Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

తుఫాన్ దెబ్బమీద మరో తుఫాన్!|EDITORIAL

మొంథా బీభత్సాన్ని మరకవ ముందే మరో తుఫాన్‌ దిత్వాహ్ దూసుకువస్తోంది. పెను బీభత్సం పొంచివుంది. అది ఎంతటి నష్టాన్ని కలిగిస్తోందో? ఎన్ని ప్రాణాలను బలితీసుకుంటుందో? ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు ఓర్వాల్సి వస్తుందో? ఏయే ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందో? తుఫాన్ అంటే చాలు ప్రజలు, ప్రభుత్వాలు, ప్రత్యేకించి రైతులు వణికిపోతున్నారు. ముందు జాగ్రత్త, నష్ట నివారణే తప్ప తుఫాన్లను ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. చివరకు ప్రభుత్వాలకు కూడా. ప్రకృతి ప్రకోపిస్తే గడ్డి పోచలా తల వంచడమే తప్ప, చేయగలిగిందేమీ లేదు. ఇది మన, మన ప్రజల, రైతుల అనుభవ సారం.
అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టిలు, తుఫాన్లు రైతుల పాలిట శాపంగా మారాయి. సమయానుకూల వర్షాలే లేకుండా పోయాయి. ఆలస్యంగా లేదా ముందుగానే వర్షాలు పడుతున్నాయి. మన దేశంలో పంటలన్నీ దాదాపు వర్షాధారమే. దీంతో సాగు సమస్యగా మారి, రైతుల సావుకు వస్తున్నది. నష్ట నివారణ సాధ్యం కాదు. కానీ, నష్ట పరిహారం కూడా అందక రైతులు దిగాలుగా దివాళా తీస్తున్నారు. పంటలకు నేటికీ బీమా లేకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్రా అంటూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

తీరప్రాంతాలు ప్రకృతి విపత్తులకు శాశ్వత కేంద్రాలుగా మారాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులతో పాటు వివిధ వృత్తులపై ఆధారపడే లక్షలాది మంది ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా సహజ విపత్తుల కడలిలో ఆయా ప్రజలు మనుగడ సాగించక తప్పని స్థితి దాపురించింది. ఈ ఏడాది ఇంతకుమందు విరుచుకుపడిన మొంథా తుఫాన్ తీరని నష్టాన్నే మిగిల్చింది. పెరిగిన సాంకేతికత ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించినప్పటికీ, పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. పైగా వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల తీరు కూడా మారింది. ఊహించని చోట, ఊహించని విధంగా క్లౌడ్ బరస్ట్ జరిగి, గంటల తరబడి కుండపోతగా వర్షం కురవడం, వాగులు, వంకలు పొంగి అనూహ్య వరదలు చోటు చేసుకోవడం, విపరీతమైన వేగంతో గాలి వీచడం వంటి వైపరీత్యాలు సాధారణంగా మారుతున్నాయి. దీంతో నష్టం భారీగా పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

నిజానికి మొంథా తుపాన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏపీలోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాన్ బారినపడ్డాయి. 10 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1.11 లక్షల మంది నిరాశ్రయులైనారు. 1.61 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగి, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టమూ ఉంది. మొంథా తుఫాన్ కారణంగా రూ.6,384 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ లెక్కల మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది వేరే విషయం.
కేంద్ర సాయం ఇంకా రాష్ట్రానికి అందని ఈ సమయంలో మరో తుఫాన్ హెచ్చరిక మూలిగే నక్కపైన తాటి పండు పడ్డట్లుగానే ఉన్నది. ఈ నేపథ్యంలో విపత్తు అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వం వేగంగా, ఉదారంగా స్పందించాలి. హుద్‌హుద్‌ తుఫాన్‌ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి.

అదే సమయంలో రాష్ట్రం పూర్తిగా కేంద్రంపై మాత్రమే ఆధారపడ కూడదు. నష్ట పరిహారానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే, రాష్ట్ర పరంగా అన్నింటికీ సంసిద్ధం కావాలి. విపత్తుల నివారణ, తక్షణ సహాయానికి ప్రత్యేక నిధిని సిద్ధంగా ఉంచాలి. ఆ నిధిని పరిహారంగా బాధిత ప్రజలకు అందేలా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతూనే, ప్రజల్లో చైతన్యం కలిగించి, విపత్తుల నివారణకు పూనుకోవాలి. వైపరీత్యాలపై కూడా ప్రజలకు ప్రభుత్వం ఉందన్న భరోసానివ్వాలి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News