Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

గొప్పలు! అప్పులు!! తిప్పలు!!!

సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేయమని అడిగిందెవరు? చెప్పిందెవరు? ఉచిత బియ్యం, 58ఏళ్లకే పెన్షన్లు, రాజకీయ నాయకులకు జీతభత్యాలు, వాటి పెంపులు, పలు రకాల పందేరాలు ఎవరి కోసం? ప్రజలు కట్టే పన్నులతో పరిపాలన చేయాల్సిన నేతలు రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నారు. అభివృద్ధి అంటే పెన్షన్లు పెంచడం, సన్నబియ్యం పంచడమేనా? ఇలాంటి పథకాలని నిలదీయడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. ఎపి, తెలంగాణ రాష్ట్రమేదైనా, ధరల గురించి మాట్లాడరు. అభివృద్ధి గురించి మాట్లాడరు. నాయకులు వారి సెక్యూరిటీ, వారి ఆస్తులను కూడబెట్టుకోవడం, ఆకాశ హర్మ్యాలను నిర్మించుకోవడం, ప్రజా ధనంతో సోకులు చేసుకోవడం ఇదేనా పాలన అంటే? ప్రజలంతా ఆలోచించాలి. జగన్‌ తన హయాంలో రాజధాని, పోలవరం నిర్మాణాలను పక్కన పెట్టారు. విశాఖ భీమిలి దగ్గర మాత్రం అద్భుత సౌధాలను నిర్మించుకున్నారు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ కట్టారు. పైగా వీటిని నేటికీ సమర్థించు కుంటున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. ఇలాంటి పాలకులు ప్రజలకు అవసరమా? ఆలోచించాలి. రాష్ట్రాలను అప్పుల కుప్ప చేసి…దివాళా తీయించిన నేతలు నీతి వాక్యాలు పలుకుతుండటం విడ్డూరమే. పైగా అప్పులు చేసి, సంపద పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సకాలంలో ధాన్యం, మిర్చీ కొనుగోళ్లు చేయరు. విద్యుత్‌, విద్యా, వైద్య రంగాలను పట్టించుకోరు. ఇలాంటివాళ్ళు మన పాలకులు అయినందుకు సిగ్గు పడాలి. ఇక తాజాగా హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని నిస్సిగ్గుగా అమ్మాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు విధానం కాక మరోటి కాదు. పెన్షన్లు, ఉచిత బస్సు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ఎవరు అడిగారు? ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయో లేదో ఆలోచించకుండా ఇష్టారీతిన హావిూలు ఇచ్చి ఇప్పుడు భూములు, ఆస్తులు తెగనమ్మితే ఎలా? నీతులు వళ్ళిస్తున్న గత బిఆర్‌ఎస్‌ పాలకులు కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ చేయలేదు. వారి హయాంలోనూ భూములు అమ్ముకున్నారు. పేదలు ఇళ్లు కొనగలిగేలా పరిస్థితులు ఉంటే మూసీ మురికిలో ఎందుకు నివసిస్తారు? మూసీ సుందరీకరణ పేరుతో వారిని నిర్వాసితులను చేయడం ఎంతవరకు సమంజసం? లగచర్లలో ఫార్మాసిటీ అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. పాలకులు పక్కా రియల్‌ ఏజెంట్లలాగా మారితే, ఇక రక్షించేదెవరు? చెప్పిన పథకాల అమలుకు, ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్‌ నాయకులు హెచ్‌సియూ భూములను అమ్ముకుంటామంటే ఎలా!? హెచ్‌సియూ భూములు అమ్మకాన్ని ఎవ్వరైనా తీవ్రంగా తప్పు పట్టాల్సిందే. 400 ఎకరాలు అమ్మి.. రూ.30వేల కోట్లు రాబట్టుకోవాలని అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలవడం ద్వారా విలువైన భూములను కాపాడాలి. విద్యార్థులపైన ప్రభుత్వం అణచివేతకు పాల్పడడం తగదు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్పగా రాణిస్తున్నారు. దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉంది. హైదరాబాద్‌ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం భూముల వేలం తగదని ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి. భూములు ప్రభుత్వానివే అని చెబుతున్న సిఎం, మంత్రులు వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. వాటిని అన్యాక్రాంతం కాకుండా చూడాలి. యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్న తీరు మంచిది కాదు. బుల్డోజర్లను పెట్టి అక్కడున్న చెట్లను తొలగించి చదును చయడం సరికాదు. హైదరాబాద్‌కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్‌ ప్రాంతాలలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, దాని చుట్టూ ఉన్న పరిసరాలే. ఇప్పటికే కొండలు, గుట్టలను మాయం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే కొండలు గుట్టలు మాయం అయ్యాయి.ఇలా చేస్తూ పోతే భవిష్యత్తులో ఢిల్లీ మాదిరిగా ఊపిరి పీల్చుకోవడమే కష్టం అవుతుంది. పర్యావరణ నష్టం ప్రభావంపై అధ్యయనం చేయాలి. ఇప్పటికే హైదరాబాద్‌లో వేల ఎకరాలు మాయం అయ్యాయి. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని రేవంత్‌ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు కూడా సూచించాయి. పచ్చదనం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం సరికాదని పాలకులు గుర్తించాలి. నిధుల సవిూకరణ కోసం ఈ తరహా చర్యలు చేపట్టడం కూడా మంచిది కాదు. ముందుగా ఉచిత పథకాలను సవిూక్షించాలి. నష్టాలను తెచ్చే పథకాల్లో కోతలు విధించుకోవాలి. గొప్పలకు, అప్పులకు, భేషజాలకు పోకుండా ఉన్న ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటపడేయాలంటే అమ్మకాలు.. కాదు ఆస్తులు సృష్టించాలి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం భూముల అమ్మకం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళడం సరికాదు. ఇప్పటికే హైదరాబాద్‌లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది. పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్‌ జంగల్‌గా మారుతోంది. హైదరాబాద్‌ లో కబ్జాలను గుర్తించి ముందుగా వాటిని విముక్తం చేయాలి. చెరువులు కబ్జాలను గుర్తించాలి. అందుకు హైడ్రా చేస్తున్న కృషిని మరింతగా ప్రోత్సహించాలి. హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల కబ్జాలను గుర్తించి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. డబ్బులను వృథా చేసే ఓట్ల పథకాలకు పాతరేసినప్పుడే రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడగలదు. మోడీకైనా, బోడీకైనా, బాబుకైనా, రేవంత్ కైనా, మరెవ్వరికైనా ఇదే వర్తిస్తుంది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News