Friday, March 13, 2026
24.7 C
Hyderabad

తేలేది నేడే!|TODAY

క్షణ క్షణం…నిరీక్షణం!
BC|బీసీలకు ఆత్మగౌరవం…|SELF RESPECT
PARTY|పార్టీకి ప్రాణసంకటం…
GOVERNMENT|ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
గంటగంటకూ సమీక్షణం
సంఘాలకు సామాజిక న్యాయం
మంత్రులు, పార్టీ నేతలతో సీఎం సమావేశం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై నేడు విచా‘రణం’

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై దాఖలైన వాయిజ్యంపై నేడు హై కోర్టులో విచారణ జరగనుంది. ఈ తీర్పు ఎలా వస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది బీసీలకు ఆత్మగౌరవంగా, కాంగ్రెస్ పార్టీకి ప్రాణసంకటంగా. మారింది. ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా, బీసీ సంఘాలకు సామాజిక న్యాయ పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గంటగంటకూ ఈ విచారణపై సమీక్ష చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టులో ఇదే కేసును వాదించిన అభిషేక్ సింఘ్వీని ప్రత్యేకంగా హై కోర్టులో వాదించడానికి రప్పిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై నేడు విచా‘రణం’ జరుగుతున్న సందర్భంగా కోర్టుకు కూడా పరీక్షగా, సవాల్ గా నిలిచింది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షి స్తున్నారు. బుధవారం హైకోర్టులో కేసు విచారణకు రానున్న సందర్భంగా మంత్రులు, న్యాయనిపుణలుతో చర్చించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ విూనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం సామాజిక సమతుల్యతకు సంబంధించిన కీలకమైన అంశమని ప్రభుత్వం భావిస్తోంది. కేసు పురోగతిని గంట గంటకు పర్యవేక్షిస్తూ, న్యాయపరంగా ఏ మార్పులు వచ్చినా తక్షణమే వ్యూహాన్ని సవరించుకునేలా ప్రత్యేక టీమ్‌ను సీఎం రేవంత్‌ ఏర్పాటు చేశారు. న్యాయ పోరాటంతో పాటు రాజకీయ, సామాజిక వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా ప్రతి దశలోనూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగిస్తోంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్‌ సింగ్వి, సిద్దార్థ దవే లు హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి లతో కూడిన బృందం ఢల్లీి వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క, మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ సింగ్వి తో ఫోన్‌ లో మాట్లాడారు. బుధవారం హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఢల్లీిలో సింగ్విని కలసి ఇదే విషయమై విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైనదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించాలని వారు కోరారు. హైకోర్టులో జరగనున్న విచారణకు ముందు, కేసు పురోగతిపై సమగ్ర సవిూక్ష జరపాలని సీఎం నిర్ణయించారు.
““““

బీసీ రిజర్వేషన్లపై అటో ఇటో!?
నేడు హైకోర్టులో విచారణ ఎటో?

హైదరాబాద్, అక్టోబర్ 7 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసును హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తో కూడిన ధర్మాసనం విచారించనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతోందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీవోను సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా అన్న ప్రశ్నపై అందరి దృష్టి నిలిచింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం విచారణకు తీసుకోనుంది. ఇంతకుముందు ప్రత్యేక బెంచ్‌ పిటిషనర్లకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. నేటి విచారణలో హైకోర్టు నిర్ణయం ఏంటి? అనేది ప్రభుత్వం, రాజకీయ వర్గాలు, బీసీ సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News