Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

ఇక పల్లెల ప్రగతి పరుగులు పెట్టాలి|EDITORIAL

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక పల్లెలు ప్రగతి రథ చక్రాలపై పరుగులు పెట్టాలి. ఇకిప్పుడు గ్రామ రాజకీయాల దిశ మారాలి. ఎన్నికల సమయంలో సహజంగా ఏర్పడిన పోటీ, విమర్శలు, విభేదాలు, శత్రుభావాలు అక్కడితోనే ముగించాలి. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇప్పుడు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సంయమనంతో, సమన్వయంతో సముచితంగా సాగినప్పుడే నిజమైన గ్రామ ప్రగతి సాధ్యమవుతుంది.

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులు. గ్రామ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. రెండేళ్ళుగా గ్రామ పరిపాలకులు లేక, అధికారుల పాలనలో కునారిల్లిన పంచాయతీల్లో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పైగా బకాయిలు పేరుకుపోయాయి. మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, వీధిలైట్లు, మరమ్మతులు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. వీటికి సరిపడా నిధుల అవసరం ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు కీలకం. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే నిధులు వాటి నిర్వహణకే సరిపోవు. పైగా కరెంటు బిల్లులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొరత, వారి జీతభత్యాలు, అద్దె భవనాల్లో కార్యాలయాలు, వాటి నిర్వహణ వంటి అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పనులు జరగాలి. ఎన్నికల అనంతరం కూడా రాజకీయ విభేదాలు కొనసాగితే అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. దీనివల్ల నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలే.

అయితే, గతంలోలా నిధులు వచ్చే అవకాశాలు తక్కువ. ఉపాధి హామీ నిధులు పంచాయతీలకు వరంగా ఉండేవి. కరువు పనిదినాలు, శ్రమకు తగ్గ మెటీరియల్ కాంపౌండ్, పనులు పూర్తి చేసిన కొద్దీ పెరిగే అపరిమిత నిధులను విపరీతంగా వినియోగించడం ద్వారా ప్రస్తుతం ప్రగతి జరిగింది. కానీ, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని పేరుతోపాటు, విధి విధానాలను మార్చేసింది. 60%-40% కేంద్ర-రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. ఇది ఆశనిపాతం కాగా, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వెక్కిరిస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ రెండేళ్ళుగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 3వేల కోట్ల నిధులే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ మరో 3వేల కోట్లు కలిపితే, 6వేల కోట్లు అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే ఈ నిధులు సమర్థవంతంగా వినియోగించబడాలంటే గ్రామ స్థాయిలో ఐక్యత అవసరం. సర్పంచ్‌, వార్డు సభ్యులు, అధికారులు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ గ్రామానికి ఏ అవసరం ఎక్కువగా ఉందో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలి. కేవలం రాజకీయ లాభనష్టాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.
అలాగే ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఎంతో కీలకం. తమ వాగ్దానాలను మరిచిపోకుండా అమలు చేయాలి. ఓడిన వర్గాలను కూడా కలుపుకొని గ్రామాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే గ్రామంలో సామరస్యం పెరుగుతుంది. ప్రజలు కూడా కేవలం విమర్శకులు, ప్రేక్షకులుగా కాకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. గ్రామ సభలు, సమావేశాల ద్వారా తమ సమస్యలను స్పష్టంగా తెలియజేయాలి.

ఇక అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. నిధుల కేటాయింపు, పనుల అమలులో పారదర్శకత ఉండాలి. అభివృద్ధి పనులపై సామాజిక పర్యవేక్షణ పెరిగితే అవినీతికి అవకాశం తగ్గుతుంది. ఇది గ్రామాభివృద్ధికి మరింత బలాన్నిస్తుంది.

ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే. కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎన్నికల తర్వాత కూడా విభేదాలను కొనసాగిస్తే గ్రామాలు వెనుకబడిపోతాయి. పార్టీలకతీతంగా ఆలోచించి, నిధులు–విధులు–ప్రగతి ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తేనే పల్లెలు నిజంగా ప్రగతి పట్టాలెక్కుతాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే బలమైన, స్వావలంబన గల గ్రామ సమాజం నిర్మించగలుగుతాం.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News