగుతుండగానే, ఒకటి రెండు రోజుల్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని ఒక కార్యాచరణకు రెడీ అవుతున్నారు.

స్వాతంత్ర్యయానికి ముందే 1932లోనే 10వేల మంది కార్మికుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించిన అజంజాహీ మిల్లు కాల క్రమంలో నష్టాల బాటపట్టి మూసివేసే దశకు చేరుకుంది. 202 ఎకరాల స్థలం చివరకు 35 ఎకరాలకు మిగిలింది. అది కూడా వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించగా, ప్లాట్లు చేసి అమ్మేశారు. కార్మికుల కుటుంబాలకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ అమలు కాలేదు. అజంజాహీ కి ఆఖరి గుర్తుగా మిగిలిన కార్మిక భవన స్థలాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక ప్రజా ప్రతినిధి ప్రమేయంతో ఓ వ్యక్తి ద్వారా ఓ బడా వ్యాపారికి అమ్మేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలంలోనే కార్పొరేషన్ పర్మీషన్ తీసుకుని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆ కాంప్లెక్స్ నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టడం, భవనాన్ని కూల్చే ప్రయత్నంలోనే…సమస్య మొదలైంది. మిల్లు కార్మిక కుటుంబాలు భగ్గుమన్నాయి. వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నట్లు తనకు తెలియదని కొండా మురళి సర్దుకున్నారు. కానీ, కార్పరేషన్ ఇచ్చిన పర్మీషన్ ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ ను కాన్సిల్ చేయాలని, అదే స్థలంలో కొత్త కార్మిక భవనాన్ని నిర్మించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మొదట అజం జాహీ మిల్లు కార్మిక భవన పరిరక్షణకు మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, ప్రజా సంఘాలు, కమలదళం, కమ్యూనిస్టులు ఉద్యమించారు. లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. లక్ష సంతకాల సేకరణ సందర్భంగా బిజెపి నేతలు క్రియాశీలకంగా కనిపించడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ విషయమై ఆరా తీయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కార్మిక భవన పరిరక్షణకు కార్మికుల పక్షపాతులుగా కమ్యూనిస్టులు కాలు దువ్వారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్మిక భవన కథన రంగంలోకి దిగనుండటం మరింత ఆసక్తిగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మిల్లు స్థలం ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త కొండా మురళి షాపింగ్ కాంప్లెక్స్ కి కొబ్బరి కాయ కొట్టి, ఆ పొరపాటును గ్రహపాటుగా చెప్పి గప్ చుప్ గా ఉండిపోయారు. తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే ఊతంగా ఉద్యమంగా మారి ఉధృతమైంది. అఖిల పక్షాలు, వామపక్షాలు, ప్రజాపక్షాలు కార్మిక పక్షం వహిస్తుండటంతో కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్న(?) పక్షంగా మారింది. క్రీయాశీల నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రి సురేఖ దంపతులు నిష్ర్కియాపరం కావడంతో విపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మిల్లు కార్మికుల కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ప్రభుత్వంతోపాటు, పార్టీ పరువు ప్రతిష్టలను కాపాడడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పటి దాకా మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణకు తెరవెనుక పని చేసిన వారంతా తెరముందుకు రావాలని నిర్ణయించకున్నారు. మిల్లు కార్మిక భవన స్థలం అన్యాక్రాంతం కావడానికి కారణాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకుని, సాక్ష్యాధారాలతో సీఎం రేవంత్ రెడ్డికి నివేదించారు.

మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ దంపతులకు సంబంధం లేకుండానే, నేరుగా, స్వతంత్రంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఈ పండుగ తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ఒక కార్యచారణ సిద్ధం చేయనున్నారు.

కాగా, ఈ స్థలం పై తాము ఇచ్చిన అనుమతులపై దిద్దుబాటుకు దిగింది వరంగల్ మహానగర కార్పొరేషన్. డిసెంబర్ 31వ తేదీననే ఈ స్థలంపై ఇచ్చిన అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని సదరు బడా వ్యాపారికి కమిషనర్ నోటీసులు ఇచ్చారు. 15 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కోర్టు కేసు తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో ఏ విధంగా స్పందించాలి? అనే అంశాలపై కలెక్టర్ సహా సంబంధిత అధికారులను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాగూ కార్మిక భవన స్థల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యమం ఏ రూపం తీసుకున్నా ఆ స్థలాన్ని ప్రభుత్వం పరిరక్షించాల్సిందే. ప్రభుత్వంలో ఉండీ ఆ క్రెడిట్ మరెవ్వరో కొట్టేస్తుంటే చేతులు ముడుచుకు కూర్చోవడం కంటే, “చేయి ” ఎత్తి జై కొట్టాలని, ఆ క్రెడిట్ ని తమ, తమ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు ప్రముఖులు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అజం జాహి మిల్లు కార్మిక భవన స్థల వివాదం రసవత్తరంగా మారింది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News