Thursday, March 12, 2026
26.8 C
Hyderabad

అవినీతి తప్పే, నిలదీయడం ఒప్పే!|EDITORIAL

ఎదురుదాడి రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీలు ఆరితేరినట్లు కనిపిస్తున్నాయి. తాము చేసిన తప్పులు, అప్పుల గురించి ఎవ్వరూ చర్చించుకోవద్దన్న స్వార్థంతో ఈ రెండు పార్టీలు ఎదుటి పార్టీలపై బురదజల్లాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఏపీలో అప్పులు చేసి, బటన్‌ నొక్కుళ్లతో రాష్ట్రాన్ని దివాళా తీయించి, సొంత ఖజానా నింపుకున్న వైసీపీ, తెలంగాణలో ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అప్పులు చేసి, అవీనీతికి కేరాఫ్ అడ్రస్ గా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ నిలువలు పెంచుకున్న పార్టీ బీఆర్ఎస్ లు ప్రజల మనసుల్లో చెరిపేయలేని ముద్రను వేసుకున్నాయి. విచిత్రంగా ఆ రెండు పార్టీలు కుటుంబ పాలననే సాగించాయి. ఆ రెండు పార్టీలూ ఒకే కుటుంబానికి చెందినవి కాగా, ఆ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డట్లుగా ఆరోపణలు ఎదర్కొంటుండటం విశేషం. ఆ రెండు కుటుంబాలకు చెందిన పార్టీల బ్యాంకు బాలెన్స్ పెరగడం, లక్షల కోట్లకు వారి కుటుంబాల ఆస్తులు పెరగడమే ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాలు దివాళా తీసి, వాళ్ళ కుటుంబాలు మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తడమే అందరినీ ఆశ్చర్యపరస్తున్న అంశాలు.

ఇదిలా వుంటే, ఆ రెండు కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజాతీర్పుని వెలువరించారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు సహజంగానే వాళ్ళ అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు విచారణలు చేపట్టాయి. నివేదికలు కూడా వస్తున్నాయి. ఈ నివేదికలు మరింత నివ్వెర పరస్తున్నాయి. ఈ దశలోనే దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా ఆ పార్టీలు, ఆ కుటుంబాలు నానా గగ్గోలు పెడుతున్నాయి. లెక్కకు మిక్కిలి అప్పులు చేసి ఇప్పుడేమో, అక్రమాలకు పాల్పడి, అవినీతితో పాలన చేసి, ఇప్పుడు మాకా సంగతే తెలియదన్న రీతిలో గందరగోళం చేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మౌనం దాలుస్తారు. ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి నోరు తెరుస్తారు. నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. ఇక వారి కుమారుడు కీటీఆర్‌, అల్లుడు హరీశ్ రావు లు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతుంటారు. ఈ మూడేళ్ళు గడిస్తే, మళ్లీ తమదే అధికారం అన్న అతిశయంతో, తర్వాత ఇవేవీ బయటపడవన్న దీమాతో మాట్లాడుతున్నారా? అనిపిస్తోంది. తమంత తాముగా వాళ్ళే పెంచి పోశించకుని, శత్రువుగా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవేవీ పట్టించుకోకుండా, వారి అవినీతిని వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో వారి అవినీతి అక్రమాలు వెలువడక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది.

అయితే, వీటి అన్నింటిపై నుంచి ప్రజల ఆలోచనలను తప్పించడమే లక్ష్యంగా రోజుకో అంశాన్ని ఎంచుకుని నోళ్ళను నెత్తిపై పెట్టుకుంటున్నారు. గురుకులాలు, హాస్టళ్లు, రైతులు, బనకచర్ల, విద్యుత్‌ పంపిణీ వంటి అనేక అంశాలపై వీరు చేస్తున్న విమర్శలు అంతా చూస్తున్నవే. నిజంగానే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఇవన్నీ బాగా ఉండి వుంటే, ఈ ఏడాదిన్నర, రెండేళ్ళల్లోనే రాష్ట్రం ఇంత నాశనం అయిందా? అన్న అనుమానాలు రాకమానవు. అన్నింటికీ మించి లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైంది? ఎందుకలా అయింది? ముడుపులు ముడితే చాలు ఏమయితే మనకేంటన్న ధోరణిలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిందా? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ ప్రజలు చర్చించుకోవద్దన్న భావనలో రోజూ బనకచర్లను ముందుకేసి విమర్శలు చేస్తున్నారా? ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం ప్రజల్లోకి రావడమెందుకు, ఆయన ప్రజలను కలవాల్సిన పనేముంది? అని వాదించిన కేటీఆర్‌ ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

ఏపీలో జగన్‌ తీరు కూడా దాదాపు ఇలాగే ఉంది. అయితే కాళేశ్వరం నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి సీఎం కేసీఆర్ పాత్రే కీలకమని జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ తేల్చింది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సహా, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, కార్యదర్శి జోషీ, ఈఎన్‌సీలు, సీఈ వంటి అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంటూ నివేదిక రూపొందించింది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకొని.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూ భౌతిక పరీక్షలను శాస్త్రీయ్ర ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్‌ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. దానిని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా.. దీనికి, ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని కమిషన్‌ తేల్చిందని తెలుస్తోంది. వీటి గురించి కేటీఆర్‌, హరీశ్ మాట్లాడరు. నోరులేని గొర్రెల పంపిణీలో వేయికోట్ల మోసం అంటే వీళ్ళు ప్రజల్ని గొర్రెలుగా చూశారా? ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయకుండా వారి నమ్మకాన్ని బీఆర్ఎస్ దెబ్బతీయడం కాక మరేంటి? ప్రభుత్వమే ఒక కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యంగా మారిందనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకే గట్టిగా రంకెలు వేస్తోంది. ఒక్కో అవినీతి బయటపడ్డ కొద్దీ జీర్ణించుకోలేక పోతున్నది. పరిపాలనలో తప్పులు జరిగితే వాటిని వెలికితీయడం లేదా ప్రశ్నించడం మీడియా బాధ్యత, కానీ మీడియా ఆ బాధ్యతను నెరవేరుస్తన్నదా? కొందరికి తాబేదారులుగా మారి, తమ మనుగడ కోసం ప్రజల మనుగడను బలిపెట్టే అధికారం నేతలకే కాదు మీడియాకు కూడా లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ పత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా మీడియా మీద చేసిన వ్యాఖ్యలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రతిస్పందించలేదు. మీడియా సంఘాలు కార్మిక సంఘాలకంటే దిగజారి పోయాయా? నిజంగానే మీడియా దిగజారిందా? పైగా సీఎం అన్నదాంట్లో తప్పేముంది? అనే ధోరణి మీడియా వర్గాల్లోనే వ్యక్తం అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రశ్నించాల్సిన వేళ్ళు ముడుచుకుపోతే రేపటి భవిష్యత్తేంటి? అధికారంతోనే పోలీసులు సహా, అధికారులు అంటకాగుతున్నారు. నేతలు అవినీతిలో కలిసి పోతున్నారు. మీడియా కూడా వాళ్ళతో కలిసిపోతే ఎలా? ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీల పాలననను తిడుతున్నామంటే, కాంగ్రెస్, కూటమి పాలనను సమర్ధిస్తున్నామని కాదు. ఎవరు తప్పు చేసినా? ప్రజల కోణంలోంచి దోషులే? ప్రజల తరపున ప్రశ్నించాల్సిందే. అయినంత మాత్రాన ఎవరికో వ్యతిరేకమో, మరెవ్వరికో అనుకూలమో అని కాదు. ప్రజల్ని చైతన్యం చేయడం, వారి తరపున మాట్లాడటం, నిలువడం, నిలదీయడం అంతా ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసమే.
…..

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News