Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ ప్రసాదం రాజకీయ యుద్ధంగా మారి, చివరికి పరస్పర దూషణలు, దాడులు, విధ్వంసాలకు దారితీయడం రాష్ట్ర ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ, దానికి పవిత్ర ఆలయాన్ని ఆలవాలం చేసుకోవడమేగాక, హింసాత్మకం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఇటీవల జోగిరమేశ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి ప్రయత్నం, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలు రాజకీయ అసహనానికి ప్రతీకలు. వైకాపా హయాంలో ఇలాంటివి జరిగాయని విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమవడం అత్యంత దురదృష్టకరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం ఇవ్వకూడదు.

పవిత్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందన్న అంశాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఆలయ భూములు, ఆభరణాలు, నియామకాలు, పూజా విధానాలపై వివాదాలు వచ్చినా, లడ్డూ ప్రసాదం అంశం మాత్రం మరింత సున్నితమైనది.

2024 మేలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై హామీలు ఇచ్చారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం తర్వాత లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించడం వేగంగా జరిగిపోయాయి. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సిట్‌కు బదులుగా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రకటించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికింది. అనంతరం సీబీఐ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి 36 మందిని నిందితులుగా చార్జిషీటులో చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ నిర్వాహకులు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా గుర్తించింది.

సీబీఐ నివేదిక ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చింది. నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని తేల్చినప్పటికీ, జంతు కొవ్వు లేదా పంది కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నమూనాల్లో నిజమైన నెయ్యి శాతం చాలా తక్కువగా ఉండగా, పామాయిల్, పామ్ స్టియరిన్, ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారించింది. భోలే బాబా డెయిరీ నుంచి పాలు లేదా నెయ్యి సరఫరా అయిన దాఖలాలు లేవని కూడా పేర్కొంది.

ఈ నివేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వైసీపీ నేతలు ‘మేము నిర్దోషులం’ అన్న ప్రచారాన్ని తీవ్రం చేశారు. జగన్ సహా పలువురు నేతలు ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తూ రాజకీయ సంకేతాలు పంపారు. అయితే నెయ్యిలో కొవ్వు లేదన్న అంశాన్ని మాత్రమే పట్టుకుని, 200 కోట్ల రూపాయలకుపైగా విలువైన కల్తీ నెయ్యి సరఫరా నిజాన్ని విస్మరించడం సరికాదు. కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడలేం. ఎవరు అధికారంలో ఉన్నా ఏడుకొండలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమల వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయన్నది చేదు నిజం. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, ప్రజలను విభజించి, హింసకు ప్రేరేపించడం అత్యంత ప్రమాదకరం. అభ్యంతరకరం.

చివరికి ఈ వివాదం రాజకీయ విమర్శల నుంచి భౌతిక దాడుల వరకూ వెళ్లడం రాష్ట్రానికే కాదు రాజకీయాలకూ మంచిది కాదు. అధికార మార్పిడి ఇదే సంస్కృతి మరింత తీవ్రంతరం చేస్తుందన్న భయం సహజం. అందుకే ఇలాంటి సున్నితమైన పవిత్ర అంశాలను రాజకీయం చేయడం తగదు. పవిత్రమైన దేవాలయాలను రాజకీయ యుద్ధ భూములుగా వాడుకోచూడటం బుద్ధి తక్కువ తనం. పవిత్ర ఆలయాలను, వాటి మానాన వాటిని వదిలేద్దాం. భక్తుల మనోభావాలను గౌరవిద్దాం. అవమానపర్చడం ఆపేద్దాం. రాజకీయాలను వేరుగా చేద్దాం. ఇకిప్పుడు ఇల వైకుంఠాన్ని అకుంఠిత దీక్షతో పరిరక్షిద్దాం.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News