Monday, August 17, 2026
25.5 C
Hyderabad

Incognito|అజ్ఞాతంలోంచి… అజ్ఞాతంలోకి…!?|MAOIST|POLICE

అజ్ఞాతం వీడినా, అంతు చిక్కని ఆచూకీ
జనజీవన స్రవంతిలో కలిసినా జనంలోకి రాలే
వారం గడిచినా ఊరు, వాడ, కడప తొక్కలే
కనిపించినా, కనిపించకుండా పోయింది
కొత్త జీవితమా? పాత నరకమా?
GOVERNMENT|సర్కార్ గోప్యతా? POLICE|పోలీసుల భద్రతా?
శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా?
ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాలి
స్పష్టత కోసం ఎదురు చూస్తున్న రక్తసంబంధీకులు
మాజీ మావోయిస్టును చూపించండి: గ్రామస్థులు
పోరుబాట వీడి, జనంబాట పట్టిన POTHULA PADMA|పోతుల పద్మ ఎక్కడ?

45 ఏళ్ళ అజ్ఞాతవాసం ఆమెకు తిరిగి అజ్ఞాతవాసాన్నే మిగిల్చింది. అలుపెరుగని పోరాటంలో కుంగిపోకుండా, ఆమె లొంగిపోయినా… వన జీవనాన్ని వదిలి, జన జీవన స్రవంతిలో కలిసినా, ఆమె ఇంకా జన జీవనంలోకే రాలే! ఆమె లొంగిపోయి వారం గడిచినా… ఊరు, వాడ, కడప తొక్కలే!! ఇంత కాలంగా అగుపించని ఆమె కనిపించినా, ఎక్కడా కనిపించకుండా పోయింది. సమసమాజం కోసం, ఉరిమే ఉప్పెనైన ఆమె కోసం, ఊరుకు ఊరే ఎదురుచూస్తున్నది. రక్త సంబంధీకులు, బంధువులు ఆమె రాక కోసం నిలువెల్లా కనులై కాచుక్కూచుకున్నారు. కొత్త జీవితమా? పాత నరకమా? ఇది సర్కార్ గోప్యతా? పోలీసుల భద్రతా? ఈ అజ్ఞాతంలోంచి… అజ్ఞాతం దేనికి సంకేతం? శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా? ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన సొంతూరు, జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు సంధిస్తోంది. తమ అనుమానాలను పటాపంచలు చేయాలని ఊరు, వాడా, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బరువెక్కిన గుండెలతో డిమాండ్ చేస్తున్నారు

గద్వాల, సెప్టెంబర్ 18 (అడుగు న్యూస్):
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు గ్రామానికి చెందిన పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన ఇటీవల అజ్ఞాతవాసం వీడి తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాల క్రితం అడవిబాట పట్టిన పద్మ, మావోయిస్టు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల రివార్డుతో పాటు, వందలాది కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, 2025న డీజీపీ ఎదుట ఆమె అధికారికంగా లొంగిపోయినట్టు ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

అయితే లొంగిపోయి వారం రోజులు దాటినా పద్మ ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లభించకపోవడం కుటుంబ సభ్యుల్లో, గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆమె లొంగిపోయిన వెంటనే స్వగ్రామానికి వస్తారని కుటుంబ సభ్యులు భావించినా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని ప్రజలు కూడా పద్మ మళ్లీ తమ ఊరికే వస్తారని భావించి ఆనందపడ్డారు. టీవీ చానల్స్, పత్రికలలో లొంగిపోయిన వార్తలు రావడంతో సంతోషించిన ఆమె బంధువులు, ఇప్పుడు ఆచూకీ తెలియక ఆవేదన చెందుతున్నారు.

45 ఏళ్ల క్రితం పద్మ గ్రామం విడిచి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఏదో ఒక రోజు తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు లొంగిపోయిందనే వార్త విన్నప్పుడు వారు ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వారం రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పద్మను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో తహసీల్దార్ రాజు స్వయంగా పెంచికలపాడు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామ పెద్దలు, పద్మ సోదరులతో సమావేశమై వివరాలు సేకరించారు. పంచానామా కూడా నిర్వహించారు. వారి వెంట వీఏఓ రంగన్న, సిబ్బంది గోపాల్, పరశురాములు, వడ్ల భీమప్ప, జంగిటి సుంకన్న, దెయ్యం చౌడప్ప, వుల్లి గోవిందు, గాజుల గంగప్ప, నర్సింహులు, గోవిందు తదితరులు వున్నారు. ఈ సందర్భంగా ముక్త కంఠంతో పద్మను గ్రామానికి తీసుకురావాలని అధికారులను కోరారు.
పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన లొంగుబాటు కీలకాంశం. ఇప్పుడామె భవిష్యత్తు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై, పోలీసుల చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం పునరావాసం పేరుతో లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని కల్పిస్తుందని ప్రకటించినా, పద్మ లొంగుబాటు తర్వాత ఆమె ఆచూకీ రహస్యంగా ఉంచడంపై చర్చలు సాగుతున్నాయి. లొంగిపోయిన వారిని భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా ఉంచడం సాధారణమే అయినప్పటికీ, ఆమె కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అసంతృప్తికి, మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.

గ్రామస్తులు మాట్లాడుతూ, ‘నాలుగు దశాబ్దాలుగా ఆమె కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు లొంగిపోయింది అంటే మళ్లీ మా ఊరికి వస్తుందని భావించాం. కానీ ఎక్కడ ఉందన్న విషయం తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. కనీసం అధికారుల ద్వారా అయినా ఆమెను ఒకసారి కలిసే అవకాశం కల్పించాల’ని డిమాండ్ చేస్తున్నారు.

లొంగుబాటు తర్వాత పద్మ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్లకు పైగా అడవిలో గడిపిన ఒక మావోయిస్టు నేత లొంగిపోవడం ఒక వైపు శాంతి ప్రక్రియకు అనుకూల పరిణామంగా భావిస్తుండగా, మరో వైపు ఆమెను స్వగ్రామానికి రానివ్వకపోవడం తిరిగి ఆశాంతికి దారి తీస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాల వల్లనే ఈ చర్యలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు అంటున్నప్పటికీ, పద్మ కుటుంబం మాత్రం తమ కుటుంబసభ్యురాలిని వెంటనే తమకు అప్పగించాలని పట్టుబడుతోంది.

మొత్తం మీద పోతుల పద్మ లొంగిపోవడం రాష్ట్రంలో పెద్ద సానుకూల పరిణామంగా నిలిచినప్పటికీ, ఆమె ఆచూకీపై అధికారుల గోప్యత ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆవేదనగా, గ్రామస్తులకు ఆందోళనగా మారింది. త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనివ్వాలని, ఆమెను స్వగ్రామంలో కుటుంబ సభ్యులను కలిసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 16 నుండి ఆగస్టు 22 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు....

గీ మిఠాయి మస్తు పిరం. కిలోకి 51 యేలే!|ADUGU TRENDS

ధర అదిరింది కదా! యే తియ్ మిఠాయి కి గంత ధరే0ది? అనుకుంటా0డ్లా? ఔ మల్ల నిజంగానే గా మిఠాయి కి గంత ధర ఎందుకంటే గా మిఠాయిల బంగారం కలిపిండ్రు. గది...

స్వాతంత్ర్యం, విద్వేషం విధ్వంసం, విషాదం!?|EDITORIAL

స్వాతంత్య్రం మనకు గొప్ప వరం. విభజన దాని వెంటే వచ్చిన మహా విషాదం! ఆ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసుకోవడం ఏ పార్టీనీ అవమానించడానికి కాదు. భవిష్యత్తులో మతం, ప్రాంతం, భాష పేరుతో సమాజం...

ఆగస్టు 15, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం- శుక్లపక్షం భారత స్వాతంత్ర్య దినోత్సవం తిధి శు.తదియ రాత్రి 07.19 వరకు ఉపరి చవితి నక్షత్రం పుబ్బ ఉదయం 06.20 వరకు ఉపరి ఉత్తర యోగం శివ ఉదయం 10.40 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.49...

గిట్ల కూడా బోనం!?|ADUGU TRENDS

జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది. ఇగో గీ...

పార్లమెంటుపై ప్రశ్నలకు బదులేవి!?|EDITORIAL

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి...

ఆగస్టు 14, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం తిధి శు.విదియ రాత్రి 08.20 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ ఉదయం 06.50 వరకు ఉపరి పుబ్బ యోగం పరిఘ మధ్యాహ్నం 12.36 వరకు ఉపరి శివ కరణం బాలవ ఉదయం...

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News