Saturday, July 18, 2026
24.1 C
Hyderabad

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!!
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం
అడుగంటుతున్న జలాశయాలు
జీవ నదుల్లోనూ జల జీవమే లేదు
రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి
సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు
ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ
20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు
బోరుబావుల కింద వరి సాగూ కష్టమే?

హైదరాబాద్, జూలై 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో ప్రధాన నదులు, జలాశయాలు జలకళను కోల్పోయి అడుగంటుతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు వాటి పూర్తి సామర్థ్యంలో కనీసం మూడో వంతు కూడా లేకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కొద్దిరోజుల పాటు వచ్చిన అరకొర వరద నీరు కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రుతుపవనాలు కదలిక లేకపోవడం, వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రధాన జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి శాతం పడిపోవడంతో సాగు, తాగునీటి అవసరాలకు గండం పొంచి ఉందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

ముఖ్యంగా గోదావరి బేసిన్ పరిధిలోని 57 జలాశయాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 418.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 94.72 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 108 టీఎంసీల నీరు ఉండగా, ఈసారి అంతకంటే తక్కువకు పడిపోవడం గమనార్హం. గత పదేళ్ల సగటు నిల్వ అయిన 151.62 టీఎంసీలతో పోల్చి చూస్తే ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గత వారం, పది రోజులుగా గోదావరి బేసిన్‌లో వస్తున్న వరద గణనీయంగా తగ్గిపోవడంతో మేడిగడ్డ వద్ద ఇన్‌ఫ్లో కేవలం 16 వేల క్యూసెక్కులకు పడిపోయింది. అలాగే సమ్మక్క బ్యారేజ్ వద్ద 27 వేల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 29 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతుండటం నది ఎండిపోతుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరోవైపు కృష్ణా బేసిన్‌లోనూ దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని 30 జలాశయాల మొత్తం సామర్థ్యం 640.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 240.37 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది జలాశయాల పూర్తి సామర్థ్యంలో కేవలం 38 శాతం మాత్రమే. గోదావరి బేసిన్‌తో పోలిస్తే కృష్ణా బేసిన్ పరిస్థితి కొద్దిగా మెరుగ్గా అనిపించినప్పటికీ, గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఇది దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. గత పదేళ్ల సగటు నిల్వ అయిన 277.64 టీఎంసీలతో పోల్చినా ప్రస్తుత నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రావాల్సిన ప్రవాహాలు కూడా క్రమంగా క్షీణిస్తున్నాయి.

కర్ణాటకలోని కీలకమైన ఆల్మట్టి జలాశయంలోకి ఇన్‌ఫ్లోలు 15 వేల క్యూసెక్కులకు పడిపోగా, తుంగభద్ర జలాశయంలోకి వస్తున్న ప్రవాహం 10 వేల క్యూసెక్కుల కంటే దిగువకు పడిపోయింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో కృష్ణా బేసిన్‌లోని జలాశయాలు వేగంగా నిండే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. సాధారణంగా వర్షాకాలం ముదిరిన ఈ నెలలో జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకోవాల్సి ఉండగా, ఈసారి ఎల్‌నినో సృష్టించిన వాతావరణ మార్పుల వల్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా, ఆందోళనకరంగా మారింది. వర్షాల కోసం అన్నదాతలు, ప్రజలు ఆకాశం వైపు చూస్తుండగా, జలాశయాల అడుగడుగునా కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Latest News

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News