Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

కార్టూనిస్ట్ రమణకు కైమోడ్పులు!|ESSAY|RASANA

కార్టూన్ ను సామాజిక చైతన్యానికి, రాజకీయ అవగాహనకు, సమస్యల పరిష్కారానికి ఒక వాహికగ వినియోగిస్తున్న ఆదర్శ ప్రాయుడు. నిరాడంబర ప్రతిభా మూర్తి ప్రముఖ జర్నలిస్టు, కార్టూనిస్టు రమణ, నేడు తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరపు కీర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా, ప్రముఖ చారిత్రక, సామాజిక పరిశోధకులు, కవి పండితులు, బహు భాషాకోవిదులు, వైద్యులు, డాక్టర్ రాపోలు సత్యానారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం ‘అడుగు’ ఎడిటోరియల్ 

ఒక వ్యాసంల, ఒక వార్తాంశంల చెప్పే విషయాన్ని ఒక కార్టూన్ సులభంగ అర్థం చేయించ కలుగుతది. రాతతోని విపులంగ, గీతతోని సూక్ష్మంగ తెలుగు పాఠకులకు తెలివిడి కలిగిస్తున్న పాత్రికేయ సవ్యసాచి రమణ. మిత్రులు రమణ, రమణా రావు అని పిలుచుకొనే ఆయన పూర్తి పేరు నెల్లుట్ల వెంకట రమణా రావు. సిద్ధిపేటల స్థిరపడ్డ రమణ స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తీగారం గ్రామం. తల్లి తండ్రులు సరోజన – నారాయణ రావు. ఒక అక్క ఉన్నది. రమణ పుట్టిన తేది 1971 జూలై 25.
తండ్రి నారాయణ రావు విద్యుత్ శాఖల ఉద్యోగం చేసే వారు. వరంగల్ జిల్లా మొండ్రాయి, ముస్త్యాల, చేర్యాల ల చేసిండ్రు. ఊర్లు మారినప్పుడల్లా పిల్లల బడులు మారుతుండేది. దీనితోని సిద్ధిపేటకు తమ కుటుంబ మకాం మార్చిన్రు తండ్రి. ఇంక, 9 వ తరగతి నుండి డిగ్రీ వరకు సిద్ధిపేటల చదివిండ్రు రమణ. ఎంకాం ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1994ల పూర్తి చేసిండు. హైదరాబాద్ లనే గురుకృప కాలేజ్ ల 6 ఏండ్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ చేసిండు. 1999ల తల్లి సరోజన మరణించింది. సీనియర్ అసిస్టెంట్ గ 2004 ల పదవీవిరమణ చేసిన తండ్రి నారాయణ రావు 2005 ల చనిపోయిండు. 1997 జూన్ 8 న అరుణతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. కొడుకు సాయి నిఖిల్, బిడ్డ సాయి సమహిత.
పత్రికా రచన పట్ల ఆసక్తి ఉన్న రమణ 2000 సంవత్సరంల ఈ రంగానికి వచ్చిండు. ఈనాడు, ఆంధ్రప్రభ లకు సిద్ధిపేట టౌన్ రిపోర్టర్ గ 2003 దాక చేసిండు. ఆ తరువాత ప్రజాతంత్ర ల చేరి ఏకంగ 11 ఏండ్ల పాటు స్టాఫ్ రిపోర్టర్ గ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నడు. ఐఏఎస్ అధికారి రమణాచారి మన రమణలో ఉన్న కార్టూనిస్ట్ ను పసికట్టి ప్రజాతంత్ర అమర్, అజయ్ ల తోని చెప్పి ఆ దశల కార్టూన్ రంగానికి మరలించిండు. రమణాచారి, అమర్, అజయ్ ల ప్రోత్సాహంతో పాటు మిత్రుడు కలువల మల్లికార్జున్ రెడ్డి ప్రోద్బలం తోడయ్యింది. అప్పుడు ప్రజాతంత్ర వార పత్రికల క్రమం తప్పకుండ రమణ కార్టూన్ చిత్రాలు వచ్చేటియి. గతంల అందరు రిపోర్టర్ లల్ల ఆయనొక రిపోర్టర్. కార్టూనిస్ట్ గ మారినంక తన ఉనికికి కార్టూనిస్ట్ రమణగ ఒక ప్రత్యేకత లభించింది. ఆదర్శ భావాలు, ఆత్మ గౌరవం, వృత్తి నైపుణ్యం, చురుకు తనం, కలుపుకోలు తనం, కష్టపడే తత్వం, నిరాడంబరత్వం, తెలంగాణ వాదం వంటి లక్షణాలు రమణ బలాలు.

కార్టూన్ లే కాకుండ, తెలంగాణ చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ప్రముఖుల చిత్రాలు వేసిండు. 2011 ల ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నాడు తెలంగాణ భవన్ ల ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసిండు. చిత్రాలకు సంక్షిప్త పరిచయం కూర్చి “తెలంగాణ వైతాళికులు”, “తెలంగాణ ముద్దు బిడ్డలు” అనే రెండు పుస్తకాలు అచ్చు వేసిండు. రమణ బొమ్మలు, కార్టూన్ లు బ్రిటన్, అమెరికా ల ఫ్లెక్సీలై వెలిసినయి. తెలంగాణ ఉద్యమ కాలంల లండన్ నుంచి 2 ఏండ్ల పాటు నడిపించిన “తెలంగాణం” పత్రికకు రమణ ఎడిటర్. 2013 నుంచి సోషియల్ మీడియాల చురుకుగ ఉంటున్నడు. కష్టపడి రోజుకు నాలుగు కార్టూన్ ల దాక వేస్తున్నడు. 2017 ల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగ 400 మంది కవులు, కళాకారుల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిండు. 2018 ల “తెలంగాణ పల్లె చిత్రాలు” పేరిట 150 బొమ్మలతో సిద్ధిపేట, హైదరాబాద్ ల ఐదు ఐదు రోజులు ప్రదర్శన జరిపిండు. సూర్య దినపత్రికల 2016 నుండి 6 సంవత్సరాలు స్టాఫ్ రిపోర్టర్ గ చేసి, ప్రస్తుతం ది సిద్ధిపేట టైమ్స్ కు కథనాలు రాస్తున్నడు. మెట్రో పత్రికల చేస్తున్నడు. 2019 ల జూలై 31 న స్వగ్రామం తీగారం వచ్చిన ఆయన అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసు కొన్నడు.

కార్టూన్ ను సామాజిక చైతన్యానికి, రాజకీయ అవగాహనకు, సమస్యల పరిష్కారానికి ఒక వాహికగ వినియోగిస్తున్న రమణ ఆదర్శ ప్రాయుడు. నిరాడంబర ప్రతిభా మూర్తి.
వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఆశించని రమణను తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరపు కీర్తి పురస్కారం వరించటంతో అభిమానులకు అమితానందం కలుగుతున్నది.

~ డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211
(నేడు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార ప్రదానోత్సవం)

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News