Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ ప్రసాదం రాజకీయ యుద్ధంగా మారి, చివరికి పరస్పర దూషణలు, దాడులు, విధ్వంసాలకు దారితీయడం రాష్ట్ర ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ, దానికి పవిత్ర ఆలయాన్ని ఆలవాలం చేసుకోవడమేగాక, హింసాత్మకం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఇటీవల జోగిరమేశ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి ప్రయత్నం, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలు రాజకీయ అసహనానికి ప్రతీకలు. వైకాపా హయాంలో ఇలాంటివి జరిగాయని విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమవడం అత్యంత దురదృష్టకరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం ఇవ్వకూడదు.

పవిత్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందన్న అంశాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఆలయ భూములు, ఆభరణాలు, నియామకాలు, పూజా విధానాలపై వివాదాలు వచ్చినా, లడ్డూ ప్రసాదం అంశం మాత్రం మరింత సున్నితమైనది.

2024 మేలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై హామీలు ఇచ్చారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం తర్వాత లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించడం వేగంగా జరిగిపోయాయి. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సిట్‌కు బదులుగా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రకటించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికింది. అనంతరం సీబీఐ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి 36 మందిని నిందితులుగా చార్జిషీటులో చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ నిర్వాహకులు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా గుర్తించింది.

సీబీఐ నివేదిక ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చింది. నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని తేల్చినప్పటికీ, జంతు కొవ్వు లేదా పంది కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నమూనాల్లో నిజమైన నెయ్యి శాతం చాలా తక్కువగా ఉండగా, పామాయిల్, పామ్ స్టియరిన్, ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారించింది. భోలే బాబా డెయిరీ నుంచి పాలు లేదా నెయ్యి సరఫరా అయిన దాఖలాలు లేవని కూడా పేర్కొంది.

ఈ నివేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వైసీపీ నేతలు ‘మేము నిర్దోషులం’ అన్న ప్రచారాన్ని తీవ్రం చేశారు. జగన్ సహా పలువురు నేతలు ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తూ రాజకీయ సంకేతాలు పంపారు. అయితే నెయ్యిలో కొవ్వు లేదన్న అంశాన్ని మాత్రమే పట్టుకుని, 200 కోట్ల రూపాయలకుపైగా విలువైన కల్తీ నెయ్యి సరఫరా నిజాన్ని విస్మరించడం సరికాదు. కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడలేం. ఎవరు అధికారంలో ఉన్నా ఏడుకొండలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమల వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయన్నది చేదు నిజం. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, ప్రజలను విభజించి, హింసకు ప్రేరేపించడం అత్యంత ప్రమాదకరం. అభ్యంతరకరం.

చివరికి ఈ వివాదం రాజకీయ విమర్శల నుంచి భౌతిక దాడుల వరకూ వెళ్లడం రాష్ట్రానికే కాదు రాజకీయాలకూ మంచిది కాదు. అధికార మార్పిడి ఇదే సంస్కృతి మరింత తీవ్రంతరం చేస్తుందన్న భయం సహజం. అందుకే ఇలాంటి సున్నితమైన పవిత్ర అంశాలను రాజకీయం చేయడం తగదు. పవిత్రమైన దేవాలయాలను రాజకీయ యుద్ధ భూములుగా వాడుకోచూడటం బుద్ధి తక్కువ తనం. పవిత్ర ఆలయాలను, వాటి మానాన వాటిని వదిలేద్దాం. భక్తుల మనోభావాలను గౌరవిద్దాం. అవమానపర్చడం ఆపేద్దాం. రాజకీయాలను వేరుగా చేద్దాం. ఇకిప్పుడు ఇల వైకుంఠాన్ని అకుంఠిత దీక్షతో పరిరక్షిద్దాం.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News