Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ ప్రసాదం రాజకీయ యుద్ధంగా మారి, చివరికి పరస్పర దూషణలు, దాడులు, విధ్వంసాలకు దారితీయడం రాష్ట్ర ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ, దానికి పవిత్ర ఆలయాన్ని ఆలవాలం చేసుకోవడమేగాక, హింసాత్మకం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఇటీవల జోగిరమేశ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి ప్రయత్నం, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలు రాజకీయ అసహనానికి ప్రతీకలు. వైకాపా హయాంలో ఇలాంటివి జరిగాయని విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమవడం అత్యంత దురదృష్టకరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం ఇవ్వకూడదు.

పవిత్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందన్న అంశాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఆలయ భూములు, ఆభరణాలు, నియామకాలు, పూజా విధానాలపై వివాదాలు వచ్చినా, లడ్డూ ప్రసాదం అంశం మాత్రం మరింత సున్నితమైనది.

2024 మేలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై హామీలు ఇచ్చారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం తర్వాత లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించడం వేగంగా జరిగిపోయాయి. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సిట్‌కు బదులుగా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రకటించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికింది. అనంతరం సీబీఐ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి 36 మందిని నిందితులుగా చార్జిషీటులో చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ నిర్వాహకులు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా గుర్తించింది.

సీబీఐ నివేదిక ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చింది. నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని తేల్చినప్పటికీ, జంతు కొవ్వు లేదా పంది కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నమూనాల్లో నిజమైన నెయ్యి శాతం చాలా తక్కువగా ఉండగా, పామాయిల్, పామ్ స్టియరిన్, ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారించింది. భోలే బాబా డెయిరీ నుంచి పాలు లేదా నెయ్యి సరఫరా అయిన దాఖలాలు లేవని కూడా పేర్కొంది.

ఈ నివేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వైసీపీ నేతలు ‘మేము నిర్దోషులం’ అన్న ప్రచారాన్ని తీవ్రం చేశారు. జగన్ సహా పలువురు నేతలు ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తూ రాజకీయ సంకేతాలు పంపారు. అయితే నెయ్యిలో కొవ్వు లేదన్న అంశాన్ని మాత్రమే పట్టుకుని, 200 కోట్ల రూపాయలకుపైగా విలువైన కల్తీ నెయ్యి సరఫరా నిజాన్ని విస్మరించడం సరికాదు. కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడలేం. ఎవరు అధికారంలో ఉన్నా ఏడుకొండలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమల వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయన్నది చేదు నిజం. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, ప్రజలను విభజించి, హింసకు ప్రేరేపించడం అత్యంత ప్రమాదకరం. అభ్యంతరకరం.

చివరికి ఈ వివాదం రాజకీయ విమర్శల నుంచి భౌతిక దాడుల వరకూ వెళ్లడం రాష్ట్రానికే కాదు రాజకీయాలకూ మంచిది కాదు. అధికార మార్పిడి ఇదే సంస్కృతి మరింత తీవ్రంతరం చేస్తుందన్న భయం సహజం. అందుకే ఇలాంటి సున్నితమైన పవిత్ర అంశాలను రాజకీయం చేయడం తగదు. పవిత్రమైన దేవాలయాలను రాజకీయ యుద్ధ భూములుగా వాడుకోచూడటం బుద్ధి తక్కువ తనం. పవిత్ర ఆలయాలను, వాటి మానాన వాటిని వదిలేద్దాం. భక్తుల మనోభావాలను గౌరవిద్దాం. అవమానపర్చడం ఆపేద్దాం. రాజకీయాలను వేరుగా చేద్దాం. ఇకిప్పుడు ఇల వైకుంఠాన్ని అకుంఠిత దీక్షతో పరిరక్షిద్దాం.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News