Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

కుల లెక్కల చిక్కులు తేలాల్సిందే!

జన గణనతో పాటు కులగణనపై కేంద్రం తీసుకున్న అనూహ్య నిర్ణయం రాజకీయ ఎత్తుగడే. ఇంకా చెప్పాలంటే ఎత్తుకుపై ఎత్తు. కాంగ్రెస్ గత ఎన్నికల నాటి నుంచి కుల గణనపై అదే పనిగా మాట్లాడుతోంది. కుల గణనను ఎజెండాగా చేసి, బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్న కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తుగా కుల గణనకు కేంద్రం నిర్ణయించడంతో ఇప్పుడు కాంగ్రస్ ను బీజేపీ కార్నర్ చేసినట్లయింది. స్వతంత్ర దేశంలో మొట్టమొదటి సారి తెలంగాణలో కుల గుణన చేపట్టామని చెప్పడం కేవలం క్రెడిట్ కొట్టేయడానికే తప్ప, అందులో పెద్దగా పసేమీ లేదు. పదేళ్ళ క్రితమే కర్ణాటకలో అప్పటి సిద్ధ రామయ్య ప్రభుత్వ హయాంలో వందకోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులగణనపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ నివేదిక బయటకు రాలేదు. అలాగే 2011 లో ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులలెక్కల చిక్కులు తేలక చివరకు కేంద్రం చేతులేత్తేసింది. కుల గణనపై ఏ పార్టీ మాట్లాడినా రాజకీయ లబ్ది పొందడమే తప్ప, అందులో ప్రజా ప్రయోజన కోణం చాలా తక్కువ.

అయితే, పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా కేబినేట్‌ కులగణన నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కాంగ్రెస్ అస్సలు ఊహించలేదు. కాకపోతే, తెలంగాణ సీఎం మాత్రం కుల గణనకు వెళ్ళడం తప్ప కేంద్రంలో బీజేపీకీ వేరే ఆప్షన్ లేదన్నారు. అదే నిజమైంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. మరి అధికారంలో ఉన్నన్నాళ్ళూ పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు కుల గణన గురించి ఎందుకు మాట్లాడుతున్నదని బీజేపీ విమర్శిస్తున్నది. పదేళ్ల యూపిఎ పాలనలో కూడా కాంగ్రెస్ కు ఈ ధ్యాసే రాలేదు. అందుకే కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ, రిజర్వేషన్లను రాజీవ్‌గాంధీ లోక్‌సభలోనే వ్యతిరేకించారంటూ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారని ఆరోపణలూ చేసింది. దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎప్పుడూ కులగణన గురించి ఆలోచన చేయలేదని బీజేపీ అంటోంది. నిజానికి బీజేపీ ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద జవాబు లేదు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా, ఎంతో పకడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తిచేశామనీ, దేశానికి తామే రోల్‌ మోడల్‌ అని రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఆ రోల్ లేకుండా చేయడమే బీజేపీ ఎత్తుగడ. కాంగ్రెస్‌ బీజేపీపై ఎక్కుపెట్టిన కులగణన అస్త్రాన్ని తిరిగి ఆ పార్టీకే బీజేపీ ఎక్కుపెట్టింది.

అసలు ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా సిగ్గు పడాల్సిన అంశాలేంటంటే… 1931 తర్వాత కులాల లెక్కలే జరగకపోవడం. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళవుతున్నది. కానీ, విస్మరించలేని కుల వ్యవస్థలో ఉన్న మన దేశ జనాభాలో ఏయే కులాల జనాభా ఎంత? వారి సామాజిక, ఆర్థిక వివరాలేవీ లేకుండానే పరిపాలన సాగుతుండటం. అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతుండటం. బడ్జెట్ లెక్కలు వేసుకుని ఖర్చు చేస్తుండటం, అప్పులు చేస్తుండటం. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుకుంటుండటం. రిజర్వేష్లను అమలు చేసుకోవడం. ఎన్నికలు నిర్వహించుకుని, ప్రభుత్వాలను ఏలడం. మరి ఇంతకాలంగా అన్ని రకాల అవకాశాలు ఎవరి పరం అవుతున్నాయి? ఏ అటవిక న్యాయం అమలవుతున్నది? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మేడి పండు రూపం ఇదేనా? ఎంత సిగ్గు చేటు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి?

జనాభా. కుల గణనతోపాటు, విద్య, ఉద్యోగ, ఆస్తుల వివరాలను కూడా పక్కాగా సేకరిస్తే, ఇంతకాలంగా ఏయే కులాలు ఏ మేరకు లాభపడ్డాయనేది బయట పడుతుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా తెలిసి వస్తాయి. కేవలం కుల జనాభాను బట్టి కాకుండా, వారి ఆర్థిక, సామాజిక స్థితి గతులను బట్టి ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, పదవులు ఇవ్వాలన్న దానిపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. కేవలం కులం, కుల జనాభా ఆధారంగానే అయితే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లే తప్ప రాజకీయ అవకాశాలు వస్తాయనుకోలేం. రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తే ముందుగా ఇప్పుడున్న రాజకీయ పార్టీల నాయకుల పదవులే ఊడుతాయి. రాజకీయంగా సంక్షోభాలు, ప్రకంపనలు తప్పవేమో? ఇంత కాలంగా పదవులు అనుభవిస్తున్న కులాల మూలాలను పెకిలించక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కుల గణనకు పచ్చ జెండా ఊపుతున్న నేతలు రేపు తమ స్థానాలను, అవకాశాలను కోల్పోవడానికి సిద్ధపడతారా?

కుల గణన తర్వాత అటు రిజర్వేషన్లపైనే గాక రాజకీయంగా కూడా ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉంటుంది. నిజానికి రాజకీయ రిజర్వేషన్లు లేకుండా, రాకుండా విద్యా, ఉద్యోగ, ఉపాధి రిజర్వేషన్లకు అర్థం లేదు. సమస్యలు వస్తాయని పరిష్కారాలు మానేయడం కూడా సరికాదు. ఎక్కడో ఓ దగ్గర మొదలు కావాల్సిందే. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. ఒకసారి కుల గణన చేపడితే, దాన్ని కొనసాగించాల్సి రావడం వల్ల భవిష్యత్ తరాల వారికి కూడా ఆ ఫలాలు సమంగా, సమానంగా అందే అవకాశం ఉంటుంది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News