Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా-జవాబులేని ప్రశ్నలు!|EDITORIAL

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, అంతకు మించిన అనుమానాలను కూడా రేకెత్తించింది. బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన పనితీరును ప్రశంసించిన మోడీ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియగానే పొడిగించమో లేదా రాష్ట్రపతిగా ప్రమోట్ చేయడమో జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు. ఒకప్పుడు అద్వానీని రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. కానీ రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెరపైకి తెచ్చి అద్వానీని అవమానించారు. ఈ దేశానికి ప్రధాని కావాలని ప్రగాఢంగా విశ్వసించి పార్టీ కోసం కృషి చేసిన అద్వానీకి మోడీ మెండి చేయి చూపాడు. దాంతో అద్వానీ శకం ముగిసింది. మురళీమనోహర్‌ జోషి జోష్ లేకుండా పోయింది. పాతతరంలో రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలు మాత్రమే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఉన్నారు. వెంకయ్యను పార్టీ నుంచి తప్పించే క్రమంలో ఉపరాష్ట్రపతిని చేసి, ఆ పదవి ముగిసిన వెంటనే ఆయనను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఆ వంతు ధన్‌ఖడ్‌ కు వచ్చినట్లుంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్ ఖడ్ రాజీనామాను రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ ఆమోదమే పలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ధన్ ఖడ్ పేర్కొన్నప్పటికీ, రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని, మరేవో ఉన్నాయన్న అనుమానాలను పలువురు రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను తన పదవిని వదులుకుంటున్నట్లు ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.

అయితే మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా అన్న చర్చ సాగుతోంది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ కావడంతో ఆయన బెంగాల్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు 528 ఓట్లు పొంది 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇదిలావుంటే, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్‌. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్‌.వెంకటరామన్‌ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేవిూ లేకుండానే ధన్‌ఖఢ్‌ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ధన్ ఖడ్ నిర్ణయం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అనే న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభ్యం కావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ సంఘటన తర్వాత విపక్ష పార్టీలు రాజ్యసభలో జస్టిస్‌ వర్మను తొలగించేందుకు ఒక నోటీసును ప్రవేశపెట్టాయి. రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న జగదీప్‌ ధన్‌ఖడ్ ఈ నోటీసును ఆమోదించి, రాజ్యసభ కార్యదర్శికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తోంది. విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ నోటీసును ఆమోదించడం ద్వారా, న్యాయవ్యవస్థలో అవినీతిపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ధన్‌ఖడ్ తప్పించారని కేంద్రం భావించినట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్రంతో విభేదాలు వచ్చాయని పుకార్లు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదల య్యాయని తెలిసింది. ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అయితే, ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా, ధన్‌ఖడ్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం రాత్రి 9:25 గంటలకు ఉప రాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పోస్ట్‌ చేశారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 67(ఎ) ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు- లేఖలో తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో తన పదవీ కాలంలో సహకరించిన వారికి ధన్‌ఖడ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కారణాలు మాత్రమే. ఇంకా ఇతరత్రా ఏ కారణాలు ఉన్నాయన్నది కాలక్రమంలో తెలుస్తుంది. అయితే ధన్‌ఖడ్‌ మోడీకి ఇష్టమైన వ్యక్తిగా అనూహ్యంగా దూసుకుని వచ్చి, అంతకంటే అనూహ్యంగా రాజీనామా చేసి వెళ్లిపోవడమే విధి వైపరీత్యమో? లేక రాజకీయ వైచిత్రమో?

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News