Wednesday, July 15, 2026
28 C
Hyderabad

విపత్తుల నిర్వహణ పెను సవాల్!|EDITORIAL

ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. విపత్తులు సంభవించినప్పుడు, దాని నిర్వహణ ఇప్పుడు ఇక్కడ రాసినంత, మీరు చదువుతున్నంత, ఎవరైనా మాట్లాడినంత ఈజీ కాదు. వ్యయ ప్రయాసలతోపాటు ముందస్తు ప్రణాళికలతో కూడినది. విపత్తుల నిర్వహణ ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికైనా సమస్యే. పెను సవాలే. విపత్తుల నిర్వహణకు మన దేశంలో ప్రస్తుతం ఎన్డీఎప్ లాంటి వ్యవస్థలున్నప్పటికీ, అవి సరిపోవడంలేదు. విపత్తులు జరిగినప్పుడే వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. మిగతా సమయాల్లో అవి ఉన్నాయా? లేదా? అన్నంతగా ఉంటాయి. అలాగని వీటిని నిర్లక్ష్యం చేయలేం. చేయకూడదు.
విపత్తుల సమయంలో సకాలంలో స్పందించేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విపత్తు నిర్వహణకు కూడా ఆర్మీలాంటి దళాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మంచిది. భూకంపాలు, అగ్నిప్రమాలు, వరదలు లాంటి ప్రమాదాల సమయాల్లో తక్షణం స్పందించేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏ మూల ప్రమాదం జరిగినా సహాయక చర్యలకు దిగేలా తీర్చిదిద్దాలి. ఇలాంటి దళాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్థిక సంపత్తిని కూడా కట్టబెడితే మంచిది. దీనిద్వారా విపత్తు నిర్వహణతో పాటు, నిరుద్యోగ సమస్యకూడా కొంతమేర తీరవచ్చు.
విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర, రాష్టాల్రు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి. అలాగే దీనిని సైన్యంలో ఒక భాగంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భారత్‌ లాంటి దేశానికి ఇది తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన అనేక విప్తతులను దృష్టిలో పెట్టుకుని తగిన తర్ఫీదు ఇచ్చి స్వయం శక్తిగా దీనిని రూపొదించాలి. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి ఉపద్రవం వచ్చిపడినా తక్షణం రంగంలోకి దిగేలా అన్ని రాష్టాల్ల్రో సన్నద్దంగా ఉండేలా చూడాలి. ఈ దిశగా ఆలోచ నలు చేసి ఆచరణకు సిద్ధపడాలి. ప్రస్తుతం ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను దానిని మరితంగా పటిష్టం చేయాలి. దీనికి ఆర్టీ తరహా వ్యవస్థ అవసరం ఉంది. దేశంలో ఏ మూల ఎలాంటి ఉపద్రవం ముంచుకుని వచ్చినా సకాలంలో చేరుకుని సేవలు అందించే విధంగా తయారు కావాల్సి ఉంది. రైలు ప్రమాదాలు కావచ్చ. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సకాలంలో సత్వర సేవలు అందించే వీలు కలుగుతుంది. ఇటీవలి వరదలు, రైలు ప్రమాదాలు చూశాక శిక్షిత సిబ్బంది అవసరముందని తెలుస్తోంది. దానికి సాంకేతికంగా సహాయ సహకారం అందించాలి. ప్రస్తుతానికి విపత్తులను ఎదుర్కోవడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరించిన మార్గాలే ఇప్పుడు శరణ్యంగా మారాయి. ఈ దుస్థితి పోవాలంటే ఓ అత్యున్నత వ్యవస్థ అవసరం అన్నది గుర్తించాలి. కేంద్ర రాష్ట్రాలు ఇందుకు ముందుకు రావాలి. ఉమ్మడిగా వ్యవస్థను తయారు చేసుకోవాలి. దీనిని ఆర్మీలో భాగంగా చేస్తే మరీ మంచిది. సాధారణ ఆర్మీ ఇలాంటి సమయాల్లో అంతగా పనిచేయకపోవచ్చు. కానీ అప్పుడు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా రంగంలోకి దిగేలా అవకాశం ఉంటుంది.

ఏటా దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల మూలంగా పెద్దయెత్తున నీరు వచ్చి చేరుతుండడంతో ప్రధానమైన డ్యాముల గేట్లను తెరవాల్సి రావడంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. విపత్తుల సమయంలో స్వతంత్ర వ్యవస్థ రంగంలోకి దిగి ప్రజలను కాపాడడంతో పాటు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేలా ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండదు. హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో ఏటా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజాజీవనం అతలాకుతలం అవుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, విరిగిపడుతున్న కొండ చరియలు, తెగిపోయిన రోడ్లు సాధారణ పౌర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సకాలంలో సహాయక శిబిరాలకు తరలించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం అన్నది ఇలాంటి సమయాల్లో ముఖ్యం. పునరావాస శిబిరాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం, మందులు వంటి కనీస సదుపాయాలు కల్పించడం, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రత్యేక యంత్రాంగం ఉండివుంటే వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టే వీలుంటుంది. ప్రస్తుత వ్యవస్థలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర విపత్తు, సహాయక బృందాలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన భూమిక రాష్టాల్రదిగానే ఉంటోంది. అలాగాకుండా వ్యవస్థ ఉంటే సాయం కోసం కేంద్రంవైపు చూడాల్సిన ఆగత్యం రాదు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, చలన చిత్ర పరిశ్రమ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలందిస్తున్నారు.

అయితే ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి విపత్తులు సర్వ సాధారణంగా మారిన దశలో ప్రత్యేక,శాశ్వత ఏర్పాటు అవసరాన్ని గుర్తించాలి. అసాధారణ వరదలు కావడంతో పెద్దయెత్తున ఆస్తినష్టం కలిగించాయి. ఇటీవలి వరదల్లో వేల ఎకరాల్లో పంటలు తుడిచి పెట్టుకునిపోయాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ, సహాయక అథారిటీని పటిష్టపరచినప్పటికీ ఇప్పుడు సంభవించిన విపత్తు అసాధారణమైనది. దీనిని ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. అయినా, పరిస్థితి తీవ్రతకు మించిన వేగంతో ప్రభుత్వం కదిలింది. నదికి ఇరువైపులా వున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ఇకపోతే విపత్తు బృందం ఉంటే నష్టం అంచనా కూడా వెంటనే గుర్తించవచ్చు. లేకుంటే కేంద్రబృందం ఎప్పుడో రావడం…పోటోలు చూడడం.. అంచనా వేయడం జరుగుతోంది. అలా గాకుండా వెంటనే నష్టం అంచనాలు కూడా జరిగిపోవాలి. సహాయక చర్యలతో పాటు పునరావాస చర్యల్లో కూడా ఈ బృందాలు పాల్గొనేలా చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలతో పాటు సకాలంలో సాయం అందగలదు.
…..

Latest News

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

జూలై 15, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 01.43 వరకు ఉపరి విదియ నక్షత్రం పుష్యమి రాత్రి 12.45 వరకు ఉపరి ఆశ్లేష యోగం హర్షణ ఉదయం 11.02 వరకు ఉపరి వజ్ర కరణం బవ మధ్యాహ్నం 01.42...

14 మంది కొడుకులకు ఒకేసారి లగ్గం!?|ADUGU TRENDS

అందరూ లగ్గాలు శేత్తరు. యేడుకలు జరపుతరు. కనీ, గీయినె తీరే యేరు. ఒకేసారి 14 మంది కొడుకులకు 14 మంది పిల్లల్ని సూసి, ఒకే యేదికేసి, ఒకేసారి లగ్గాలు శేసి అవురా అనిపిచ్చిండు....

పల్లె ప్రగతే రాష్ట్ర, దేశ ప్రగతికి పునాది!|EDITORIAL

ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయగలదనే భావన నుంచి ప్రజలు కూడా బయటపడాలి. "నా ఊరు–నా బాధ్యత" అనే భావన ప్రతి పౌరుడిలో పెంపొందాలి. గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రైతు, మహిళా,...

జూలై 14, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 04.00 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు రాత్రి 02.07 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.58 వరకు ఉపరి హర్షణ కరణం నాగవ సాయంత్రం 04.00 వరకు ఉపరి...

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News