Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

పేదరికం తగ్గుతోందా? పెరుగుతోందా!?|EDITORIAL

భారతదేశంలో పేదరిక నిర్మూలన నిరర్ధక ప్రయాసగా మారింది. శాస్త్రీయ ప్రమాణాలులేని కాకిలెక్కలుగా మిగిలిపోయింది. పేదరికం, పేదలు రాజకీయాలకు ఇరుసు, ఇంధనంగా నాయకులు గ్రహించారు. పేదల పేరుతో పథకాలు ప్రకటించడం, వాటి అమలు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచేయడం, తద్వారా ఓట్లుగా మలచుకోవడం రాజకీయ క్రీడగా నిరంతరం కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఉపాధి హామీ పథకం పేరు మార్పు చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ తెలిసిందే. ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. అసలు సమస్య పథకం పేరులో ఉందా? లేక దాని అమలులో ఉందా? అన్న విచక్షణ లేకుండా రాజకీయాలు చేయడం గమనార్హం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిజమైన నిర్మాణాత్మక పనులే జరిగాయా? అంటే దాదాపుగా లేదు. మట్టి ఎత్తిపోసే పనులు తప్ప, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనులు కనిపించలేదు. వేల కోట్లు మట్టిపాలైనా, వ్యవసాయ పనులకు కూలీల కొరత పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇదే పథకంతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని గొప్పగా ప్రకటిస్తోంది. నిజంగా అలా జరిగి ఉంటే, ఉచిత బియ్యం, ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత గ్యాస్‌ వంటి పథకాలెందుకు? ఒకవైపు పేదరికం తగ్గిపోయిందని చెబుతూనే, మరోవైపు పేదల పేరుతో పథకాలు సాగిస్తుండటం పాలకుల ద్వంద్వ వైఖరికి పరాకాష్ట.

ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం భారత్‌లో పేదలు కేవలం 5.25 శాతం మాత్రమే! రోజుకు తలసరి ఖర్చు రూ.62 కంటే తక్కువగా ఉన్నవారే పేదలని ఆ సంస్థ నిర్ణయించింది. అలాగే, నీతి ఆయోగ్‌ కూడా 2022–23 నాటికి దేశంలో నిరుపేదలు 5 శాతం మాత్రమే ఉన్నారని ప్రకటించింది. గ్రామాల్లో రోజుకు రూ.57, పట్టణాల్లో రూ.69 ఆదాయం ఉంటే పేదలు కాదన్నదే వారి ప్రమాణం. ఈ లెక్కన చూస్తే ఆ ఆదాయంతో ఆహారం, వైద్యం, దుస్తులు, రవాణా, అద్దె వంటి అవసరాలు తీర్చుకోవడం అసాధ్యం. ఈ ప్రమాణాల ప్రకారం జీవించగలిగేవారు ఇల్లు లేని బిచ్చగాళ్లే కావాల్సి వస్తుంది.

ఇలాంటి తప్పుడు లెక్కల తక్కెడ ఆధారంగా మరో ఏడాదిలో దేశంలో పేదలేరని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాస్తవంలో పెరుగుతున్న విద్య, వైద్య ఖర్చులు కోట్లాదిమందిని పేదరికంలోకి నెడుతున్నాయి. కనీస పౌష్టికాహారం కూడా అందని పరిస్థితుల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. పౌష్టికాహార ప్రమాణాలను ఆధారంగా తీసుకుని పేదరిక స్థాయిని నిర్ణయిస్తే, ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మూడింతలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఆ స్థాయికి దిగువన ప్రస్తుతం దాదాపు 65 శాతం ప్రజలు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి.

ప్రపంచ బ్యాంక్‌ రోజుకు 3 డాలర్లు పేదరిక స్థాయిగా నిర్ణయించినా, వాస్తవ మారకపు విలువ ప్రకారం లెక్కించకుండా, అధికారిక లెక్కలకు దగ్గరగా ఉండేలా సవరణలు చేస్తోంది. ఈ విధానం అనేక దేశాల్లో పేదరికాన్ని కృత్రిమంగా తగ్గించి చూపించడానికి ఉపయోగపడుతోంది. ఇలాంటి లెక్కలతో ప్రజల జీవన వాస్తవాలను అవహేళన చేయడమే జరుగుతోంది.

పేదరిక నిర్మూలన అంటే కేవలం కూడు, గూడు, గుడ్డ అందించడమే కాదు. బతకడానికి పని ఉండాలి, ఆ పని ద్వారా కుటుంబాన్ని పోషించగలిగే ఆదాయం రావాలి. కానీ ఈ అంశాలు ఏ లెక్కల్లోనూ చోటు దక్కించుకోవడం లేదు. కాలానుగుణంగా మారుతున్న కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పాత ప్రమాణాలతోనే పేదరికాన్ని కొలవడం అర్థరహితం. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అందిన విద్య, వైద్యం ఇప్పుడు ప్రైవేటు రంగానికి వెళ్లిపోయాయి. వాటి ఖర్చులు సామాన్యుడికి భరించలేనివిగా మారాయి.
జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తలసరి పౌష్టికాహార లభ్యత వేగంగా తగ్గుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించి పేదరికం తగ్గిందని చెప్పుకోవడం ఆత్మవంచనతో సమానం. నిజమైన పేదరిక నిర్మూలన కోసం దుర్భర దారిద్యంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి స్థిరమైన ఉపాధి, నాణ్యమైన విద్య, చౌకైన వైద్యం అందించే స్పష్టమైన విధానాలు అవసరం. లెక్కల మాయాజాలంతో పేదరికం అంతరించిందని చెప్పుకోవడం దేశానికి మేలు కంటే కీడే చేస్తుంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News