అందరూ లగ్గాలు శేత్తరు. యేడుకలు జరపుతరు. కనీ, గీయినె తీరే యేరు. ఒకేసారి 14 మంది కొడుకులకు 14 మంది పిల్లల్ని సూసి, ఒకే యేదికేసి, ఒకేసారి లగ్గాలు శేసి అవురా అనిపిచ్చిండు. గదేందో సూద్దాం పదండ్రి.

గది మధ్యప్రదేశ్ రాస్ట్రంల సాత్నా… ఒకాయినె రైతు. గాయినెకు 14 మంది కొడుకులు. గా కొడుకులందరి లగ్గాలు శేసుడంటే మాటలా? మస్తు కర్సైతది. గతంతా తప్పల్నాంటే ఏం శేయాల్నో బాగా ఆలోసించిండు. ఇగ గిదంత పని కాదని, 14 మంది కొడుకులకు 14 పెండ్లి పిల్లల్ని సూసిండు. గవాళ్లందరికీ ఒకే యేదికేసిండు. ఒకే రోజు, ఒకే తిథి, ఒకే మూర్తానికి లగ్గాలు శేసిండు. ఊరందరినీ పిలిసి బువ్వ పెట్టిండు. ఇగ గా పెండ్లి పిల్లల్ని, కొడుకుల్ని యేరేరు ట్రాక్టర్లల్ల కుర్సీలేసి వరసగ కూసోపెట్టి ఊరేగించుకుంట.. లగ్గం కాడికి తీసుకపోయిండు. ఇగ గదిప్పుడు నెట్టింట తెగ వైరలైతాంది.

