Monday, August 3, 2026
31.5 C
Hyderabad

పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయెనా!|EDITORIAL

ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు, ఏటికి ఎదురీదే రైతు ఎందుకు అప్పుల పాలవుతున్నాడు? అసలు రైతు ఆత్మహత్యకు పురికొల్పుతున్న అంశాలేంటి? మరి ప్రభుత్వాలు గొప్పగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, పంట పెట్టుబడులు అందిస్తున్నామని, రుణమాఫీలు చేస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి కదా? నీటి తీరువా రద్దు, ఉచిత విద్యుత్‌ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి కదా? ఇన్ని చేసినా రైతు కంట కన్నీరెందుకు? రైతు ఇంట చావులెందుకు? దళారుల ఇంట పన్నీరెందుకు?

దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో 11శాతం రైతులవే. ప్రతి లక్ష మంది జనాభా కు 1.4 శాతం మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. పంట నష్టం, దివాళా, వ్యవసాయ సంబంధ సమస్యలు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని కేంద్రం విశ్లేషించింది. మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో దాదాపు 83 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 70 శాతం గ్రామీణ మహిళలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు. 1991లో వచ్చిన సంస్కరణల తర్వాత మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్‌ కైమ్ర్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు చనిపోతున్నాడు.

రోజురోజుకు వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి. యాంత్రీకరణ పెరిగింది. సాంకేతికత వినియోగం కూడా జరుగుతున్నది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, పెట్టుబడులు పెరిగాయి. దిగుబడులు తగ్గాయి. కూలీ రేట్లు అధికమయ్యాయి. అతివ్రుష్టి, అనావ్రుష్టి, ప్రక్రుతి వైపరీత్యాలు, వాతావరణ దుష్పరిణామాలు వంటివి కూడా కర్షకుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కమతాలు చిన్నవిగా మారుతున్నాయి. సాగునీరు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పేద రైతులు అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాల ఖర్చులు, ఆనారోగ్యాలు, ప్రమాదాల వైద్య వ్యయాలు ఎక్కువయ్యాయి. వడ్డీరేట్లు పెరిగి, తక్కువ సమయంలోనే అప్పులు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి దఫా అప్పు చెల్లించక పోవడంతో రెండోదఫా నిరాకరించడం, ప్రభుత్వాలు, బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సిన రుణాలను ఇతర రంగాలకు మళ్లించడం వంటివి కూడా సమస్యలుగా మారుతున్నాయి. రైతులకు కొంత మొత్తంలోనే రుణాలిచ్చిన బ్యాంకులు రుణమాఫీని కూడా క్రమశిక్షణా రాహిత్యంగా చూపుతున్నాయి. జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాడు. రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక వ్యవసాయ వృత్తిలోనే కూరుకు పోవడంతో రైతు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అప్పు సామాజికంగా రైతును కుంగదీస్తుంది. తనకు వచ్చే ఆదాయంతో అప్పు తీర్చలేకపోతున్నాడు. గతంలోలా ఇంటిల్లిపాది వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేక.. పరువు పోతోందనే ఆవేదనతో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మరి ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఈ భూమ్మీద ప్రతి ఉత్పత్తిదారు తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించి విక్రయిస్తుండగా, ఒక్క రైతు మాత్రమే తమ పంటల ఉత్పత్తులకు వేరోకరు నిర్ణయించిన ధరలకు తెగనమ్ముకుంటున్నాడు. అదే అసలు సమస్య. అయితే, దీన్నే పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం అంటున్నాం. పెట్టుబడులు పోను, లాభాలతో మిగతా అన్ని వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముడవుతున్నప్పుడు రైతులు పండించిన ధాన్యాలు ఎందుకు లాభంపై విక్రయించకూడదు? రైతు హక్కులు కూడా మానవ హక్కులే. దానిపై ఒక సమగ్ర విధాన రూపకల్పన జరగడం లేదు. వ్యవస్థాగత రుణాలు కల్పించాలి. రైతులకు సరైన శిక్షణ ఇచ్చి లాభాలు పొందేటట్టు చేయాలి. సామాజికంగా పౌరులు, మీడియా, ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సమస్యలను తీవ్రమైన, ముఖ్యమైన అంశంగా పరిగణించి ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

వ్యవసాయం అసంఘటిత రంగంలో ఉండటంతో పథకాలు కూడా లబ్ధిదారులకు సరిగా చేరడం లేదు. ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలు, ఏపీలో అన్నదాతకు ఆర్థిక సాయం అందుతోంది. అయినా రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. హరిత విప్లవం తర్వాత దిగుబడి పెరిగినా, ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. పంటల మార్కెటింగ్ మరో సమస్య. మార్కెట్లల్లో తీవ్ర అవినీతిని ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర దక్కడం లేదు. వ్యవసాయం రంగంలోని మహిళల సంక్షేమానికి దిక్కులేదు. రుణాలు, రుణ హామీలు, రుణ బదిలీలు, రుణ మాఫీలకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు, బ్యాంకులు జవాబుదారీగా వ్యవహరించాలి. వ్యవసానుబంధ రంగాలను ప్రోత్సహించాలి. కోళ్ళు, పశువులు, కూరగాయల సాగను ప్రోత్సహించాలి. వీటికి మార్కెటింగ్ ను కల్పించాలి. రైతు సమస్యల పరిష్కారం లక్ష్యంగా 2004లో ఏర్పాటు చేసిన స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు రైతు ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. రైతులు చనిపోయాక పరిహారం ఇచ్చి అదే పరిష్కారం అనుకోవడమే తప్పని సూత్రీకరించింది.

అయితే సంక్షోభాల నివారణకు శాస్త్రీయ దృక్పథం అవసరం. అప్పుడే వ్యవసాయం పురోగమించ గలదు. ఆత్మహత్యలను నిరోధించగలం. ఉత్పత్తిని పెంచగలం. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగస్వామిని చేయగలం.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News