Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

ఇంకా కులాల కుంపట్లేనా? సామాజిక న్యాయం ఎప్పుడు?|ESSAY|ARTICLES

దేశంలో కుల వివక్ష ఎలా జీవితాలను ధ్వంసం చేస్తోందో ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య ఘటన తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక పూరన్ కథ కాదు. ఇది అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అధికారులు, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న దారుణం. జాతీయ, జాతి ఆధారంగా గట్టిగా ముడిపడాల్సిన మన సమాజం ఇంకా విడిపోతూనే ఉంది. “సమాన అవకాశాలు” మన రాజ్యాంగంలో ఉన్నా, జాతీయత అనే భావన కేవలం నినాదంగా మిగిలిపోయిందా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. ఐపీఎస్ పూరన్ ప్రాణం పోగొట్టుకున్నాక కూడా మనం మేల్కొనకపోతే, మరెన్నో ప్రాణాలు ఈ విధంగానే కోల్పోవాల్సి వస్తుంది. కులాల కుంపట్లు ఆరిపోతేనే ఈ దేశంలో సామాజిక న్యాయం గెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టు, గోపాల బాలరాజు రాసిన వ్యాసం 

మన దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో ఒకటైన ఐపీఎస్ క్యాడర్ అధికారి, దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న విద్యావంతుడైన ఓ ఉన్నతోద్యోగి కూడా చివరకు బతకలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఇది దేశాన్నే కుదిపేసిన దారుణ ఘటన. నాయకుల ప్రసంగాలకే పరిమితమవుతున్న “సామాజిక న్యాయం” దేశంలో మాటలకే మిగిలిపోయిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య.

ఒక జీవితం అంతం కాదు – ఒక వ్యవస్థ వైఫల్యం
తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ బర్కత్ పురాకు చెందిన పూరన్ కుమార్ చదువుల్లో మెరుగైన ప్రతిభ చూపి దేశంలోని అత్యున్నత సర్వీసు అయిన ఐపీఎస్ లో చేరాడు. కానీ, అతని “జాతి” అతనికి శాపంగా మారింది. ఉద్యోగంలో పదోన్నతులు నిలిపేయడం, అవమానాలకు గురి చేయడం, వేధించడం, బాధించటం.. ఇవన్నీ నిమ్న కులానికి చెందిన వాడు కాబట్టే అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు భరించలేక తన జీవితాన్ని తానే అంతం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ తన సూసైడ్ నోటులో తాను ఎదుర్కొన్న వేధింపులు, జాతి ఆధారిత వివక్ష గురించి బహిరంగంగానే పేర్కొన్నాడు. తనను అవమానించిన అధికారుల పేర్లను కూడా రాశాడు. ఇది దేశంలోని వ్యవస్థల్లో జరుగుతున్న అన్యాయాలను బహిర్గత పరిచే, లోతైన వ్యవస్థాపిత అన్యాయానికి నిదర్శనం.

ఈ వ్యవస్థ ఇక మారదా?
మన దేశంలో కుల వివక్ష ఎలా జీవితాలను ధ్వంసం చేస్తోందో పూరన్ ఆత్మహత్య ఘటన తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక పూరన్ కుమార్ కథ కాదు. ఇది అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అధికారులు, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న దారుణం. ఉద్యోగంలో ఉన్నా సరే, ఉన్నత పదవిలో ఉన్నా సరే, ఎవరూ వేధింపులకు అతీతులు కారు. అధికార స్థాయిలో కుల వివక్ష, పదోన్నతులలో పక్షపాతం, సామాజికంగా తక్కువగా చూడడం ఇవన్నీ మన దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు.

ఇది వ్యక్తిగత విషాదం కాదు
పూరన్ కుమార్ మరణం వెనుక ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ, జాతి ఆధారంగా గట్టిగా ముడిపడాల్సిన మన సమాజం ఇంకా విడిపోతూనే ఉంది. “సమాన అవకాశాలు” అనే పదం మన రాజ్యాంగంలో ఉన్నా, జాతీయత అనే భావన కేవలం నినాదంగా మిగిలిపోయిందా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది.

ఇప్పుడు ఏం చేయాలి?
కేంద్రం స్పందించి సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించి, ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలి. పూరన్ పై వేధింపులకు పాల్పడిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మరెవ్వరూ ఇలాంటి సాహసం చేయడానికి భయపడేంతగా శిక్షలుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులకు జరుగుతున్న కుల వివక్షపై జీరో టాలరెన్స్ పాలసీ పాటించాలి. మానసిక ఆరోగ్య కేంద్రాలు, కౌన్సిలింగ్ సదుపాయాలు ఉద్యోగులకు అందుబాటులో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అధికారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేయాలి.

పూరన్ మరణం గుణపాఠం కావాలి
దేశంలో కులం చూసి కాదు, కర్తవ్య నిబద్ధత, మానవతా విలువలు చూసే సమాజం కావాలి. ఒక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ప్రాణం పోగొట్టుకున్నాక కూడా మనం మేల్కొనకపోతే, మరెన్నో ప్రాణాలు ఈ విధంగానే కోల్పోవాల్సి వస్తుంది. కులాల కుంపట్లు ఆరిపోతేనే ఈ దేశంలో సామాజిక న్యాయం గెలుస్తుంది.

✍ గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్టు
ఫోన్: 73370 28570

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News