Monday, August 3, 2026
31.5 C
Hyderabad

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇప్పటి వరకూ గంజాయి రవాణా, పట్టుబడటం, తప్పించుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు మాఫియా నేరుగా హత్యలకు తెగబడటం చూస్తున్నాం. పెంచలయ్య హత్య వెనుక ఉన్న నిజమైన డాన్‌లు, రాజకీయ అండదండలు బయటపడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని మాదకద్రవ్యాల మాఫియాపై సమగ్ర యుద్ధం ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా చాపకింద నీరులా సాగుతోంది. ఏపీ పక్క రాష్ట్రం ఒడిశా సరిహద్దు సహా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా పండుతోంది. ఒడిశా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మార్గాలుగా జగ్గంపేటకు, అక్కడి నుంచి పలు జిల్లాలకు భారీ ఎత్తున రవాణా జరుగుతోంది.

అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ ఏడాది 93 ఎకరాలకు సాగు తగ్గింది. డ్రోన్లు, శాటిలైట్‌ ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నారు. వేలాది ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళిస్తున్నారు. ‘గత ఏడాది ఒక్క ఏపీలోనే 867 గంజాయి కేసులను నమోదు చేసి 20,467 మందిని అరెస్టు చేశారు. 65 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 500 వాహనాలను సీజ్‌ చేశారు. సంకల్పం పేరిట గంజాయికు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు, యువత, మహిళా సంఘాలకు అవగాహన కల్పించామని పోలీసులు వివరిస్తున్నారు. అయినప్పటికీ గత వంద రోజుల్లో 93 కేసులు నమోదు చేసి 6,782 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 247 మందిని అరెస్ట్ చేశాశారు. ఎంత అదుపు చేసినా, మళ్లీ మళ్లీ అదే నేరం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా ఉంది.

తెలంగాణలో కూడా ఈగిల్‌ టీమ్‌ తరచుగా దాడులు చేస్తున్నా, పట్టుబడేది మొత్తం రవాణాలో అతి తక్కువ శాతం మాత్రమే. మిగతావన్నీ గుట్టుచప్పుడు కాకుండా నగరాలు, పట్టణాలకు చేరుతున్నాయి. హైదరాబాద్ లో గంజాయి డాన్ నీతూబాయి ఏడాదిగా పరారీలోనే ఉంది. అయినా గంజాయి స్మగ్లింగ్ మాత్రం ఆగడంలేదు. ప్రతినిత్యం ఏదో ఓ ప్రాంతం నుంచి గంజాయి పట్టుపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

యూత్ ను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థులు లక్ష్యంగా గంజాయిని చిన్నపొట్లాలు, లిక్విడ్‌, చాక్లెట్‌ రూపంలో విక్రయిస్తున్నారు. నగరాల్లో యువత, విద్యార్థులు ప్రధాన టార్గెట్‌ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

పోలీసులు నిఘా కట్టు దిట్టం చేసినా రవాణా ఆగట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ నేతల అండదండలతో మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను కక్షపూరితంగా హత్య చేయడం దీనికి నిదర్శనం. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ప్రధాన నిందితుడు జేమ్స్‌ కుటుంబం గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారానికి యువకులను ప్రోత్సహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కామాక్షి అనే మహిళ కాలనీలో అక్రమాలు ఎక్కువ చేస్తున్నందుకు స్థానికులు ఆమెను బహిష్కరించగా, కక్షతో పెంచలయ్యను హత్య చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉప్పొంగి జేమ్స్‌ ఇంటిని దహనం చేశారు.

ప్రభుత్వాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు, ఉచిత బియ్యం పంపిణీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మాఫియాలను అరికట్టేందుకు నిధులు, బలగాలు వినియోగించాల్సి ఉంది. హెలికాప్టర్లల్లో తిరగడానికి వందల కోట్లు ఖర్చు చేయడం కంటే, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఏజెన్సీల్లో పండుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేయాలి. రవాణా మార్గాలపై కఠిన నిఘా పెట్టాలి. ఈగిల్‌ టీమ్‌లకు మరింత బలగాలు, సాంకేతిక వనరులు అందించాలి. యువతను విషం చేస్తున్న మాదకద్రవ్యాలను తక్షణమే అరికట్టకపోతే సమాజం దారి తప్పిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పెంచలయ్య హత్య మాఫియాల దుశ్చర్యలకు నిదర్శనం మాత్రమే కాదు, ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్నదనే హెచ్చరిక!

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News