Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

సామాన్యుడి ఊసే లేని సంస్కరణల బడ్జెట్!?|EDITORIAL

దేశ ప్రజల ఆకలి బాధలు, జీవన ప్రమాణాల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను యథావిధిగా ప్రవేశపెట్టింది. రూ. 53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కాగితాల మీద భారీగా కనిపించినా, సామాన్య ప్రజల జీవితాల్లో ప్రతిఫలించేదేమిటి? గత తొమ్మిదేళ్లుగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఆస్కారమే లేకుండా పోతోంది.

ప్రస్తుతం దేశంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక మందగమనం. జాతీయ స్థాయిలో వినియోగం తగ్గిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఔషధాల వరకు ధరలు విపరీతంగా పెరిగాయి. కోవిడ్‌ అనంతరం, కొన్ని కీలక ఔషధాల ధరలు 200 నుంచి 500 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్‌ డేటా సూచిస్తోంది. ఫలితంగా వైద్యం చేయించుకోవడం దూరమైతే, కనీసం మందులు కొనుగోలు చేసే స్థితిలోనూ సామాన్యుడు లేకుండా పోయాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిజంగా ప్రగతిశీలమైతే, దాని ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించాలి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆశించిన మార్పు రావడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వైపు వలసలు పెరుగుతున్నాయి. సంపాదించిన ఆదాయం తిండికే సరిపోని పరిస్థితి విస్తరిస్తోంది. గ్రామీణ వినియోగం తగ్గిన తీరే ఇందుకు నిదర్శనం.

ఈ బడ్జెట్‌లో మరో ప్రధాన అంశం ఆర్థిక క్రమశిక్షణ. కార్పొరేట్లు, కోటీశ్వరులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినప్పుడు ఈ క్రమశిక్షణ గుర్తుకు రాలేదు. కానీ కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ వ్యయాలు పెంచాల్సిన సందర్భంలో మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముందుకు వచ్చింది. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. మహిళా సంక్షేమం కోసం ఉద్దేశించిన జెండర్ బడ్జెట్‌ నిధుల్లోనూ కోత పడటం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తోంది.

బడ్జెట్‌పై ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చే నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయాల పెరుగుదల తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో ఆదాయ పన్ను, జీఎస్టీ మార్పులతో కొంతమేర ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఈసారి వాటి జోలికి వెళ్లకపోవడం మధ్యతరగతిపై భారాన్ని మరింత పెంచింది. పరోక్ష మినహాయింపులు ప్రకటించినా, అవి ప్రజల జేబుల్లోకి డబ్బు తెచ్చే స్థాయిలో ఉంటాయా? అన్నది అనుమానమే.

అయితే, బడ్జెట్‌లో కొన్ని ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే 17 కీలక ఔషధాలపై దిగుమతి సుంకాల మినహాయింపు, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మరో 7 ఔషధాలపై సుంకాల తగ్గింపు నిర్ణయం ఊరట కలిగించే అంశం. ఇవి ఔషధాల ధరలను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించే అవకాశముంది. కానీ ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రత్యామ్నాయం కాదన్నది గుర్తించాలి.

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’, ‘మూడు కర్తవ్యాలు’ గత తొమ్మిదేళ్లుగా విన్న పదాలే. కానీ, వాటి ఫలితాలు గ్రామాల్లో, పేదల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఇంకా కోట్లాది మందికి ఉచిత బియ్యం అందించాల్సిన పరిస్థితి ఉంటే, దేశ ఆర్థిక బలం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిన అంశమే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోకుండా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా భారత పురోగతి కాగితాలకే పరిమితం అవుతుంది. ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’ వేగం పెరిగిందని చెప్పడం కంటే, ఆ ఎక్స్ ప్రెస్ ఎవరిని తీసుకెళ్తోంది? ఎవరిని వదిలేస్తోంది? అన్నదే తేలాల్సిన ప్రశ్న? మరి సమాధానం మన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా?

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News