Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

భారత భద్రత, భవితవ్యం భవ్యమేనా!?|EDITORIAL

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబులు పేలి 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. ఈ ఒక్క ఘటన అనేక కుట్రలను వెలుగులోకి తెస్తున్నది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు మారణహోమానికి తెగిస్తున్నాయన్నది తేలిపోయింది. నీరు, ఆహార పదార్థాల్లో విషం కలిపి చంపాలని కుట్రలు చేసిన తీరు విస్మయం కలిగించకమానదు. దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాకొద్ది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అఖండ భారత్‌ నుంచి విడివడ్డ పాక్‌, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మతం ముసుగులో మారణహోమం చేయాలనుకున్న వారిని ఏరిపారుయడం వినా మరో మార్గం లేదు.
ఢిల్లీ పేలుళ్ల కుట్రలను ఛేదించి, శోధించిన కొద్దీ ఉగ్ర కుట్రలనేకం వెల్లడవుతున్నాయి. తుర్కియేలోని ’ఉకాసా’ అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్‌ టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్‌. ఫరీదాబాద్‌ మాడ్యుల్‌, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్‌ ఘజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ అనే సంస్థల నిర్వాహకులకు ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో డాక్టర్‌ ఉమర్‌తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్‌తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్‌ ఉమర్‌ తో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. అంకారాలో వారు రెండు వారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హ్యాండ్లర్‌ కూడా అంకారాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే ఈ గ్రూప్‌ను నడపడంతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చినట్లు భావిస్తున్నారు. భారత్‌లో బహుళ పేలుళ్లకు రూపొందించిన మాడ్యూల్‌ ప్రణాళిక వెనుక ఉకాసా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. హ్యాండ్లర్లతో చర్చించేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాడ్యూల్‌ వెనుక ఓ విదేశీ గ్రూప్‌ పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నిందితులు చేసిన చాట్‌, కాల్‌ హిస్టరీలను అధికారులు ఛేదిస్తున్నారు. ఉకాసా ను గుర్తించడంతో పాటు అతడికి పాక్‌ ఉగ్రవాద నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి తెలుసు కునేందుకు విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా నాలుగు కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక కొత్త, మరో రెండు పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఐ20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా.. ఎకోస్పోర్ట్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు వారి డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఇద్దరు చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దిల్లీ పేలుడు ఘటన పై దర్యాప్తు చేపట్టిన అధికారులు హరియాణాలోని ఫరీదాబాద్‌లో గల అల్‌ ఫలా యూనివర్సిటీని జల్లెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ లోని 17వ నంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇజ్రాయెల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది. ఇప్పుడు భారత్‌లో వారు ఆడిన ఆటలు సాగకపోవడం వల్లే ఈ దాడులకు తెగిస్తున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న ప్రశాంతను చెదరగొట్టారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అలాగే చేయాలనుకుంటున్నారు.

దేశంలో అక్రమ వలసల నివారణకు గట్టి చర్యలేమీలేవు. పైగా అలాంటి వారికి ఓటర్, గుర్తింపులు అలవోకగా లభిస్తున్నాయి. దేశం వీడి వెళ్లే, వచ్చే వాళ్ళపై తగిన నిఘా లేదు. విదేశీ సరిహద్దులు దాటి మన దేశంలోనే ఉగ్రమూలాలు వేళ్ళూనుకుంటుంటే అరికట్టే విధానాలేవీ లేవు. నిఘా వర్గాలు విఫలమైనప్పుడల్లా ఢిల్లీ పేలుడు లాంటి ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పుడే అప్రమత్తత. ఆతర్వాత మళ్ళీ ఘటన జరిగేదాకా మొద్దు నిద్ర. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో రక్షణ, భద్రతపై కఠిన నియమ నిబంధనలు తప్పనిసరి. అందుకు తగిన విధి విధానాలు రూపొందించి అమలు చేయాలి. ప్రపంచానికి శాంతిని నేర్పిన దేశంలో అశాంతి రగలకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది. అందుకు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది, ప్రజలది.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News