Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

VILLAGE|గ్రామాలకు గట్టి మేలు తలపెట్టాలి!

గ్రామాలు అభివృద్ధి చెందితేనే, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ అన్నారు. దాన్నే గ్రామ స్వరాజ్యమని కూడా అంటారు. గ్రామాలు స్వయం సమ్రుద్ధిగా ఎదిగితేనే దేశం కూడా పురోగతి సాధిస్తుంది. మన ప్రజాస్వామిక వ్యవస్థలో దేశంలో మూడంచెలు, స్థానిక సంస్థల్లోనూ మూడంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం, గ్రామం ఒక యూనిట్ అయితే, స్థానిక సంస్థల్లో జిల్లా, మండలం, గ్రామం ఒక యూనిట్ గా పరిపాలన సాగుతోంది. అయితే గ్రామాలను పటిష్ట పరచడంలో ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్రామాలను గాలికి వదిలేసి, వాటి పరిపాలన, అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయి. పరిపాలన కంటే కూడా రాజకీయాధిపత్యం పరమావధిగా పార్టీలు, ప్రభుత్వాలు పని చేయడం ఆక్షేపణీయం.

స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వాలు కాలం గడిపేస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరుపతారో ఎవరికీ తెలియని అయోమయం నెలకొన్నది. తమకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఎన్నిక మన్నిక అన్నట్లుగా ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలను విస్మరిస్తున్నారు. గ్రామాల్లో ఆధిపత్యం తమ చేతుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామాలు ఆర్థికంగా బలపడడం లేదు. పెత్తనం తమ గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్‌లను డవ్మిూలుగా మర్చేస్తున్నారు.

ఎపీలో గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్‌లకు సమాంతరంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి సర్పంచ్ ల మీద పెత్తనం చెలాయించే కమిటీలుగా మారాయి. రాజీవ్‌ గాంధీ స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం చేసిన రాజ్యాంగ సవరణలను తుంగలో తొక్కుతున్నారు. గ్రామీణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉన్న గ్రామలను అభివృద్ధి పరచి, సర్పంచ్‌లను బాధ్యులను చేసేలా విధి విధానాలు ఉండటం లేదు. అన్నీ సిఎంల పర్యవేక్షణలో సచివాలయం నుంచే జరగడం వల్ల గ్రామాలు వట్టిపోతున్నాయి. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పక్కాగా ప్రణాళికలు జరగడం లేదు. నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచన చేసినా, రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం, సర్పంచ్ లు పదవుల్లో ఉంటేనే కేంద్ర నిధులన్న నిబంధనలు అనుకూలించకపోవడంతో గత ఏడాదికిపైగా గ్రామాలు ఆగమైపోతున్నాయి.

గ్రామాలను పటిష్ట పాలనా కేంద్రలుగా తీర్చి దిద్దాల్సి ఉంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా ఎక్కడికక్కడ పరిపాలన సజావుగా సాగి, స్థానికావసరాలకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే, ఇవ్వాళ దేశం అద్భుత ప్రగతి పథంలో ఉండేది. సిఎం స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా నిబంధనలను పటిష్టం చేయాలి. ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్‌లను, వార్డు సభ్యులను బాధ్యులను చేస్తే, ఆయా పథకాలు ఆశించన ఫలితాలిచ్చేవి.

ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యం అత్యంత చెత్తగా అమలవుతున్నది. పారిశుధ్యం పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సామాజిక బాధ్యతగా చేయాలి. ఇప్పటికీ ఆరుబయట మల, మూత్ర విసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల కు 12వేల ఆర్థిక సాయం అందిస్తున్నా గ్రామాల్లో ప్రజలు వెంటనే మరుగదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించి గ్రామకమిటీల ద్వారా అమలు చేయాల్సి ఉంది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది.

ఇక ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వమే చేస్తుందన్న దీమాలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా మహా ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల దాకా, ఏదైనా సరే, తమ కనుసన్నల్లోనే జరగాలని, అంతా తమ క్రెడిట్ గా సాగాలని చూస్తున్నాయి. పారిశుధ్యం లోపం, పరిసరాల అపరిశుభ్రత కారణంగానే అత్యధిక వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. అతిసార, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. మురుగు కాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. సర్పంచ్‌లు ఉన్నా లేకున్నా ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఇలాంటి సమస్యలనే ఇప్పుడు అధ్యయనం చేయాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. ఓటుబ్యాంక్‌ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. సర్పంచ్‌లను, పంచాయితీల పాలకవర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వారిని ప్రభుత్వ పథకాల అమలుకు బాధ్యులను చేసినప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతాయి. సర్పంచ్‌లకు విధులు, నిధులు అప్పగించాలి. అప్పుడే గ్రామాలు బలపడతాయి. సమీప భవిష్యత్తులోనే స్థానిక ఎన్నికలున్నందున ఈ లోగా ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. వట్టి మాటలు కట్టి పెట్టి గ్రామాలకు గట్టి మేలు చేయాలి.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News