Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

VILLAGE|గ్రామాలకు గట్టి మేలు తలపెట్టాలి!

గ్రామాలు అభివృద్ధి చెందితేనే, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ అన్నారు. దాన్నే గ్రామ స్వరాజ్యమని కూడా అంటారు. గ్రామాలు స్వయం సమ్రుద్ధిగా ఎదిగితేనే దేశం కూడా పురోగతి సాధిస్తుంది. మన ప్రజాస్వామిక వ్యవస్థలో దేశంలో మూడంచెలు, స్థానిక సంస్థల్లోనూ మూడంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం, గ్రామం ఒక యూనిట్ అయితే, స్థానిక సంస్థల్లో జిల్లా, మండలం, గ్రామం ఒక యూనిట్ గా పరిపాలన సాగుతోంది. అయితే గ్రామాలను పటిష్ట పరచడంలో ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్రామాలను గాలికి వదిలేసి, వాటి పరిపాలన, అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయి. పరిపాలన కంటే కూడా రాజకీయాధిపత్యం పరమావధిగా పార్టీలు, ప్రభుత్వాలు పని చేయడం ఆక్షేపణీయం.

స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వాలు కాలం గడిపేస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరుపతారో ఎవరికీ తెలియని అయోమయం నెలకొన్నది. తమకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఎన్నిక మన్నిక అన్నట్లుగా ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలను విస్మరిస్తున్నారు. గ్రామాల్లో ఆధిపత్యం తమ చేతుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామాలు ఆర్థికంగా బలపడడం లేదు. పెత్తనం తమ గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్‌లను డవ్మిూలుగా మర్చేస్తున్నారు.

ఎపీలో గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్‌లకు సమాంతరంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి సర్పంచ్ ల మీద పెత్తనం చెలాయించే కమిటీలుగా మారాయి. రాజీవ్‌ గాంధీ స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం చేసిన రాజ్యాంగ సవరణలను తుంగలో తొక్కుతున్నారు. గ్రామీణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉన్న గ్రామలను అభివృద్ధి పరచి, సర్పంచ్‌లను బాధ్యులను చేసేలా విధి విధానాలు ఉండటం లేదు. అన్నీ సిఎంల పర్యవేక్షణలో సచివాలయం నుంచే జరగడం వల్ల గ్రామాలు వట్టిపోతున్నాయి. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పక్కాగా ప్రణాళికలు జరగడం లేదు. నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచన చేసినా, రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం, సర్పంచ్ లు పదవుల్లో ఉంటేనే కేంద్ర నిధులన్న నిబంధనలు అనుకూలించకపోవడంతో గత ఏడాదికిపైగా గ్రామాలు ఆగమైపోతున్నాయి.

గ్రామాలను పటిష్ట పాలనా కేంద్రలుగా తీర్చి దిద్దాల్సి ఉంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా ఎక్కడికక్కడ పరిపాలన సజావుగా సాగి, స్థానికావసరాలకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే, ఇవ్వాళ దేశం అద్భుత ప్రగతి పథంలో ఉండేది. సిఎం స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా నిబంధనలను పటిష్టం చేయాలి. ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్‌లను, వార్డు సభ్యులను బాధ్యులను చేస్తే, ఆయా పథకాలు ఆశించన ఫలితాలిచ్చేవి.

ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యం అత్యంత చెత్తగా అమలవుతున్నది. పారిశుధ్యం పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సామాజిక బాధ్యతగా చేయాలి. ఇప్పటికీ ఆరుబయట మల, మూత్ర విసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల కు 12వేల ఆర్థిక సాయం అందిస్తున్నా గ్రామాల్లో ప్రజలు వెంటనే మరుగదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించి గ్రామకమిటీల ద్వారా అమలు చేయాల్సి ఉంది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది.

ఇక ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వమే చేస్తుందన్న దీమాలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా మహా ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల దాకా, ఏదైనా సరే, తమ కనుసన్నల్లోనే జరగాలని, అంతా తమ క్రెడిట్ గా సాగాలని చూస్తున్నాయి. పారిశుధ్యం లోపం, పరిసరాల అపరిశుభ్రత కారణంగానే అత్యధిక వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. అతిసార, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. మురుగు కాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. సర్పంచ్‌లు ఉన్నా లేకున్నా ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఇలాంటి సమస్యలనే ఇప్పుడు అధ్యయనం చేయాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. ఓటుబ్యాంక్‌ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. సర్పంచ్‌లను, పంచాయితీల పాలకవర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వారిని ప్రభుత్వ పథకాల అమలుకు బాధ్యులను చేసినప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతాయి. సర్పంచ్‌లకు విధులు, నిధులు అప్పగించాలి. అప్పుడే గ్రామాలు బలపడతాయి. సమీప భవిష్యత్తులోనే స్థానిక ఎన్నికలున్నందున ఈ లోగా ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. వట్టి మాటలు కట్టి పెట్టి గ్రామాలకు గట్టి మేలు చేయాలి.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News