Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

పేదరికం తగ్గుతోందా? పెరుగుతోందా!?|EDITORIAL

భారతదేశంలో పేదరిక నిర్మూలన నిరర్ధక ప్రయాసగా మారింది. శాస్త్రీయ ప్రమాణాలులేని కాకిలెక్కలుగా మిగిలిపోయింది. పేదరికం, పేదలు రాజకీయాలకు ఇరుసు, ఇంధనంగా నాయకులు గ్రహించారు. పేదల పేరుతో పథకాలు ప్రకటించడం, వాటి అమలు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచేయడం, తద్వారా ఓట్లుగా మలచుకోవడం రాజకీయ క్రీడగా నిరంతరం కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఉపాధి హామీ పథకం పేరు మార్పు చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ తెలిసిందే. ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. అసలు సమస్య పథకం పేరులో ఉందా? లేక దాని అమలులో ఉందా? అన్న విచక్షణ లేకుండా రాజకీయాలు చేయడం గమనార్హం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిజమైన నిర్మాణాత్మక పనులే జరిగాయా? అంటే దాదాపుగా లేదు. మట్టి ఎత్తిపోసే పనులు తప్ప, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనులు కనిపించలేదు. వేల కోట్లు మట్టిపాలైనా, వ్యవసాయ పనులకు కూలీల కొరత పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇదే పథకంతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని గొప్పగా ప్రకటిస్తోంది. నిజంగా అలా జరిగి ఉంటే, ఉచిత బియ్యం, ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత గ్యాస్‌ వంటి పథకాలెందుకు? ఒకవైపు పేదరికం తగ్గిపోయిందని చెబుతూనే, మరోవైపు పేదల పేరుతో పథకాలు సాగిస్తుండటం పాలకుల ద్వంద్వ వైఖరికి పరాకాష్ట.

ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం భారత్‌లో పేదలు కేవలం 5.25 శాతం మాత్రమే! రోజుకు తలసరి ఖర్చు రూ.62 కంటే తక్కువగా ఉన్నవారే పేదలని ఆ సంస్థ నిర్ణయించింది. అలాగే, నీతి ఆయోగ్‌ కూడా 2022–23 నాటికి దేశంలో నిరుపేదలు 5 శాతం మాత్రమే ఉన్నారని ప్రకటించింది. గ్రామాల్లో రోజుకు రూ.57, పట్టణాల్లో రూ.69 ఆదాయం ఉంటే పేదలు కాదన్నదే వారి ప్రమాణం. ఈ లెక్కన చూస్తే ఆ ఆదాయంతో ఆహారం, వైద్యం, దుస్తులు, రవాణా, అద్దె వంటి అవసరాలు తీర్చుకోవడం అసాధ్యం. ఈ ప్రమాణాల ప్రకారం జీవించగలిగేవారు ఇల్లు లేని బిచ్చగాళ్లే కావాల్సి వస్తుంది.

ఇలాంటి తప్పుడు లెక్కల తక్కెడ ఆధారంగా మరో ఏడాదిలో దేశంలో పేదలేరని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాస్తవంలో పెరుగుతున్న విద్య, వైద్య ఖర్చులు కోట్లాదిమందిని పేదరికంలోకి నెడుతున్నాయి. కనీస పౌష్టికాహారం కూడా అందని పరిస్థితుల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. పౌష్టికాహార ప్రమాణాలను ఆధారంగా తీసుకుని పేదరిక స్థాయిని నిర్ణయిస్తే, ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మూడింతలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఆ స్థాయికి దిగువన ప్రస్తుతం దాదాపు 65 శాతం ప్రజలు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి.

ప్రపంచ బ్యాంక్‌ రోజుకు 3 డాలర్లు పేదరిక స్థాయిగా నిర్ణయించినా, వాస్తవ మారకపు విలువ ప్రకారం లెక్కించకుండా, అధికారిక లెక్కలకు దగ్గరగా ఉండేలా సవరణలు చేస్తోంది. ఈ విధానం అనేక దేశాల్లో పేదరికాన్ని కృత్రిమంగా తగ్గించి చూపించడానికి ఉపయోగపడుతోంది. ఇలాంటి లెక్కలతో ప్రజల జీవన వాస్తవాలను అవహేళన చేయడమే జరుగుతోంది.

పేదరిక నిర్మూలన అంటే కేవలం కూడు, గూడు, గుడ్డ అందించడమే కాదు. బతకడానికి పని ఉండాలి, ఆ పని ద్వారా కుటుంబాన్ని పోషించగలిగే ఆదాయం రావాలి. కానీ ఈ అంశాలు ఏ లెక్కల్లోనూ చోటు దక్కించుకోవడం లేదు. కాలానుగుణంగా మారుతున్న కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పాత ప్రమాణాలతోనే పేదరికాన్ని కొలవడం అర్థరహితం. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అందిన విద్య, వైద్యం ఇప్పుడు ప్రైవేటు రంగానికి వెళ్లిపోయాయి. వాటి ఖర్చులు సామాన్యుడికి భరించలేనివిగా మారాయి.
జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తలసరి పౌష్టికాహార లభ్యత వేగంగా తగ్గుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించి పేదరికం తగ్గిందని చెప్పుకోవడం ఆత్మవంచనతో సమానం. నిజమైన పేదరిక నిర్మూలన కోసం దుర్భర దారిద్యంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి స్థిరమైన ఉపాధి, నాణ్యమైన విద్య, చౌకైన వైద్యం అందించే స్పష్టమైన విధానాలు అవసరం. లెక్కల మాయాజాలంతో పేదరికం అంతరించిందని చెప్పుకోవడం దేశానికి మేలు కంటే కీడే చేస్తుంది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News