Monday, July 13, 2026
34 C
Hyderabad

పాక్ పై భారత్‌ ప్రతి దాడులు?

ఆపరేషన్’పై ‘అడుగు’ అప్ డేట్
పాక్ ప్రయోగించిన 26 డ్రోన్ల నిర్వీర్యం!
అమృత్‌సర్‌లో గాయపడిన ఓ కుటుంబం
ఆరు నగరాల్లో క్షిపణుల ప్రయోగం!
రావల్పిండి సమీపంలో భారీ పేలుళ్లు!
ఇస్లామాబాద్‌ లోనూ వరుస దాడులు!
ఈ తెల్లవారుజామున ముష్కరులపై ముప్పేట దాడి
తాజా దాడులపై పాక్‌ ఆర్మీ ప్రకటన

మరోవైపు పాక్‌ సైనిక స్థావరాలపై బీఎల్‌ఏ దాడులు
సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై గ్రనేడ్లతో దాడి
బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారుల వశం
క్వెట్టా సహా అనేక ప్రాంతాల స్వాధీనం

ఇంకోవైపు టీటీపీ దాడులు
20 మంది పాక్ సైనికుల హతం

పాక్ తోకాడించడం మానలేదు. ఇంకా భారత్ బార్డర్ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉంది. 9వ తేదీ అర్థరాత్రి అనేక డ్రోన్లను భారత్ పై పాక్ ప్రయోగించింది. నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఉన్నాయి.

విచారకరంగా, ఫిరోజ్‌పూర్‌లోని ఒక పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న సాయుధ డ్రోన్ వల్ల స్థానిక కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారికి వైద్య సహాయం అందించారు. అలాగే ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న బహుళ శత్రు సాయుధ డ్రోన్‌లను గుర్తించారు. శత్రు డ్రోన్‌లను మన వైమానిక రక్షణ విభాగాలు తక్షణమే నియోగించి నాశనం చేశాయి. ప్రతిగా భారత్ ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఎంతకూ పాక్ పన్నాగాలు ఆగకపోవడంతో తెల్లవారు జాము నుంచి భారత్ పాక్ పై ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది.

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్‌ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి ఆరోపించారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్‌ గగనతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్‌ ఖాన్‌, షోర్‌కోట్‌, మురిద్‌ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్‌ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
కొనసాగుతున్న బిఎల్ఎ దాడులు
పాకిస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బలూచిస్థాన్‌ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకున్నారు. ఓవైపు భారత్‌పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాక్‌ తెగబడుతున్న సమయంలో… బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సహా మూడు తిరుగుబాటు గ్రూపులు అక్కడి పాక్‌ సైనిక స్థావరాలపై దాడులకు దిగాయి. క్వెట్టాలోని ఫైజాబాద్‌ ప్రాంతంలో పాక్‌ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై తిరుగుబాటుదారులు గ్రనేడ్లతో దాడికి దిగారు. పాకిస్థాన్‌ ఆర్మీని తరిమికొడుతూ, అక్కడి కీలక నగరం క్వెట్టా సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు ప్రాంతాల్లో పాక్‌ దళాలపై ఐఈడీలు, గ్రనేడ్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో దాడులు చేశామని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జియాంద్‌ బలూచ్‌ ప్రకటించారు.

ఇదిలావుండగా, క్వెట్టా, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్‌ జెండాలను తొలగించి.. బలూచిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీటీపీ దాడులు

పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెహ్రిక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) తీవ్రవాదులు చేసిన దాడిలో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్‌, దక్షిణ వజిరిస్తాన్‌లోని షకాయి సబ్‌ డివిజన్‌లో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టుపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగినట్టు రిపబ్లిక్‌ వరల్డ్‌ సంస్థ ఓ కథనంలో పేర్కొంది. లేజర్‌ రైఫిల్స్‌ ఉపయోగించి టీటీపీ చేసిన తొలి దాడిలో ఆరుగురు పాక్‌ సైనికులు మరణించారు. మిలటరీ ఔట్‌పోస్టు రక్షణకు బయలుదేరిన రెండు సైనిక వాహనాలపైనా టీటీపీ దాడి చేసింది. మొత్తంగా 20 మంది పాక్‌ సైనికులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని టీటీపీ ప్రకటించింది.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News