Friday, April 10, 2026
26.7 C
Hyderabad

గంజాయి, డ్రగ్స్ మాఫియా మరణ మృదంగం!|EDITORIAL

2016లో డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా సంచలనమైంది. కానీ, అతకంటే సంచలనం డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, వినియోగం, సరఫరా అని గుర్తించలేకున్నాం. ఇదే ఇప్పుడు దేశంలో మొత్తం సమాజాన్ని క్యాన్సర్ కంటే వేగంగా, నిర్దాక్షిణ్యంగా, నిరపేక్షంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది.
దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న డ్రగ్స్, గంజాయి మాఫియా ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ పరిసరాల్లో ఫాం హౌస్‌ ల్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతుండటం, అందులో ప్రముఖంగా రాజకీయ నేతలు, వ్యాపారులు, సినీ రంగ వ్యక్తుల పేర్లు వినిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

భారతదేశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఐదేళ్లలో డ్రగ్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. 2019లో దేశవ్యాప్తంగా 59వేల కేసులు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. నాలుగేళ్లలో 40% పెరుగుదల కనిపించింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల స్వాధీనం కూడా భారీగా పెరిగింది. 2022లో దేశవ్యాప్తంగా 4వేల టన్నులకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 7.7 కోట్ల మంది మాదక ద్రవ్యాలను ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారని అంచనా. అందులో గంజాయి వినియోగదారులు 3.1 కోట్ల మంది. 18–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2024-25 లో ఏపీ, తెలంగాణ కలిపి 100 టన్నులకు పైగా గంజాయి పట్టుబడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే దేశంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గంజాయి (భాం, చరస్) వినియోగం ఎక్కువగా ఉండగా, పంజాబ్ , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో సింథటిక్ డ్రగ్స్, ఓపియాయిడ్ల (హెరాయిన్) వాడకం, రవాణా ఎక్కువగా ఉంది. 2018 నాటి గణాంకాల ప్రకారం ఢిల్లీ, ముంబై నగరాలు గంజాయి వినియోగంలో ప్రపంచంలోని ప్రధాన నగరాల జాబితాలో ముందున్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాల్లో 70% నుంచి 80% డ్రగ్స్, గంజాయి వంటి మత్తు వల్లేనని తేలింది.

హైదరాబాద్ డ్రగ్స్ రవాణా, వినియోగానికి ప్రధాన కేంద్రంగా మారుతున్నది. తెలంగాణ పోలీస్ గణాంకాల ప్రకారం 2020లో నమోదైన డ్రగ్స్ కేసులు 1,200 కాగా, 2023 నాటికి అవి 2,500 దాటాయి. మూడేళ్ళలోనే రెట్టింపు కేసులయ్యాయి. గంజాయే కాక, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ గంజాయి సాగు, రవాణాల్లో కీలకంగా మారింది. 2021లో ఏపీలో 1 లక్షా 80 వేల కిలోల గంజాయి స్వాధీనం కాగా, 2023లో అది 2 లక్షల 50వేల కిలోలకు పెరిగింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయి. ఏపీ పోలీసులు గత మూడేళ్ళల్లో5వేలకు పైగా గంజాయి కేసులు నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాలకు, స్కూల్ టీనేజీ లోపు పిల్లలకు విస్తరిస్తుండటం ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ లు భారతదేశాన్ని ట్రాన్సిట్ హబ్‌గా వాడుకుంటున్నాయి. యువతలో, ముఖ్యంగా ఐటీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోని కొంతమందిలో డ్రగ్స్ వినియోగం ఫ్యాషన్‌గా, స్టేటస్ సింబల్ గా మారింది. ఈ దందాగాళ్ళకు రాజకీయ ఆశ్రయం దొరుకుతోంది. తాజాగా ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.

మొయినాబాద్ ఫాంహౌజ్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపి పుట్టా మహేశ్‌లు పట్టుబడ్డారు. వారి స్నేహితుడు ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేశ్, నమిత్‌శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. మిగతా నలుగురూ కొకైన్ వాడినట్లు తేలింది. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లు బెంగళూరు కౌషిక్ రవి వెల్లడించాడు. వాళ్ళందరికీ గత కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటుందని తేలింది.

తెలంగాణలో ప్రత్యేకంగా ఈగిల్ టాస్క్ ఫోర్స్ తో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఏపీలో కూడా డ్రోన్ల సహాయంతో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నా, కొత్త ప్రాంతాల్లో సాగు కొనసాగుతోంది.

డ్రగ్స్ మాపియాని రూపుమాపడానికి సమగ్ర వ్యూహం అవసరం. చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. యువతలో అవగాహన పెంచాలి. డ్రగ్స్‌ కు బానిసైన వారిని శిక్షించడం కంటే చికిత్స చేయడం ముఖ్యం. డీ-అడిక్షన్ కేంద్రాలను విస్తరించాలి. డ్రగ్స్ ట్రాకింగ్, స్మగ్లింగ్ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలి. రాజకీయంగా ఆశ్రయమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి రాజకీయ నేతలపై బహిష్కరణ, నిషేధం విధించాలి. మెక్సికో మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ నెమెసియో ఒసెగుయెరా అలియాస్‌ ‘ఎల్‌ మెంచో’ ను ఆ దేశమే వెంటాడి చంపాల్సి వచ్చింది.
అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి. డ్రగ్స్, గంజాయి మాఫియా కేవలం నేర సమస్య మాత్రమే కాదు, అది సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సంక్షోభం. తాజా సంఘటనలను హెచ్చరికలా భావించి, ప్రభుత్వాలు, సమాజం కలసికట్టుగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News