Friday, July 17, 2026
24.5 C
Hyderabad

అవినీతి తప్పే, నిలదీయడం ఒప్పే!|EDITORIAL

ఎదురుదాడి రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీలు ఆరితేరినట్లు కనిపిస్తున్నాయి. తాము చేసిన తప్పులు, అప్పుల గురించి ఎవ్వరూ చర్చించుకోవద్దన్న స్వార్థంతో ఈ రెండు పార్టీలు ఎదుటి పార్టీలపై బురదజల్లాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఏపీలో అప్పులు చేసి, బటన్‌ నొక్కుళ్లతో రాష్ట్రాన్ని దివాళా తీయించి, సొంత ఖజానా నింపుకున్న వైసీపీ, తెలంగాణలో ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అప్పులు చేసి, అవీనీతికి కేరాఫ్ అడ్రస్ గా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ నిలువలు పెంచుకున్న పార్టీ బీఆర్ఎస్ లు ప్రజల మనసుల్లో చెరిపేయలేని ముద్రను వేసుకున్నాయి. విచిత్రంగా ఆ రెండు పార్టీలు కుటుంబ పాలననే సాగించాయి. ఆ రెండు పార్టీలూ ఒకే కుటుంబానికి చెందినవి కాగా, ఆ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డట్లుగా ఆరోపణలు ఎదర్కొంటుండటం విశేషం. ఆ రెండు కుటుంబాలకు చెందిన పార్టీల బ్యాంకు బాలెన్స్ పెరగడం, లక్షల కోట్లకు వారి కుటుంబాల ఆస్తులు పెరగడమే ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాలు దివాళా తీసి, వాళ్ళ కుటుంబాలు మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తడమే అందరినీ ఆశ్చర్యపరస్తున్న అంశాలు.

ఇదిలా వుంటే, ఆ రెండు కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజాతీర్పుని వెలువరించారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు సహజంగానే వాళ్ళ అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు విచారణలు చేపట్టాయి. నివేదికలు కూడా వస్తున్నాయి. ఈ నివేదికలు మరింత నివ్వెర పరస్తున్నాయి. ఈ దశలోనే దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా ఆ పార్టీలు, ఆ కుటుంబాలు నానా గగ్గోలు పెడుతున్నాయి. లెక్కకు మిక్కిలి అప్పులు చేసి ఇప్పుడేమో, అక్రమాలకు పాల్పడి, అవినీతితో పాలన చేసి, ఇప్పుడు మాకా సంగతే తెలియదన్న రీతిలో గందరగోళం చేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మౌనం దాలుస్తారు. ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి నోరు తెరుస్తారు. నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. ఇక వారి కుమారుడు కీటీఆర్‌, అల్లుడు హరీశ్ రావు లు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతుంటారు. ఈ మూడేళ్ళు గడిస్తే, మళ్లీ తమదే అధికారం అన్న అతిశయంతో, తర్వాత ఇవేవీ బయటపడవన్న దీమాతో మాట్లాడుతున్నారా? అనిపిస్తోంది. తమంత తాముగా వాళ్ళే పెంచి పోశించకుని, శత్రువుగా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవేవీ పట్టించుకోకుండా, వారి అవినీతిని వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో వారి అవినీతి అక్రమాలు వెలువడక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది.

అయితే, వీటి అన్నింటిపై నుంచి ప్రజల ఆలోచనలను తప్పించడమే లక్ష్యంగా రోజుకో అంశాన్ని ఎంచుకుని నోళ్ళను నెత్తిపై పెట్టుకుంటున్నారు. గురుకులాలు, హాస్టళ్లు, రైతులు, బనకచర్ల, విద్యుత్‌ పంపిణీ వంటి అనేక అంశాలపై వీరు చేస్తున్న విమర్శలు అంతా చూస్తున్నవే. నిజంగానే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఇవన్నీ బాగా ఉండి వుంటే, ఈ ఏడాదిన్నర, రెండేళ్ళల్లోనే రాష్ట్రం ఇంత నాశనం అయిందా? అన్న అనుమానాలు రాకమానవు. అన్నింటికీ మించి లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైంది? ఎందుకలా అయింది? ముడుపులు ముడితే చాలు ఏమయితే మనకేంటన్న ధోరణిలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిందా? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ ప్రజలు చర్చించుకోవద్దన్న భావనలో రోజూ బనకచర్లను ముందుకేసి విమర్శలు చేస్తున్నారా? ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం ప్రజల్లోకి రావడమెందుకు, ఆయన ప్రజలను కలవాల్సిన పనేముంది? అని వాదించిన కేటీఆర్‌ ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

ఏపీలో జగన్‌ తీరు కూడా దాదాపు ఇలాగే ఉంది. అయితే కాళేశ్వరం నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి సీఎం కేసీఆర్ పాత్రే కీలకమని జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ తేల్చింది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సహా, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, కార్యదర్శి జోషీ, ఈఎన్‌సీలు, సీఈ వంటి అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంటూ నివేదిక రూపొందించింది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకొని.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూ భౌతిక పరీక్షలను శాస్త్రీయ్ర ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్‌ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. దానిని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా.. దీనికి, ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని కమిషన్‌ తేల్చిందని తెలుస్తోంది. వీటి గురించి కేటీఆర్‌, హరీశ్ మాట్లాడరు. నోరులేని గొర్రెల పంపిణీలో వేయికోట్ల మోసం అంటే వీళ్ళు ప్రజల్ని గొర్రెలుగా చూశారా? ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయకుండా వారి నమ్మకాన్ని బీఆర్ఎస్ దెబ్బతీయడం కాక మరేంటి? ప్రభుత్వమే ఒక కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యంగా మారిందనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకే గట్టిగా రంకెలు వేస్తోంది. ఒక్కో అవినీతి బయటపడ్డ కొద్దీ జీర్ణించుకోలేక పోతున్నది. పరిపాలనలో తప్పులు జరిగితే వాటిని వెలికితీయడం లేదా ప్రశ్నించడం మీడియా బాధ్యత, కానీ మీడియా ఆ బాధ్యతను నెరవేరుస్తన్నదా? కొందరికి తాబేదారులుగా మారి, తమ మనుగడ కోసం ప్రజల మనుగడను బలిపెట్టే అధికారం నేతలకే కాదు మీడియాకు కూడా లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ పత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా మీడియా మీద చేసిన వ్యాఖ్యలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రతిస్పందించలేదు. మీడియా సంఘాలు కార్మిక సంఘాలకంటే దిగజారి పోయాయా? నిజంగానే మీడియా దిగజారిందా? పైగా సీఎం అన్నదాంట్లో తప్పేముంది? అనే ధోరణి మీడియా వర్గాల్లోనే వ్యక్తం అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రశ్నించాల్సిన వేళ్ళు ముడుచుకుపోతే రేపటి భవిష్యత్తేంటి? అధికారంతోనే పోలీసులు సహా, అధికారులు అంటకాగుతున్నారు. నేతలు అవినీతిలో కలిసి పోతున్నారు. మీడియా కూడా వాళ్ళతో కలిసిపోతే ఎలా? ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీల పాలననను తిడుతున్నామంటే, కాంగ్రెస్, కూటమి పాలనను సమర్ధిస్తున్నామని కాదు. ఎవరు తప్పు చేసినా? ప్రజల కోణంలోంచి దోషులే? ప్రజల తరపున ప్రశ్నించాల్సిందే. అయినంత మాత్రాన ఎవరికో వ్యతిరేకమో, మరెవ్వరికో అనుకూలమో అని కాదు. ప్రజల్ని చైతన్యం చేయడం, వారి తరపున మాట్లాడటం, నిలువడం, నిలదీయడం అంతా ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసమే.
…..

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News