Friday, April 10, 2026
26.7 C
Hyderabad

ఇక చాలు!?|STOP

ISSUES| వి‘వాదా’లను వదిలేయండి
PANCHAYAT| పంచాయితీలు పక్కన పెట్టండి
పంచాయతీలపై దృష్టి పెట్టండి
మీ SERVICES| సేవలు పార్టీకి అవసరం
PARTY| పార్టీ కోసమే పని చేయండి
LOCAL| ‘స్థానికం’గా సత్తా చాటాలి
KONDA| కొండా దంపతులకు MEENAKSHI| మీనాక్షి హితవు
పార్టీకి కట్టుబడి పని చేస్తాం: మీనాక్షికి కొండాల సంజాయిషీ
వివరణతో కూడిన నివేదిక అందజేత
నేనే తప్పూ చేయలేదు : MINISTER| మంత్రి కొండా సురేఖ| KONDA SUREKHA
కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు : కొండా మురళి| KONDA MURALI
SUSMITHA| సుస్మిత ఆలోచనలు వంశపారంపర్యం కావచ్చు అధిష్టానం ఆదేశాల మేరకే ఎన్నికల్లో పోటీ
నేనెవరికీ భయడనంటూ MEDIA| మీడియాతో వ్యాఖ్యలు
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

మొత్తానికి కాంగ్రెస్ లో కొండా దంపతుల వివాదాలకు తెరపడిందా? ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక పుణ్యమాని రాజీ కుదరిందా? 5వ తేదీతో ముడిపడిన సమస్య 3వ తేదీతోనే ముగిసిందా? నేను మానార్క్ ని, నేనెవరి మాటా వినను. నన్నెవరూ మోసం చేయలేరనే కొండా మురళి పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ మాట విన్నారా? కొండా దంపతులతోపాటు, వారి ప్రత్యర్థుల మధ్య సర్దుబాటు జరిగిందా? ఏం జరిగిందో కానీ, కొండా దంపతులకు భవిష్యత్ దర్శనం జరిగినట్లుంది. మీనాక్షి నటరాజన్ గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. ఇక చాలు! వివాదాలను వదిలేయండి. పార్టీ కోసం పని చేయండి. మిగతా సమస్యలు నాకు వదిలేయండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరంగా మాట్లాడొద్దు. పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు. మీరు ఇరకాటంలో పడొద్దు. పని చేస్తూ పోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పార్టీకి కట్టుబడి పని చేస్తామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకు వస్తామని కొండా దంపతులు మీనాక్షికి మాట ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వివరణతో కూడిన ఫిర్యాదును సంజాయిషీ రూపంలో ఇచ్చి సమస్యను సద్దుమణిగే విధంగా చూసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే బయటకు వచ్చాక యథావిధిగా కొండా దంపతులు తగ్గేదేలే? అన్నట్లుగా కొద్దిగా తగ్గి మీడియాతో మాట్లాడారు. తమ బిడ్డ సుస్మిత పోస్టును ఆమె ఇష్టానికి వదిలేసి, ఆమె తమ వంశపారంపర్యంగా ఆలోచిస్తున్నట్లుందని ముక్తాయించారు.

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
క్రమశిక్షణ కమిటీ పరిధిలోనే తానున్నా తనను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. పనిచేసే వాళ్ళపైనే రాళ్లు రువ్వుతారని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. తన విషయంలో 44 ఏళ్ళుగా ఇది కొనసాగుతూనే ఉన్నదని తెలిపారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని వెల్లడించారు. తన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గ్రూప్‌ రాజకీయ పరిణామాలపై వివరించారు. తాజా పరిణామాలపై 16 పేజీల లేఖ అందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను, పార్టీలో తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఒకరి గురించి నేను కామెంట్‌ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా’నని మరోసారి ఉద్ఘాటించారు. ‘నేను పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. నేను ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్‌ వచ్చేలా చూస్తాం. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌తో చెప్పా. మా సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలని కోరాం. పార్టీకీ మీ సేవలు అవసరమని మీనాక్షీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం. రేవంత్‌రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడాలి. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అండగా నిలుస్తా.’ అని మురళి చెప్పారు.

నేనే తప్పూ చేయలేదు : కొండా సురేఖ
తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాని చెప్పారు. తన శాఖలో ఉన్న ఫైల్స్‌ అన్నీ పరిశీలించుకోవచ్చని, మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదని వెల్లడించారు.

సుస్మిత ఆలోచన వంశపారంపర్యం కావచ్చు
తన కూతురు సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖల రక్తమని, ఆమెకు తమ ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సురేఖ అన్నారు. ఆమె రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని చెప్పారు. భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉందని, ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని ఆమె చెప్పారు.

మొత్తానికి మీనాక్షి నటరాజన్ జోక్యంతో కొండా దంపతులు, పార్టీ నేతల మధ్య నెలకొన్న సమస్య సద్దుమణిగింది. తాత్కాలికంగానైనా సర్దుబాటు జరిగింది. ఇరు వర్గాలను హెచ్చరించి దారికి తెచ్చింది. అయితే, పార్టీ హెచ్చరికలతో ఇరు వర్గాలు గప్ చుప్ గా ఎంత కాలం ఉంటాయన్నది వేచి చూడాలి.
…..

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News