Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు లేదు!

ప్రపంచ వ్యాప్తంగా వున్న కార్మికులకు కర్షకులకు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో…

‘అరివె గురు (అవగాహనయే గురువు), కాయకవే కైలాస (కాయకష్టమే కైలాసము)’ అని బసవేశ్వరుడు కార్మిక లోక కష్టాన్ని గుర్తించాడు.

గతి తార్కిక భౌతిక వాదంతో ‘కార్మికుల కష్టం ద్వారా వచ్చే మిగులు విలువ’ సిద్ధాంతాన్ని విశద పరిచాడు కార్ల్ మార్క్స్.

‘యంత్ర భూతముల కోరలు తోమె కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాగ్నులకు, విశాలాక్షులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్!’ అంటాడు శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యానికి ఆ విధంగా పట్టం కట్టాడు మహాకవి. అంతేకాదు ‘నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది? తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు?’ అంటూ నిలదీస్తాడు.

పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో కార్మికులను బానిసల్లా చూశారు. కార్మికులు రోజుకు 16 నుంచి 20 గంటల వరకు పని చేసేవారు. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి కార్మికులు తిరుగుబాట్లు ప్రారంభించారు. ఆనాడు కార్మికులకు ఎటువంటి భద్రత గాని, సౌకర్యాలు గాని వుండేవి కాదు. ఫ్యాక్టరీల్లో గాలి, వెలుతురు సౌకర్యాలు మృగ్యం. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ లేదు. తరచుగా ప్రమాదాలకు గురై మరణించే వారు. కార్మికులు అమానుష శిక్షలకు గురవుతుండేవారు. కార్మికులు తమ పీడనకు వ్యతిరేకంగా యంత్రాలను ధ్వంసం చేసేవారు. ఈ విధ్వంసకాండ బ్రిటన్‌లో ప్రారంభమైంది. యంత్రాలను విచ్ఛిన్నం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ బ్రిటన్‌లో చట్టం చేసారు. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి పోరాటం తప్ప మరో మార్గమే లేదని కార్మికవర్గం గుర్తించింది. కార్మికవర్గం చైతన్యమైన దేశాల్లో ట్రేడ్‌ యూనియన్లు ప్రారంభమయ్యాయి. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా కార్మికులు సమ్మె చేశారు. ఫిలడెల్ఫియా నగరంలో ’మెకానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో కార్మికులు సంఘాలను నిర్మించుకొని పోరాటాలు సాగించారు. ట్రేడ్‌ యూనియన్ల మహత్తర శక్తిని చూసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పాలకులు హడలిపోయారు. 1884 అక్టోబర్‌లో అమెరికా, కెనడాల ఆర్గనైజ్డ్‌ ట్రేడ్‌ అండ్‌ లేబర్‌ యూనియన్ల నాలుగవ మహాసభ జరిగింది. 1886 మే నుండి 8 గంటల పని చట్టబద్దమైన పనిదినంగా వుంటుందని తీర్మానం చేసింది. మే 1వ తేదీన సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చింది. ‘మనిషి జీవితంలో రోజులో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య’ అనే శాస్త్రీయ పద్ధతి కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ పిలుపునకు అశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది కార్మికులు అనేక సంస్ధలు ’8 గంటల పని దినం’ కోసం మే1వ తేదీన సమ్మెలో పాల్గొన్నారు. 1889లో ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్‌ మొదటి కాంగ్రెస్‌ మేడే ను అంతర్జాతీయ కార్మికదినంగా అమలు చేయాలని తీర్మానాన్ని రూపొందించింది. అప్పటి నుంచి మేడేను అధికారికంగా కార్మికలోకం జరుపుకుంటోంది.

కష్ట జీవుల, కార్మికుల పండుగ మేడే. మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక లోకమే. కార్మికులు లేనిదే వ్యవసాయం లేదు. పరిశ్రమలు లేవు. జీవితం లేదు. జీవనం లేదు. ఉత్పత్తి లేదు. పునరుత్పత్తి కూడా లేదు. అసలు ప్రపంచమే లేదు. మానవ చరిత్ర సమస్తం కార్మిక లోకమయమే. అయినా కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చట్టాలు పెట్టుబడిదారులకు చుట్టాలుగా మారుతున్నాయి. చట్టాలెన్ని చేసినా, కనీస వేతనాలు, అమలు కావడం లేదు. పనిదినాలు, పనిగంటలు అన్నవి లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు సైతం పెట్టుబడిదారులు లేదా బడా పారిశ్రామికవేత్తలకే అండగా ఉంటున్నాయి. అందువల్ల కార్మికసంక్షేమం అన్నది మేడిపండు చందంగా మారింది. మల్టీ నేషనల్ కార్పోరేట్‌ రంగం విస్తరించిన తరవాత కార్మికుల జీవితాలకు, జీతాలకు భద్రత, విలువ లేకుండా పోయింది. ప్రధానంగా పనిదినాలు, పనిగంటలు అన్నవి మృగ్యం అయ్యాయి. నిబంధనల మేరకు అనే పద్ధతి పోయింది. కంపెనీల నిబంధనల మేరకు పనిచేయాల్సి వస్తోంది. ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా, పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా కార్మికులు వివక్షను, వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికుల నోట్లో మట్టికొడుతున్నా కార్మిక చట్టాలు పనిచేయడం లేదు.

కానీ ప్రభుత్వాలు కార్పోరేట్‌ కంపెనీల మోచేతి నీళ్లు తాగుతూ కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రపంచం, అభివృద్ది అంతా కూడా కార్మికుల శ్వేదం చిందిస్తేనే సాధ్యం అయ్యిందన్న విషయం మరచిపోతున్నాం. కార్మికవర్గం లేకుంటే ప్రపంచ పురోగతే లేదన్న భావనను అందరూ అర్థం చేసుకోవాలి. మారిన ప్రపంచ పటంలో మారుతున్న కాలంలో ఇంకా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలు కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి. యాజమాన్యాలకు వత్తాసు పలికే బూర్జువా విధానాలను ప్రభుత్వాలు విడనాడాలి. అప్పుడే మేడేకు సార్థకత చేకూరుతుంది. ఎన్నో సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతోనే కార్మికుల హక్కులు సాధ్యం అయ్యాయి. ఆ హక్కులు నిలుపుకోడానికి అవసరమైతే కార్మిక లోకం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

 

 

 

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News