Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

జీఎస్టీకి సహేతుక పద్ధతి కావాలి!|EDITORIAL

ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో ఇంతకాలంగా జరిగిన జీఎస్టీ దోపిడీ కట్టడి అయినట్లేనా? పన్ను విధించిన ప్రభుత్వమే పదేళ్ళ తర్వాత ఆ పన్నును సవరించడం సంతోషించాల్సిందే. కానీ, ఇప్పటిదాకా ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన పన్నులకు ఎవరు సమాధానం చెబుతారు? ప్రజలను పీల్చి పిప్పి చేసి, లబోదిబో మంటున్నా వినకుండా గత దశాబ్ద కాలంలో లక్షల కోట్లు గుంజుకున్నారు. ఇప్పుడు జీఎస్టీ హేతుబద్దీకరించి, కొంతమేర తగ్గించి జబ్బలు చరుచుకుంటున్నారు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పుడే హేతుబద్దత గురించి అన్ని వర్గాల ప్రజలు నాయకులు అనేక వినతులు చేసినా పెడచెవిన పెట్టారు. అధికారం ఉంది కదాని ఇష్టానుసారం పన్నులు పెంచారు. ముక్కుపిండి వసూలు చేశారు. ఆర్థికవృద్ధి మందగించడం, గృహ రుణాలు పేరుకుపోవడం, పొదుపు క్షీణించడం, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, ట్రంప్‌ టారిఫ్‌లే జీఎస్టీ రేట్ల మార్పునకు కారణంగా కనిపిస్తున్నది. దేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి పన్నుల విధానం తోడ్పడాలే కానీ, గుదిబండ కాకూడదు.
నిజానికి పన్నులు హేతుబద్దంగా ఉండాలి. భారతదేశం లో పేద మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వారి జీవితాలు, జీత భత్యాలు అంతంత మాత్రమే. వీటిని గుర్తించకుండా 18శాతం, 28శాతం వరకు జీఎస్టీ పేరుతో వసూళ్లు చేశారు. ఇప్పుడేమో సంస్కరణలు ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ‘మా ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్‌ అంగీకారం తెలిపింది. ఈ విషయం ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని అనడం నయ వంచనే. కరోనా సమయంలో ప్రజలు హాహాకారాలు చేసినా జీఎస్టీ తగ్గించాలని గుర్తుకు రాలేదు. ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం, వాటి అమలు కోసం పన్నులు వసూలుచేసి పందేరం చేయడమేనా పాలన అంటే. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా కట్టగలిగేలా పన్నుల విధానం ఉండాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సహా, నల్లడబ్బు రూపంలో తరలకుండా సరళీకృత పన్ను విధానాలు ఉండాలి.
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, జీఎస్టీ మండలి ఆమోదించింది. చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
దేశంలో ప్రతిసారి దసరా, దీపావళికి ముందే పండుగ వస్తోంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తాయని అంటున్నారు. మనదేశంలో 5శాతం గరిష్ట పన్నుల విధానం సరిపోతుంది. ప్రతి ఒక్కరూ పన్నులు కట్టేలాగా, అవి దేశ అభివృద్దికి వినియోగించేలా ఉండాలి. ప్రస్తుత సరళీకరణతో పాలు, పనీర్‌, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తాయని అంటున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులు ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతోపాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతమున్న 12శాతం పన్నును పూర్తిగా తొలగించారు.
కరోనా తరవాత ఔషధాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్‌ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్‌లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న నిర్మలా సీతారామన్‌ చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు.
అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి, పండగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది.
ఔషధరంగాన్ని కట్టడి చేయాలి. ధరలను పెంచుతున్న ఫార్మా కంపెనీలకు ముకుతాడు వేయాలి. నిర్మాణ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అమెరికాను సుంకాలపై తిడుతూ మనమే మన ప్రజలపై అత్యధిక సుంకాలను విధించుకోవడం సరికాదు. విమానయాన రంగం ప్రజలకు మరింత చేరువ కావాలి. ప్రస్తుత విమాన టిక్కెట్‌ ధరలను సమీక్షించాలి. ఇందుకు ముందుగా రాజకీయంగా ఖర్చులు తగ్గించు కోవాలి. జీత భత్యాలను తగ్గించాలి. రాజకీయ నాయకుల పెన్షన్లు ఎత్తేయాలి. రాజకీయ ఖర్చులు, అవినీతి కారణంగా దేశం భ్రష్టుపడుతున్న వేళ సంస్కరణలు ఈ దిశగా సాగాలి. రాష్ట్రాల్లో ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటించడం, జీఎస్టీ డబ్బుల కోసం కేంద్రం వద్ద యాచించడం రాష్ట్రాలు మానుకోవాలి. ప్రజలను పీడించి పన్నులు వేయడం సరి కాదని గుర్తించాలి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News