Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇప్పటి వరకూ గంజాయి రవాణా, పట్టుబడటం, తప్పించుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు మాఫియా నేరుగా హత్యలకు తెగబడటం చూస్తున్నాం. పెంచలయ్య హత్య వెనుక ఉన్న నిజమైన డాన్‌లు, రాజకీయ అండదండలు బయటపడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని మాదకద్రవ్యాల మాఫియాపై సమగ్ర యుద్ధం ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా చాపకింద నీరులా సాగుతోంది. ఏపీ పక్క రాష్ట్రం ఒడిశా సరిహద్దు సహా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా పండుతోంది. ఒడిశా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మార్గాలుగా జగ్గంపేటకు, అక్కడి నుంచి పలు జిల్లాలకు భారీ ఎత్తున రవాణా జరుగుతోంది.

అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ ఏడాది 93 ఎకరాలకు సాగు తగ్గింది. డ్రోన్లు, శాటిలైట్‌ ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నారు. వేలాది ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళిస్తున్నారు. ‘గత ఏడాది ఒక్క ఏపీలోనే 867 గంజాయి కేసులను నమోదు చేసి 20,467 మందిని అరెస్టు చేశారు. 65 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 500 వాహనాలను సీజ్‌ చేశారు. సంకల్పం పేరిట గంజాయికు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు, యువత, మహిళా సంఘాలకు అవగాహన కల్పించామని పోలీసులు వివరిస్తున్నారు. అయినప్పటికీ గత వంద రోజుల్లో 93 కేసులు నమోదు చేసి 6,782 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 247 మందిని అరెస్ట్ చేశాశారు. ఎంత అదుపు చేసినా, మళ్లీ మళ్లీ అదే నేరం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా ఉంది.

తెలంగాణలో కూడా ఈగిల్‌ టీమ్‌ తరచుగా దాడులు చేస్తున్నా, పట్టుబడేది మొత్తం రవాణాలో అతి తక్కువ శాతం మాత్రమే. మిగతావన్నీ గుట్టుచప్పుడు కాకుండా నగరాలు, పట్టణాలకు చేరుతున్నాయి. హైదరాబాద్ లో గంజాయి డాన్ నీతూబాయి ఏడాదిగా పరారీలోనే ఉంది. అయినా గంజాయి స్మగ్లింగ్ మాత్రం ఆగడంలేదు. ప్రతినిత్యం ఏదో ఓ ప్రాంతం నుంచి గంజాయి పట్టుపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

యూత్ ను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థులు లక్ష్యంగా గంజాయిని చిన్నపొట్లాలు, లిక్విడ్‌, చాక్లెట్‌ రూపంలో విక్రయిస్తున్నారు. నగరాల్లో యువత, విద్యార్థులు ప్రధాన టార్గెట్‌ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

పోలీసులు నిఘా కట్టు దిట్టం చేసినా రవాణా ఆగట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ నేతల అండదండలతో మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను కక్షపూరితంగా హత్య చేయడం దీనికి నిదర్శనం. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ప్రధాన నిందితుడు జేమ్స్‌ కుటుంబం గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారానికి యువకులను ప్రోత్సహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కామాక్షి అనే మహిళ కాలనీలో అక్రమాలు ఎక్కువ చేస్తున్నందుకు స్థానికులు ఆమెను బహిష్కరించగా, కక్షతో పెంచలయ్యను హత్య చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉప్పొంగి జేమ్స్‌ ఇంటిని దహనం చేశారు.

ప్రభుత్వాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు, ఉచిత బియ్యం పంపిణీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మాఫియాలను అరికట్టేందుకు నిధులు, బలగాలు వినియోగించాల్సి ఉంది. హెలికాప్టర్లల్లో తిరగడానికి వందల కోట్లు ఖర్చు చేయడం కంటే, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఏజెన్సీల్లో పండుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేయాలి. రవాణా మార్గాలపై కఠిన నిఘా పెట్టాలి. ఈగిల్‌ టీమ్‌లకు మరింత బలగాలు, సాంకేతిక వనరులు అందించాలి. యువతను విషం చేస్తున్న మాదకద్రవ్యాలను తక్షణమే అరికట్టకపోతే సమాజం దారి తప్పిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పెంచలయ్య హత్య మాఫియాల దుశ్చర్యలకు నిదర్శనం మాత్రమే కాదు, ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్నదనే హెచ్చరిక!

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News