Friday, May 29, 2026
33.2 C
Hyderabad

విపత్తుల నిర్వహణ పెను సవాల్!|EDITORIAL

ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. విపత్తులు సంభవించినప్పుడు, దాని నిర్వహణ ఇప్పుడు ఇక్కడ రాసినంత, మీరు చదువుతున్నంత, ఎవరైనా మాట్లాడినంత ఈజీ కాదు. వ్యయ ప్రయాసలతోపాటు ముందస్తు ప్రణాళికలతో కూడినది. విపత్తుల నిర్వహణ ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికైనా సమస్యే. పెను సవాలే. విపత్తుల నిర్వహణకు మన దేశంలో ప్రస్తుతం ఎన్డీఎప్ లాంటి వ్యవస్థలున్నప్పటికీ, అవి సరిపోవడంలేదు. విపత్తులు జరిగినప్పుడే వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. మిగతా సమయాల్లో అవి ఉన్నాయా? లేదా? అన్నంతగా ఉంటాయి. అలాగని వీటిని నిర్లక్ష్యం చేయలేం. చేయకూడదు.
విపత్తుల సమయంలో సకాలంలో స్పందించేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విపత్తు నిర్వహణకు కూడా ఆర్మీలాంటి దళాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మంచిది. భూకంపాలు, అగ్నిప్రమాలు, వరదలు లాంటి ప్రమాదాల సమయాల్లో తక్షణం స్పందించేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏ మూల ప్రమాదం జరిగినా సహాయక చర్యలకు దిగేలా తీర్చిదిద్దాలి. ఇలాంటి దళాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్థిక సంపత్తిని కూడా కట్టబెడితే మంచిది. దీనిద్వారా విపత్తు నిర్వహణతో పాటు, నిరుద్యోగ సమస్యకూడా కొంతమేర తీరవచ్చు.
విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర, రాష్టాల్రు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి. అలాగే దీనిని సైన్యంలో ఒక భాగంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భారత్‌ లాంటి దేశానికి ఇది తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన అనేక విప్తతులను దృష్టిలో పెట్టుకుని తగిన తర్ఫీదు ఇచ్చి స్వయం శక్తిగా దీనిని రూపొదించాలి. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి ఉపద్రవం వచ్చిపడినా తక్షణం రంగంలోకి దిగేలా అన్ని రాష్టాల్ల్రో సన్నద్దంగా ఉండేలా చూడాలి. ఈ దిశగా ఆలోచ నలు చేసి ఆచరణకు సిద్ధపడాలి. ప్రస్తుతం ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను దానిని మరితంగా పటిష్టం చేయాలి. దీనికి ఆర్టీ తరహా వ్యవస్థ అవసరం ఉంది. దేశంలో ఏ మూల ఎలాంటి ఉపద్రవం ముంచుకుని వచ్చినా సకాలంలో చేరుకుని సేవలు అందించే విధంగా తయారు కావాల్సి ఉంది. రైలు ప్రమాదాలు కావచ్చ. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సకాలంలో సత్వర సేవలు అందించే వీలు కలుగుతుంది. ఇటీవలి వరదలు, రైలు ప్రమాదాలు చూశాక శిక్షిత సిబ్బంది అవసరముందని తెలుస్తోంది. దానికి సాంకేతికంగా సహాయ సహకారం అందించాలి. ప్రస్తుతానికి విపత్తులను ఎదుర్కోవడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరించిన మార్గాలే ఇప్పుడు శరణ్యంగా మారాయి. ఈ దుస్థితి పోవాలంటే ఓ అత్యున్నత వ్యవస్థ అవసరం అన్నది గుర్తించాలి. కేంద్ర రాష్ట్రాలు ఇందుకు ముందుకు రావాలి. ఉమ్మడిగా వ్యవస్థను తయారు చేసుకోవాలి. దీనిని ఆర్మీలో భాగంగా చేస్తే మరీ మంచిది. సాధారణ ఆర్మీ ఇలాంటి సమయాల్లో అంతగా పనిచేయకపోవచ్చు. కానీ అప్పుడు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా రంగంలోకి దిగేలా అవకాశం ఉంటుంది.

ఏటా దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల మూలంగా పెద్దయెత్తున నీరు వచ్చి చేరుతుండడంతో ప్రధానమైన డ్యాముల గేట్లను తెరవాల్సి రావడంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. విపత్తుల సమయంలో స్వతంత్ర వ్యవస్థ రంగంలోకి దిగి ప్రజలను కాపాడడంతో పాటు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేలా ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండదు. హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో ఏటా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజాజీవనం అతలాకుతలం అవుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, విరిగిపడుతున్న కొండ చరియలు, తెగిపోయిన రోడ్లు సాధారణ పౌర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సకాలంలో సహాయక శిబిరాలకు తరలించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం అన్నది ఇలాంటి సమయాల్లో ముఖ్యం. పునరావాస శిబిరాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం, మందులు వంటి కనీస సదుపాయాలు కల్పించడం, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రత్యేక యంత్రాంగం ఉండివుంటే వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టే వీలుంటుంది. ప్రస్తుత వ్యవస్థలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర విపత్తు, సహాయక బృందాలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన భూమిక రాష్టాల్రదిగానే ఉంటోంది. అలాగాకుండా వ్యవస్థ ఉంటే సాయం కోసం కేంద్రంవైపు చూడాల్సిన ఆగత్యం రాదు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, చలన చిత్ర పరిశ్రమ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలందిస్తున్నారు.

అయితే ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి విపత్తులు సర్వ సాధారణంగా మారిన దశలో ప్రత్యేక,శాశ్వత ఏర్పాటు అవసరాన్ని గుర్తించాలి. అసాధారణ వరదలు కావడంతో పెద్దయెత్తున ఆస్తినష్టం కలిగించాయి. ఇటీవలి వరదల్లో వేల ఎకరాల్లో పంటలు తుడిచి పెట్టుకునిపోయాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ, సహాయక అథారిటీని పటిష్టపరచినప్పటికీ ఇప్పుడు సంభవించిన విపత్తు అసాధారణమైనది. దీనిని ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. అయినా, పరిస్థితి తీవ్రతకు మించిన వేగంతో ప్రభుత్వం కదిలింది. నదికి ఇరువైపులా వున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ఇకపోతే విపత్తు బృందం ఉంటే నష్టం అంచనా కూడా వెంటనే గుర్తించవచ్చు. లేకుంటే కేంద్రబృందం ఎప్పుడో రావడం…పోటోలు చూడడం.. అంచనా వేయడం జరుగుతోంది. అలా గాకుండా వెంటనే నష్టం అంచనాలు కూడా జరిగిపోవాలి. సహాయక చర్యలతో పాటు పునరావాస చర్యల్లో కూడా ఈ బృందాలు పాల్గొనేలా చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలతో పాటు సకాలంలో సాయం అందగలదు.
…..

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News