Saturday, April 11, 2026
26.7 C
Hyderabad

Government|పాలనలో పురోగతికి మార్గదర్శకంగా కీలక నిర్ణయాలు|Decision

ఏపీ cabinet| కేబినెట్ సమావేశం నిర్ణయాలు ప్రకటించిన minister| మంత్రి పార్ధసారథి |Parthasarathi

Andhra Pradesh| ఆంధ్రప్రదేశ్ State| రాష్ట్ర Cabinet| మంత్రివర్గం ఏడాది పాలనలో 26 కేబినెట్ సమావేశాలు నిర్వహించి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకుందంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారథి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి Chief Minister| ముఖ్యమంత్రి Chandrababu| చంద్రబాబు ఆధ్వర్యంలో కీలకమైన విధానాత్మక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో పారదర్శకతకు, చర్చల ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్–2025 రూపొందించి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. అసైన్డ్ భూములపై వివాదాలు లేకుండా, పునర్విమర్శలతో రీ సర్వే చేసి మెరుగైన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జీఎడీ టవర్, హెచ్‌వోడి టవర్ల నిర్మాణ పనులు ఎన్‌సీసీ, షాపూజీ పల్లంజీ, ఎల్ అండ్ డీలకు అప్పగించినట్టు వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేస్తూ, వాటిని సులభతరం చేయాలని కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. టెన్నిస్‌లో రజత పతకం సాధించిన సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోట వద్ద రిసార్టు నిర్మాణానికి 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు.

శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రతా పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సాగిపోయే 3 వేల టీఎంసీలు నీటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా చేపట్టనున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Vijayawada| విజయవాడలో Ambedkar| అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏపీ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించగా, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని అమరావతిలో అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ సంస్థ 1,582 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని, దాని ద్వారా 8,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమరావతిలో E3 రోడ్డును NH-16 కు అనుసంధానించేందుకు రూ.682 కోట్లకు టెండర్లు ఆమోదించినట్టు వెల్లడించారు.

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 273.17 కోట్లతో పొగాకు కొనుగోలు చేయనున్నట్టు, 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు కోసం క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటిద్వారా 30,270 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఆంధ్ర సంస్థను “స్వర్ణాంద్ర పి4 ఫౌండేషన్”గా మారుస్తూ ప్రతిపాదనలు ఆమోదించినట్టు తెలిపారు.

ఏడాది పాలన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో పల్నాడు పర్యటన సందర్భంగా JAGAN| జగన్ చేపట్టిన కార్యకలాపాలను తప్పుబడుతూ, అనుమతులేకుండా నిరసనలు, బలప్రదర్శన నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నరికేస్తాం, తొక్కేస్తాం లాంటి భాషను సమర్థించడం దురదృష్టకరమని, ఇలాంటి హింసాత్మక భావజాలం ప్రజల మధ్యకు రాకూడదని హితవు పలికారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరికైనా విమర్శ అవసరం లేదని, వృథాగా వెళ్లే గోదావరి నీటిని వినియోగించుకునేందుకు, రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. సామరస్యపూర్వక చర్చల ద్వారానే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని సీఎం చంద్రబాబు కలిగి ఉన్నారని మంత్రి పార్ధసారథి వివరించారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News