Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

చీప్… లిక్కర్ కేసు?!|EDITORIAL

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి. అయితే, విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో ఆ వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం, పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం వంటి వాటికి బాధ్యులెవరు?

అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టుకు, ఇంకో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలకు భారీ ఊరట లభించింది. తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదైన సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, నిరూపించలేకపోయారని, ఈ కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎన్నైనా మోపొచ్చు కానీ, వాటిని నిరూపించే సాక్ష్యాధారాలే ముఖ్యం.

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థలుగా పేరుగాంచాయి. వీటి చర్యలు చట్టబద్ధత, పారదర్శకత, వాస్తవాధారాలపై నిలబడాలి. అయితే ఈ కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆ రెండు సంస్థలు జవాబివ్వలేకపోయాయి. రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఇప్పటి దాకా వస్తున్న ఆరోపణలు నిజమనే విధంగానే దర్యాప్తు సంస్థల తీరు ఉంది. వాటిని బలపరుస్తున్నట్లుగానే కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా పనిచేయాలన్నది మూల సూత్రం. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యే ప్రతి సందర్భంలో “రాజకీయ ప్రతీకారం” అన్న ఆరోపణలు వినిపించడం కూడా సాధారణమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈ విమర్శలు కొత్తవేమీ కావు.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు, పంజాబ్ లో సాధించిన విజయం రాజకీయ సమీకరణాలను మార్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే లిక్కర్ పాలసీ కేసు వెలుగులోకి రావడం, అరెస్టులు జరగడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి.
అయితే, న్యాయ ప్రక్రియలో అరెస్టు అనేది శిక్ష కాదు. అది విచారణలో భాగం మాత్రమే! కానీ విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం దెబ్బతినడం సహజం. అనివార్యం. పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం తిరిగి పూడ్చుకోవడం కష్టం. ఈ మొత్తానికి బాధ్యులెవరు?

మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని పూర్తిగా నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టును సవాల్ చేస్తూ ఇంకో పై కోర్టుకు, ఇలా సుప్రీం కోర్టు దాకా అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.

అయితే, ఈ కేసు పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తున్నాయా? లేదా? లేకపోతే, వాటి స్వతంత్రతను ఎలా కాపాడాలి? నియామక విధానంలో మార్పులు అవసరమా? పార్లమెంటరీ పర్యవేక్షణ బలోపేతం చేయాలా? లేక న్యాయపరమైన పర్యవేక్షణ సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ప్రమాదమే. ఒకదాన్ని అడ్డుకునే పేరుతో మరొకదాన్ని పెంపొందించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమనే భావన బలపడాలి. అదే సమయంలో, చట్ట అమలు సంస్థలు కూడా తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి.

ఈ కేసు రాజకీయంగా ఎవరికీ లాభమో, ఎవరికి నష్టమో ఆయా పార్టీలు, నేతలు నిర్ణయించుకోవాలి. కానీ, సాక్ష్యాలు బలంగా ఉంటేనే కేసులు నిలబడతాయి. దోషులకు శిక్షలు పడతాయి. లేకపోతే అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి కేసుల నమోదులో రాజకీయ ప్రభావాలు? కక్షలు, ప్రలోభాలు? లొంగదీసుకోవడాలు వంటివేవున్నా, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తికి సవాల్ గా నిలుస్తున్నాయి. మన దేశంలో రాజకీయ కేసులు నిలబడవనే నానుడి మారోసారి రుజువైంది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News