Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

బిల్లా? ఆర్డినెన్సా?|BILL|ORDINANCE

‘బీసీ రిజర్వేషన్ల’ ఉచ్చులో BJP|బీజేపీ!?
BILL|బిల్లును కాదంటే చిల్లే!
ఆర్డినెన్స్ ను కాదంటే అవుటే!
‘ముస్లీం’|MUSLIM సాకూ ముప్పే!
9వ SCHEDULE|షెడ్యూల్ లో చేర్చకపోతే చెల్లే!
బీజేపీకి ప్రమాదంగా ‘రాహు’ల్!
కమలాన్ని ‘క్రష్’ చేస్తున్న REVANTH REDDY|రేవంత్!
బీజేపీ BC|బీసీ LEADERS|నేతలు బయటకు రావాలని..
పిలుపునిచ్చిన PCC CHIEF|పీసీసీ చీఫ్ మహేశ్!|MAHESH KUMAR GOUD
TOMARROW|రేపు CABINET|కేబినెట్ భేటీలో మళ్ళీ నిర్ణయం?
PRESIDENT|రాష్ట్రపతి దగ్గర బిల్లు ముసాయిదా
GOVERNOR|గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ముసాయిదా
రేపటితో ముగియనున్న HIGH COURT|హైకోర్టు గడువు
దేశ వ్యాప్త జన, కుల గణనకు పూనుకుని…
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే ఎలా?
TELANGANA|తెలంగాణ తరహాలో వ్యవహరించవచ్చా?
అప్పటిలా సీన్ రివర్స్ అయితే ఎలా?
బీజేపీ బీసీలకు వ్యతిరేకమన్న అపప్రద తప్పదా?
ఆ క్రెడిట్ కోసమే ఈ ఆలస్యమా?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కాంగ్రెస్ ఉచ్చులో బీజేపీ పడిందా? ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఆ పార్టీ పరిస్థితి మారిందా? బీసీ రిజర్వేషన్లను అమోదించడమా? వ్యతిరేకించడమా? అన్న మీమాంసలో బీజేపీ ఉందా? తెలంగాణ కమలంలో అసలే అంతర్గతపోరు నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాం రాం చెప్పారు. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వచ్చి కొన్ని రోజులే అవుతోంది. బండికి ఈటలకు పడటం లేదు. కోల్డ్ వార్, ఓపెన్ వార్ గా డిక్లేర్ అయింది. ‘పాత, కొత్త అధ్యక్షులు కలిసి బండి, ఈటలతో మాట్లాడాలంటున్నారు ఎంపీ అరవింద్, అవసరమైతే అధిష్టానం జోక్యం చేసుకోవాల’ని కూడా ఆయన సూచన చేశారు. ఇవన్నీ ఇలా ఉండగా, బీసీల రిజర్వేషన్లు ఉచ్చు బీజేపీకి బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. జన గణనతోపాటు, కులగణనను కూడా చేపడుతున్న బీజేపీ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందా? లేక ఆ క్రెడిట్ తమ బుట్టలో వేసుకోవడానికి తాపత్రయపడుతోందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో వ్యవహరించిన తీరును కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఆతర్వాత ‘తల్లిని చంపి బిడ్డను బతికించార’న్న మోడీ వ్యాఖ్యలు ఆ పార్టీని తెలంగాణలో కోలుకోకుండా చేశాయి. బీసీ రిజర్వేషన్లు కూడా ఆలాగే ఇప్పుడు సీను రివర్స్ అయింది. బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షలో ఉంది. బిల్లు ముసాయిదా రాష్ట్రపతి దగ్గర, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నాయి. ఆమోదించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే, ముందుగా రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అవకాశమిచ్చి, కుల గణన తర్వాత దేశ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లను పెంచి ఆ రెండు క్రెడిట్లను మొత్తాన్ని బీజేపీ తమ ఖాతాలో వేసుకోవచ్చు! ఒకవేళ బీసీ రిజర్వేషన్లను ఆలస్యం చేస్తే, ఓసీలకు 10శాతం రిజర్వేషన్లను కల్పించిన బీజేపీ కచ్చితంగా అగ్రకుల పార్టీగా మిగిలిపోతుంది. మరి బీజేపీ ఏం ఆలోచిస్తోంది? ఆలస్యం విషం కాకముందే నిర్ణయం తీసుకోవాలి. అంతకుముందే 3 రాష్ట్రాలనిచ్చిన బీజేపీ, అప్పటి రాజకీయావసరాలేవైనా తెలంగాణను వదిలేసింది. తర్వాత ఆ క్రెడిట్ ని కాంగ్రెస్ కొట్టేసింది. ఇవ్వాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే రేపు తప్పకపోవచ్చు. ఎందుకంటే రాహుల్ సహా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బీసీలకు అనుకూలంగా ఉంది. మళ్ళీ సీన్ రివర్స్ కావచ్చు. ఆ క్రెడిట్ కాంగ్రెస్ కే దక్కొచ్చు? ఈ లోగా బీజేపీ ఏం చేస్తుంది?

హైదరాబాద్, జూలై 23 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘బీసీ బండారు దత్తాత్రేయని తప్పించి కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి, ఆ తర్వాత రామచంద్రరావుకి ఆ పదవి ఇచ్చి బీసీలకు అన్యాయం చేశార’ని సీఎం కమలాన్ని కార్నర్ చేస్తున్నారు. గవర్నర్ పదవీకాలం ముగిసిన బండారు దత్తాత్రేయకి ఉపరాష్ట్రపతి పదివి ఇవ్వాలని కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేయడం విశేషమే. ఇక హిందూత్వ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ, ముస్లీంలకు రిజర్వేషన్లిస్తే బీసీల రిజర్వేషన్ల బిల్లును ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించింది. ఈ వాదనను మొగ్గలోనే తుంచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ‘దమ్ముంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీం రిజర్వేషన్లను తీసేసి మాట్లాడాల’ని సవాల్ విసిరారు. అంతేకాదు ఆ సాకుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నా, వాటిని సాధించితీరుతామని హెచ్చరించారు. పైగా ‘2029 ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లే లిట్మస్ టెస్టు’ అంటూ ఎజెండాగా రేవంత్ సెట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోతామని ప్రతిన బూనారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ మాటలు మరింతగా బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపారు. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎందుకు వద్దంటున్నారని ఆయన నిలదీశారు. కేంద్రం ఆయన భుజంపై తుపాకీ పెట్టి, బీసీలపై ఎక్కు పెట్టిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదించకపోతే, ఈ పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేస్తామంటున్న ఆయన, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించాలని తలపోస్తున్న ఓబీసీ రిజర్వేషన్ల సభల్లో రాహుల్ గాంధీ బీజేపీ పాలిట ‘రాహువు’గా మారే ప్రమాదం ఉంది. బీసీలకు వ్యతిరేకమైన బీజేపీ, బీఆర్ఎస్ ను బీసీ నేతలు వీడాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఈ తరుణంలో కేంద్రంలో బిల్లును ఆమోదిస్తే సరి, అందరికీ మోదమే. కానీ, అది బీజేపీ వైఖరికి విరుద్ధంగా ఉండటమేగాక, మిగతా రాష్ట్రాల్లో వచ్చే డిమాండ్లకు ఎలా? అనే సంశయంలో ఆ పార్టీ ఉంది. ఆమోదించకపోతే తెలంగాణలో ఆ పార్టీకి బీసీల నుంచి చుక్కెదురేనని భావిస్తున్నది. ఈ ప్రభావం అటు దేశం, ఇటు రాష్ట్రంపైనా పడుతుంది. ఇక ఆర్డినెన్స్ పై ఆ పార్టీ ప్రతినిధిగా పని చేస్తున్న గవర్నర్ సంతకం చేస్తే బీజేపీ కేంద్ర, రాష్ట్రాలపై భిన్న వైఖరులను తేటతెల్లం చేస్తుంది. రాష్ట్రంలో ఆమోదించాక కేంద్రంలో బిల్లు చేయడానికి అభ్యంతరాలేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి? ఒక వేళ ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ ఆమోదించకపోతే బీసీలకు బీజేపీ వ్యతిరేకమేనన్న ముద్ర పడుతుంది. పైగా కేబినెట్ ఆమోదించిన ముసాయిదా కావడం కూడా గవర్నర్ కు అంటే బీజేపీకి ఇరకాటమే. 25వ తేదీన కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కేబినెట్ బీసీల ముసాయిదాకు మరోసారి ఆమోదం తెలిపి, గవర్నర్ కు మళ్ళీ పంపితే, దాన్ని ఆమోదించడం తప్పనిసరి కావచ్చు? అయినప్పటికీ మొండికేస్తే అది వివాదం కావచ్చు. పైగా స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హై కోర్టు డెడ్ లైన్ కత్తి ప్రభుత్వం మెడపై వేళ్ళాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలన్న ద్రుఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ఈ నెలాఖరులోగానే రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన కండీషన్ కూడా కత్తిలా కనిపిస్తోంది.

ఈ దశలో బీసీలకు బీజేపీ దూరమవుతుందా? దగ్గరవుతుందా? అన్నది బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆమోదంపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే బీజేపీ ఒకటి రెండు కులాల పార్టీగా, మిగతా కులాలకు అంటరాని పార్టీగా అపవాదును మూటగట్టుకున్నది. అసలు బీజేపీ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. త్వరలోనే తేలనుంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News