Monday, August 3, 2026
31.5 C
Hyderabad

రాజకీయ అవినీతిని అరికట్టలేమా!?|EDITORIAL

దేశంలో, రాష్ట్రాల్లో పేరుకుపోతున్న అవినీతిని అరికట్టడానికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. అలాగే రాజకీయ అవినీతిని అరికట్టడానికి లోక్ పాల్, లోకాయుక్త వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అదికార పార్టీలకు కీలు బొమ్మల్లా పై నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్న విమర్శలున్నప్పటికీ ఎంతో కొంత మేర అవి పని చేస్తున్నాయి. కానీ రాజకీయ అవినీతిని నిర్మూలించడం సంగతి అటుంచి, నియంత్రించే పనిని కూడా లోక్ పాల్, లోకాయుక్త సంస్థలు చేయలేకపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తుంటాయి. చివరకు అవి కూడా రాజకీయాధికారం చెప్పుచేతుల్లోనే బందీ అవుతుండటం అత్యంత విచారం, విషాదం.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అవినీతి నిరోధక సంస్థలు విడుదల చేసే నివేదికల ప్రకారం, మన దేశంలో అవినీతి స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి, 2024లో ప్రపంచ అవినీతి అవగాహన సూచీ (సీపీఐ) ప్రకారం భారత్ 180 దేశాలలో 96వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీసకుంటే దేశంలో వరసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణలున్నాయి. ఏపీ 13వ స్థానంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అవినీతిని పరిశీలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికంగా అవినీతి జరిగిందని తేలింది. 67శాతం మంది లంచాలిచ్చే పనులు చేసుకున్నామని, 27శాతం మంది పలుమార్లు లంచాలిచ్చామని సర్వేలో చెప్పారు. అంటే 94శాతం మందికి లంచాలతోనే పనులయ్యాయన్నమాట! ఇందులో అధికారుల అవినీతికంటే రాజకీయ అవినీతిదే అగ్రస్థానం అని వేరే చెప్పక్కరలేదు.

అవినీతి నిర్మూలనకు దేశంలో అనేక చట్టాలున్నాయి. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు, సమాచార హక్కు చట్లం, ప్రజా వేగుల చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం వంటివెన్నో ఉన్నాయి. కానీ అవినీతి నిర్మూలన లేదా నియంత్రణ మాత్రం జరగకపోగా, పెరుగుతూ ఉన్నది. పాలకుల్లో ప్రధానంగా ఆర్థిక నియంత్రణ లేకుండా పోతోంది. దుబారా ఖార్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేతలు తమ రక్షణకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జీత భత్యాలు కూడా విపరీతమే. మరోవైపు బంధుప్రీతి, అవినీతి, లెక్కకు మించిన ఆదాయాలు, ఎన్నికల్లో ఖర్చు చేయడం, తిరిగి సంపాదించుకునే పనిలో ఉండటం వంటివెన్నో కారణాలున్నాయి. ఒక్కసారి అధికారం అందితే చాలు తరతరాలు బతికేంతగా సంపాదించడమే పనిగా రాజకీయ నేతలు పని చేస్తున్నారు.

ఇక ఓట్ల కోసం అలవిగాని హామీలివ్వడం, వాటిని అమలు చేయడం ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. వాటిని అమలు చేసే క్రమంలో మళ్ళీ అవినీతే చోటు చేసుకుటున్నది. అవినీతి చుట్టూ రాజకీయం, రాజకీయం చుట్టూతా అవినీతే పెనవేసుకుని కనిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబరా చేయడం, దుర్వినియోగం చేయడం మాములైపోయింది. అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడం, నియంతృత్వంగా ప్రజాధనాన్ని మంచినీళ్ల కంటే అధ్వాన్నంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. ఒక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలకు లెక్కలేకుండా పోతోంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులన్నీ, అధికారం పోయాక వెలుగు చూస్తున్నాయి. కాకపోతే, వారికి తగిన శిక్షలే పడటం లేదు. రాజకీయ అవినీతి కేసులేవీ నిలవడం లేదు. దొందూ దొందే అన్నట్లు, తోడు తొంగల్లాగా అధికార, విపక్షాలు ఒకరినొకరు సహకరించుకుంటూ, కాపాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు.

రాజకీయ అవినీతిని పూర్తిగా అరికట్టడం కష్టమైనప్పటికీ, ఎంతో కొంత తగ్గించడానికి, నియంత్రించడానికి చేసిన చట్టాలే వారికి చుట్టాలైపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని పద్ధతుల్లో అవినీతిని అరికట్ట వచ్చు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచాలి. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాలి. అవినీతి నిరోధక చట్టాలను కఠినంగా రూపొందించి అమలు చేయాలి. అవినీతిపరులకు కఠినమైన శిక్షలు పడితే మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటారు. లోక్‌పాల్, లోకాయుక్త వంటివ స్వతంత్ర సంస్థలను సమర్థవంతంగా పనిచేయనివ్వాలి. అవినీతి నిర్మూలనలో ప్రజలు, పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యాన్ని పెంచాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్, ఆన్‌లైన్ చేయడం వల్ల కూడా అవినీతిని అరికట్టవచ్చు. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా నైతిక విలువలను పెంపొందించాలి.

అయితే, తాజా గణాంకాలింకా అందుబాటులోకి రానప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వాలను అభినందించడం కాదు కానీ, గత ప్రభుత్వాల హయాంలో అవినీతి అధికంగా జరిగినట్లుగా సర్వే సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి గత, ప్రస్తుత అవినీతికి ఆ కూటమి తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తే, 2023 నవంబర్ వరకు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో 2014లో చంద్రబాబు, 2019లో జగన్, తాజాగా మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కొద్ది అటు ఇటుగా మారుతున్నప్పటికీ, దాదాపుగా రెండు కూటమిలు, రెండు మూడూ పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ప్రభుత్వ, రాజకీయ అవినీతికి ఆ పార్టీలు, వాటిని నడుపుతున్న నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అంటే ఆ పార్టీలు లేదా ఆ పార్టీలను నడిపే నాయకులే అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాలను అవినీతి మయం చేశారు. చేస్తున్నారు. అంతేగాక దేశాన్ని, రాష్ట్రాలను దోచుకున్నారనే నిజం మింగుపడటం కష్టమే. అయితే ఒకవైపు అవినీతి, మరోవైపు దోపిడీ, ఇంకోవైపు అప్పులు చేసి దివాళా తీయించడం లాంటి అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కంటే కూడా అటు ప్రపంచం ముందు దేశాన్ని, దేశం ముందు రాష్ట్రాల పరువును అవినీతి మయంగా తీసేసిన మన పార్టీలు, మన నాయకులను బోనెక్కించాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకోవాలి. అంతకంటే ముందు వారికి ప్రజాక్షేత్రంలోనేగాక, చట్ట పరిధిలో కూడా శిక్షలు పడేలా చేయాలి. అందుకు తగిన చట్టాలతోపాటు, అవినీతి నిర్మూలనకు నడుం కట్టే నవ యువ నాయకత్వం రావాల్సి ఉంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News