Thursday, March 12, 2026
26.8 C
Hyderabad

అసెంబ్లీలో నదీజల రాజకీయాలు!|EDITORIAL

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో నదీజలాలను సమర్థంగా వినియోగించుకుంటాయన్న ఆశలు నెరవేరలేదు. పైగా జలవివాదాలు మరింత ముదిరాయి. వృథా అవుతున్న నీటిని నిల్వ చేసుకోవడం, సమగ్ర జలవిధానాలు రూపొందించుకోవడం వంటి అంశాలను పాలకులు విస్మరించారు. దూరదృష్టి లేని నిర్ణయాలు, రాజకీయ లాభాలకే పరిమితమైన ప్రాజెక్టులు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారాయి.

ఏపీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం పదేళ్లు గడిచినా పూర్తికాలేదు. జగన్‌ పాలనలో బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు, మాఫియాల ఆరోపణలు, రాజధాని గందరగోళం మధ్య పోలవరం వెనుకబడింది. ఇప్పుడు చంద్రబాబు కూడా వైఖరిలోనూ పోలవరం పూర్తి చేయడంపై కంటే బనకచర్ల, ఇతర లింక్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తెలంగాణకు వరంగా ప్రచారం జరిగినా, నిర్మాణ లోపాలు, నిర్వహణ వైఫల్యాలు బయటపడ్డాయి. బ్యారేజీల కుంగుబాటు, లక్షల కోట్ల ప్రజా ధనం వృథా అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇతర మధ్యతరహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా జల భద్రత కంటే రాజకీయ ప్రతిష్ఠే ప్రధానంగా మారింది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం పోలవరం–నల్లమల (పీఎన్‌ లింక్‌) ప్రాజెక్టు. ఈ లింక్‌ ద్వారా కేవలం గోదావరి మిగులు జలాలే కాకుండా కృష్ణా జలాలను కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నది బీఆర్‌ఎస్‌ వాదన. ఏపీ ప్రభుత్వం పీఎన్‌ లింక్‌ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని తరలించాలన్న ప్రతిపాదనలతో డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ లింక్‌లో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి ప్రకాశం బరాజ్‌, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో నాగార్జునసాగర్‌ కుడి కాలువను దాటాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ అనుసంధానాలను ఉపయోగించి సాగర్‌ నుంచే కృష్ణా జలాలను బొల్లాపల్లికి మళ్లించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ప్రస్తుతం 173 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌ను భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు విస్తరించవచ్చన్న వాదన ఈ భయాలను మరింత పెంచుతోంది.

ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వినియోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నుంచే జలదోపిడీ జరుగుతుండగా, సాగర్‌ నుంచీ అదే ప్రక్రియ మొదలైతే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చెన్నై తాగునీటి కోసం కృష్ణా బేసిన్‌ రాష్ట్రాలు 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఒప్పందం కూడా కాలక్రమేణా జలదోపిడీకి మారిందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం, ప్రభుత్వాలకు నీటి వనరుల నిర్వహణపై సమగ్ర దృక్పథం లేకపోవడం. వృథా, మిగులు జలాలను నిల్వ చేసుకునే ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య విశ్వాసంతో కూడిన ఒప్పందాలు, పారదర్శక సంఖ్యా వివరాలు, పంపకం వంటివేవీ రాజకీయ ప్రాధాన్యత పొందడం లేదు. ఫలితంగా, నీరు అత్యంత ఆవశ్యమైన వనరుగా కాకుండా, ఒక రాజకీయ ఆయుధంగా మారింది.

అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర వాగ్వాదం అనివార్యంగా మారింది. అయితే ఈ చర్చలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, శాస్త్రీయంగా, సాంకేతిక సంఖ్యల ఆధారంగా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా సాగితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే, గతంలాగే నదీజలాలు రాజకీయ మంటల్లో కాలిపోతూనే ఉంటాయి.

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News