Wednesday, June 10, 2026
25.8 C
Hyderabad

నేపాల్ లో ఏం జరుగుతోంది?!|EDITORIAL

నేపాల్ లో అంతర్గత సంక్షోభం ఎందుకు వచ్చింది? సోషల్ మీడీయా, మెస్సేజింగ్ యాప్స్ నిషేధం వల్లేనా? మరి నేపాల్ లో పెచ్చరిల్లిన వర్ణ, వర్గ వివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగిత, అధికారస్వామ్యం, అనేక ఉద్యమాలు, రాచరికాన్ని పున:ప్రతిష్టించే చర్యలు, నిరసనలు, మావోల ఉద్యమాలు, ప్రభావాలు ఎందుకున్నట్లు? పౌరులు, ప్రత్యేకించి యువత ఎందుకు ప్రభుత్వాన్నే కూల్చేందుకు తమ ప్రాణాలకు తెగిస్తున్నది?

నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.

నేపాల్ ప్రస్తుత సంక్షోభంపై సవివరణలతో సహేతుకంగా ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ తేల్చి చెప్పిన నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు

నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు

‘ఇక్కడ భూకంపాలు రావాల్సిన పనిలేదు. అంతకుమించి, నేపాల్ నిత్యం అవినీతితో వణికిపోతోంది’ ఇది నేపాల్ తాజా ఉద్యమంలో పాల్గొన్న ఓ విద్యార్థి పట్టుకున్న ప్ల కార్డుపై రాసి ఉన్న వాక్యాలు. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నది. ఆందోళన చేస్తున్న యువత అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేపాల్‌లో రాచరికాన్ని పునరుద్ధరించాలన్న కొన్ని నెలల కిందటి ఒక ఉద్యమం జరిగింది. ఆ సమయంలో కూడా నిరసనకారులు వ్యవస్థలో ప్రబలంగా అవినీతి పేరుకపోయిందన్న ఆరోపణలు చేశారు. మరి సోషల్ మీడియాని నిషేధించిన కారణంగానే నేపాల్ సంక్షోభం తలెత్తిందా? అంటే అది ఒక సాకు మాత్రమే. ఆ కారణాన్ని బేస్ గా చేసుకుని అల్లరి చెలరేగింది. అది దావానలంలా వ్యాపించింది. సైన్యానికి సైతం లొంగని రీతిలో విజృంభిస్తోంది.

నేపాల్ లో సెప్టెంబర్ 4న ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి 26 ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం నిషేధించింది. నిషేధిక ఆజ్ఞలను పాటించడానికి వారం సమయమిచ్చింది. చైనా సోషల్ మీడియా టిక్‌టాక్ ఈ షరతులను సకాలంలో పాటించడం వల్ల నిషేధించలేదని లేదు. అయితే, నేపాల్‌ ప్రజలు, ప్రత్యేకించి యువత పెద్ద సంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాపై నిషేధం వల్ల తమ కుటుంబాలను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యువత నిరసనలకు పిలుపునిచ్చారు. టిక్‌టాక్ ప్రస్తుతం నేపాల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పైగా నిషేధిత జాబితాలో ఎలాగూ లేదు. టిక్‌టాక్‌లో అనేక వీడియోలను షేర్ చేసి, నిరసనలో చేరాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు. టిక్‌టాక్‌లో ‘నెపో బేబీ’ ట్రెండ్ కూడా ప్రారంభమైంది. ఇందులో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. వీటితో నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టతరమైన జీవితాలను పోలుస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి.

కాగా, సోమవారం ఉదయం కఠ్మాండూలోని సింహ్ దర్బార్ దగ్గరకు వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూ బనేశ్వర్‌లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు. రాష్ట్రపతి భవన్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం, ప్రధాన మంత్రి నివాసం పార్లమెంట్ హౌస్ చుట్టూ ఉండే కర్ఫ్యూని, నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా, నిరసనకారులు, దూసుకుపోయారు. సైన్యాన్ని వీధుల్లో మోహరించినా పట్టించుకోలేదు. ఘర్షణలు జరిగాయి. మంటలు చెలరేగాయి. సజీవ దహనాలు జరిగాయి. తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసన కారులు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది మరణించారు. కనీసం 150 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

‘జెన్ జీ’గా పిలుచుకుంటున్న నిరసనకారులు నేపాల్ పాలనా వ్యవస్థ అవినీతిమయమైందని ఆరోపిస్తున్నారు. జెన్ జీ అంటే, నేపాల్ లో 1990 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని ఇంగ్లిష్‌లో జనరేషన్ జెడ్ గా పరిగణిస్తున్నారు. వీరినే జెన్ జీగా పిలుస్తున్నారు.

అసలు హింసకు కారణాలేంటి? ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి. అభివృద్ధిలో అసమానతలు. యువతకు ఉపాధి అవకాశాలు లేమి. పాలక, అధికార వర్గాలకు చెందిన పిల్లలు అంటే ‘నిపో కిడ్స్’ అత్యున్నతంగా ఉండటం వల్ల అసంతృప్తి పెరిగింది. అధికారిక ఆధిపత్యం వల్ల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై నియంత్రణ జరిగింది. రాణా ప్రాంతాల మాధేశ్ ఉద్యమాలు, వర్గ, వర్ణ వివక్ష, దళిత హత్య కేసులు వంటి ఘో రమైన సంఘటనలు ప్రజలను పోరాటానికి ప్రేరేపించాయి. 2015లో జరిగిన టికాపూర్ హత్యాకాండ, రుకుం హత్యల కేసులు ఆ ప్రేరేపణలకు ఆజ్యం పోశాయి.

నేపాల్ లో 1996–2006 మధ్య మావోయిస్టు విప్లవం, సామాజిక అన్యాయం, పేదరికం, నిరాశ వంటి అంశాలతో పని చేసింది. ఈ యుద్ధంలో 14వేలకు పైగా మరణించారు. అనేక అత్యాచారాలు జరిగాయి. లక్షల్లో నేపాల్ ని వీడి పోయారు. 2023, 2025లో రాజరికాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు జరిగిన నిరసనలు, ఆందోళనలు, ఈ ఉద్యమానికి ఊపునిచ్చాయి. లింగ వివక్ష, మహిళలపై అత్యాచారాలు వంటి సామాజిక అంశాలు కూడా ఈ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి.

మరి పరిష్కార మార్గాలేంటి? పాలనలో అవినీతిని అంతమొందించాలి. అధికారస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించి, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, సామాజిక అంతరాలను తొలగించే విధానాలను అమలు చేయాలి. ఆందోళనకారుల సమూహాలతో చర్చలు జరిపి తగిన హామీలివ్వాలి. పకడ్బందీగా అమలు చేయాలి. బాధితులకు న్యాయ పరమైన పరిహారాలు అందించాలి. అక్కడ మహిళలపై జరిగిన హింసలకు పరిష్కార మార్గాలు వెతకాలి. హెల్ప్ లైన్లు పెట్టాలి. అన్నింటికంటే ముందు నేపాల్ లో శాంతిని నెలకొల్పాలి. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. అది ఒక సాకు మాత్రమే. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. కానీ సోషల్ మీడియాలో వస్తున్నదంతా అంత మంచిదేం కాదు. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News