Monday, April 13, 2026
25.7 C
Hyderabad

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ నిర్మించడమే లక్ష్యం

యువత డ్రగ్స్ కి దూరంగా వుండాలి

యువత దేశాభివృద్ధికి ఆలోచించాలి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్ అవగాహన సదస్సు, భారీ ర్యాలీ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎల్ఏ యశస్విని, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు “సే నో టూ డ్రగ్స్” పేరుతో భారీ సదస్సును నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సమాజంపై కలిగే దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు యువత డ్రగ్స్ వైపు మళ్ళకుండా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “సే నో టూ డ్రగ్స్” అనేది కేవలం నినాదం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తవంగా పాటించాల్సిన ఒక సామాజిక బాధ్యతగా మలచాలని ఎమ్మెల్యే యశస్విని అన్నారు. యువత, విద్యార్థులు తమ జీవితాల్లో మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధన కోసం కృషి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నారు. అలాగే సమాజంలో అందరి బాధ్యతగా డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ….డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, నేరప్రవృత్తి పెరిగే ప్రమాదాలు ఉన్నాయి అన్నారు. పాలకుర్తిలో డ్రగ్స్ నివారణకు మనమంతా పూనుకోవాలని అన్నారు. యువత మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తే ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్లొద్దు అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యలను మరింత ఉద్గ్రతరం చేసి, శాశ్వతంగా ఈ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఆత్మీయ అతిథులుగా హాజరైన ఎక్సైజ్ డీఎస్పీ, పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. డ్రగ్స్ ద్వారా జరిగే అనర్థాలను వివరించారు.

ఈ సందర్భంగా అంతకముందు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. ర్యాలీ ద్వారా ప్రజల్లో డ్రగ్స్ వ్యతిరేక పోరాటం మీద చైతన్యం కలిగించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్లు, బొమ్మలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, కొడకండ్ల, పాలకుర్తి మార్కెట్ చైర్పర్సన్లు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/bFCGlRr01YU?si=Yha8ib0M3auhfh7f

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News