మాజీ మంత్రి ధర్మాన బినామీ తమ భూమిని కబ్జా చేసి, రాత్రివేళ రౌడీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారని దళిత మహిళ ఆరోపించారు. బలవంతంగా భూమిని ఖాళీ చేయించడంతోపాటు, కులం పేరుతో దూషణలు చేస్తూ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. వారి రాజకీయ బలం, ధనబలం ముందు నిలబడలేక న్యాయం కోసం అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి జనవాణిని ఆశ్రయించినట్టు చెప్పారు. ఈ అంశంపై జనవాణిలో అర్జీలు స్వీకరించిన శాసనసభ్యులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

